Political News

కూక‌ట్‌ప‌ల్లి టికెట్ కోట్లు ప‌లుకుతోందా? అన్ని పార్టీల్లోనూ చ‌ర్చ‌

కో.. కోటి! అని తెలుగులో ఓ పాట ఉంది. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల స‌మ‌యంలోనూ.. ఇదే పాట వినిపి స్తోంది. అత్యంత కీల‌క‌మైన కూక‌ట్‌ప‌ల్లి టికెట్ కోట్ల రూపాయ‌లు ప‌లుకుతున్న‌ట్టు దాదాపు అన్ని పార్టీల్లో నూ చ‌ర్చ సాగుతోంది. కూక‌ట్‌ప‌ల్లి టికెట్‌ను కోరుకునేవారి సంఖ్య పెరుగుతోంది. పైగా..ఈ టికెట్ కోసం కోట్ల రూపాయ‌లు పార్టీల‌కు ఫండ్‌గా ఇచ్చేందుకు కూడా కొంద‌రు పారిశ్రామిక వేత్త‌లు ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు స‌మాచారం.

గ‌త 2018 ఎన్నిక‌ల్లో బీఆర్ ఎస్ పార్టీ ఇక్క‌డ విజ‌యం ద‌క్కించుకుంది. ఈ పార్టీ త‌ర‌ఫున పోటీ చేసిన మాధ‌వ‌రం కృష్ణారావు 41 వేల ఓట్ల మెజారిటీతో గెలుపు గుర్రం ఎక్కారు. దీనికి ముందు రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత జ‌రిగిన తొలి ఎన్నిక‌ల్లో ఇదే కృష్ణారావు టీడీపీ త‌ర‌ఫున ఇక్క‌డ నుంచి పోటీ చేసి 43 వేల పైచిలుకు ఓట్ల‌తో విజయం ద‌క్కించుకున్నారు. ఇక‌, 2018లో కాంగ్రెస్ పార్టీ టీడీపీతో చేతులు క‌లిపిన నేప‌థ్యంలో ఈ టికెట్‌ను టీడీపీ త‌ర‌ఫున నంద‌మూరి హ‌రికృష్ణ కుమార్తె సుహాసినికి కేటాయించారు.

గ‌ట్టి పోటీ ఇచ్చినా.. నంద‌మూరి బాల‌కృష్ణ వంటివారు ప్ర‌చారం చేసినా.. సుహాసిని గెలుపు గుర్రం ఎక్క‌లేదు. క‌ట్ చేస్తే.. ఇప్పుడు మ‌రోసారి తెలంగాణ ఎన్నిక‌ల ముంగిట కూక‌ట్‌ప‌ల్లి టికెట్ కోసం.. కాంగ్రెస్‌, బీజేపీ, టీడీపీ లు తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. టీడీపీలోనే ఓ కీల‌క నాయ‌కుడు ఈ టికెట్ త‌న‌కు ఇవ్వాల‌ని.. మాధ‌వ‌రంను ఓడించి తీరుతాన‌ని.. పార్టీని గెలిపించే బాధ్య‌త త‌న‌మీద వేసుకుంటాన‌ని చెబుతున్నార‌ట‌.

ఇక, కాంగ్రెస్ విష‌యానికి వ‌స్తే.. టీటీడీ మాజీ చైర్మ‌న్ సుబ్బిరామిరెడ్డి ద్వారా.. ఈ టికెట్ కోసం ఒక కీల‌క పారిశ్రామిక వేత్త ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు కూక‌ట్‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో జోరుగా వినిపిస్తున్న మాట‌. రెండు కోట్ల రూపాయ‌లు పార్టీకి ఫండ్‌గా ఇచ్చేందుకు, అదేస‌మయంలో మ‌రో రెండు మూడు నియోజ‌క వ‌ర్గాల‌కు డ‌బ్బు స‌మ‌కూర్చేందుకు కూడా స‌ద‌రు పారిశ్రామిక వేత్త రెడీగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. దీనిపై పార్టీ అధిష్టానం వ‌ద్దే చ‌ర్చ జ‌ర‌గ‌నుంద‌ని.. అంటున్నారు.

మ‌రోవైపు బీఆర్ ఎస్ త‌ర‌ఫున మాధ‌వ‌రం పోటీ చేసినా.. ఈ సారి ఆయ‌న గ్రాఫ్ త‌గ్గింద‌నే అంచ‌నాలు వ‌స్తుండ‌డం.. వ‌రుస విజ‌యాలు సాధించినా.. త‌మ‌ను ప‌ట్టించుకోలేద‌ని.. మాధ‌వ‌రంపై ఇక్క‌డి ప్ర‌జలు పెద‌వి విర‌వ‌డం వంటి అంశాలు.. ఇత‌ర పార్టీల్లో ఈ టికెట్ ను హాట్ టాపిక్‌గా మార్చాయి. ఇక్క‌డ దాదాపు అంద‌రూ కూడా ఏపీ నుంచి వ‌చ్చిన సెటిల‌ర్లే ఉండ‌డం కూడా నాయ‌కుల‌ను ఊరిస్తోంది.

This post was last modified on September 28, 2023 1:41 pm

Share

Recent Posts

ఎట్ట‌కేల‌కు తెలుగులో తొలి హిట్టు

త‌మిళంలో పెద్ద స్టార్‌గా ఎదిగిన‌ శివ కార్తికేయ‌న్ లాగే టీవీ రంగం నుంచి ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన అమ్మాయి ప్రియ భ‌వానీ…

2 hours ago

చిరంజీవి ఎవ‌రినీ తొక్క‌డ‌య్యా…

తెలుగులో తెర మీద హీరోల‌కు ఎలివేష‌న్లు ఇవ్వ‌డంలో చాలామంది ద‌ర్శ‌కులు త‌మ నైపుణ్యాన్ని చూపిస్తుంటారు కానీ.. వేదిక‌ల మీద ఎలివేష‌న్లు…

2 hours ago

త‌మిళ ప్రేక్ష‌కులకో దండం

ఒకప్పుడు త‌మిళ ప్రేక్ష‌కుల అభిరుచి గురించి ఇత‌ర భాష‌ల వాళ్లు గొప్ప‌గా చెప్పుకునేవాళ్లు. కొత్త త‌ర‌హా సినిమాల‌ను, ప్ర‌యోగాత్మ‌క చిత్రాల‌ను…

2 hours ago

లోక‌ల్ ఫైట్‌: జ‌గ‌న్‌ ముందే చేతులెత్తేశారా?

ఏపీలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు ముహూర్తం రెడీ అవుతోంది. ప్ర‌భుత్వం వైపు నుంచి ఈ ఎన్నిక‌ల‌కు గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చేసింది.…

3 hours ago

వైసీపీ ఓటు బ్యాంకు స్థిర‌మేనా..?

వైసీపీ ఓటు బ్యాంకు స్థిర‌మేనా? ఆ పార్టీ చెబుతున్న‌ట్టు 40 శాతం ఓటు బ్యాంకు వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కు అలానే…

3 hours ago

థియేటర్లకు జై కొడుతున్న తెలుగు ప్రేక్షకులు

జూన్ నుంచి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. ఎలాంటి టికెట్ రేట్ల పెంపు పంచాయితీ లేకుండా ఉన్న ధరలతోనే ప్రతి ఒక్కరు…

3 hours ago