Political News

హైకోర్టు షాక్: లోకేష్ కు 41ఏ నోటీసులు

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను సీఐడీ ఏ14గా చేర్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే హైకోర్టులో లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే ఆ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. లోకేష్ కు సీఆర్పీసీ 41ఏ ప్రకారం నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. అంతేకాదు, సీఐడీ విచారణకు సహకరించాలని లోకేష్ కు హైకోర్టు సూచించింది. దీంతో, లోకేష్ కు 41 ఏ ప్రకారం నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. విచారణకు ఎప్పుడు రావాలన్ని విషయాన్ని ఆ నోటీసుల్లో సీఐడీ అధికారులు వెల్లడించనున్నారు.

ఇక, ఏపీ ఫైబర్ గ్రిడ్, స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ కేసులలో లోకేష్ ముందస్తు బెయిల్ పై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ రోజు మధ్యాహ్నం వాటిపై విచారణ జరగనుంది. ఇప్పటికే లోకేష్ కు నోటీసులు ఇచ్చేందుకు ఢిల్లీలో సీఐడీ అధికారులు రెడీ అయ్యారని తెలుస్తోంది. ఎన్ని రోజుల్లోగా విచారణకు రావాలన్న విషయంపై ఉత్కంఠ ఏర్పడింది. మరోవైపు, చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీం కోర్టులో, హైకోర్టులో ముందస్తు బెయిల్, ఏసీబీ కోర్టులో కస్డడీ, బెయిల్ పిటిషన్ లపై విచారణ జరగాల్సి ఉంది.

This post was last modified on September 29, 2023 4:09 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

9 minutes ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

53 minutes ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

1 hour ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

2 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

2 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

3 hours ago