అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను సీఐడీ ఏ14గా చేర్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే హైకోర్టులో లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే ఆ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. లోకేష్ కు సీఆర్పీసీ 41ఏ ప్రకారం నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. అంతేకాదు, సీఐడీ విచారణకు సహకరించాలని లోకేష్ కు హైకోర్టు సూచించింది. దీంతో, లోకేష్ కు 41 ఏ ప్రకారం నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. విచారణకు ఎప్పుడు రావాలన్ని విషయాన్ని ఆ నోటీసుల్లో సీఐడీ అధికారులు వెల్లడించనున్నారు.
ఇక, ఏపీ ఫైబర్ గ్రిడ్, స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ కేసులలో లోకేష్ ముందస్తు బెయిల్ పై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ రోజు మధ్యాహ్నం వాటిపై విచారణ జరగనుంది. ఇప్పటికే లోకేష్ కు నోటీసులు ఇచ్చేందుకు ఢిల్లీలో సీఐడీ అధికారులు రెడీ అయ్యారని తెలుస్తోంది. ఎన్ని రోజుల్లోగా విచారణకు రావాలన్న విషయంపై ఉత్కంఠ ఏర్పడింది. మరోవైపు, చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీం కోర్టులో, హైకోర్టులో ముందస్తు బెయిల్, ఏసీబీ కోర్టులో కస్డడీ, బెయిల్ పిటిషన్ లపై విచారణ జరగాల్సి ఉంది.
This post was last modified on September 29, 2023 4:09 pm
ఒకప్పుడు హిందీ సినిమాలు తెలుగులోకి అనువాదం కావడం, ఇక్కడ పెద్ద స్థాయిలో రిలీజ్ కావడమే ఉండేది తప్ప.. తెలుగు చిత్రాలు…
మాజీ మంత్రి మల్లారెడ్డి స్టేజ్ ఎక్కారంటే, మైక్ అందుకున్నారు అంటే మెరుపులు మెరవాల్సిందే. అది రాజకీయ సభ అయినా.. సినిమా…
మన దేశంలో చాలా చోట్ల కోతుల బెడద ఉంది. అడవుల నరికివేత, పట్టణీకరణ నేపథ్యంలో కోతులు జనావాసాల మధ్యకు వచ్చాయి.…
అల్లు అర్జున్ అంటే ఒకప్పుడు మెగా హీరోల్లో ఒకడు. అతను మెగాస్టార్ చిరంజీవినో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్నో పొగిడితేనో..…
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఇరుముడి తప్ప మరొక మాట వినిపించదేమో అన్న రేంజ్ లో వసూళ్లు హోరెత్తిపోతున్నాయి. ఈ జోరు…
ఇంకో నాలుగు రోజుల్లో విడుదల కాబోతున్న టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ మల్లారెడ్డి యునివర్సిటిలో ఘనంగా జరిగింది. తెలుగు…