అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను సీఐడీ ఏ14గా చేర్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే హైకోర్టులో లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే ఆ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. లోకేష్ కు సీఆర్పీసీ 41ఏ ప్రకారం నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. అంతేకాదు, సీఐడీ విచారణకు సహకరించాలని లోకేష్ కు హైకోర్టు సూచించింది. దీంతో, లోకేష్ కు 41 ఏ ప్రకారం నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. విచారణకు ఎప్పుడు రావాలన్ని విషయాన్ని ఆ నోటీసుల్లో సీఐడీ అధికారులు వెల్లడించనున్నారు.
ఇక, ఏపీ ఫైబర్ గ్రిడ్, స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ కేసులలో లోకేష్ ముందస్తు బెయిల్ పై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ రోజు మధ్యాహ్నం వాటిపై విచారణ జరగనుంది. ఇప్పటికే లోకేష్ కు నోటీసులు ఇచ్చేందుకు ఢిల్లీలో సీఐడీ అధికారులు రెడీ అయ్యారని తెలుస్తోంది. ఎన్ని రోజుల్లోగా విచారణకు రావాలన్న విషయంపై ఉత్కంఠ ఏర్పడింది. మరోవైపు, చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీం కోర్టులో, హైకోర్టులో ముందస్తు బెయిల్, ఏసీబీ కోర్టులో కస్డడీ, బెయిల్ పిటిషన్ లపై విచారణ జరగాల్సి ఉంది.
This post was last modified on September 29, 2023 4:09 pm
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…