కో.. కోటి! అని తెలుగులో ఓ పాట ఉంది. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల సమయంలోనూ.. ఇదే పాట వినిపి స్తోంది. అత్యంత కీలకమైన కూకట్పల్లి టికెట్ కోట్ల రూపాయలు పలుకుతున్నట్టు దాదాపు అన్ని పార్టీల్లో నూ చర్చ సాగుతోంది. కూకట్పల్లి టికెట్ను కోరుకునేవారి సంఖ్య పెరుగుతోంది. పైగా..ఈ టికెట్ కోసం కోట్ల రూపాయలు పార్టీలకు ఫండ్గా ఇచ్చేందుకు కూడా కొందరు పారిశ్రామిక వేత్తలు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.
గత 2018 ఎన్నికల్లో బీఆర్ ఎస్ పార్టీ ఇక్కడ విజయం దక్కించుకుంది. ఈ పార్టీ తరఫున పోటీ చేసిన మాధవరం కృష్ణారావు 41 వేల ఓట్ల మెజారిటీతో గెలుపు గుర్రం ఎక్కారు. దీనికి ముందు రాష్ట్ర విభజన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో ఇదే కృష్ణారావు టీడీపీ తరఫున ఇక్కడ నుంచి పోటీ చేసి 43 వేల పైచిలుకు ఓట్లతో విజయం దక్కించుకున్నారు. ఇక, 2018లో కాంగ్రెస్ పార్టీ టీడీపీతో చేతులు కలిపిన నేపథ్యంలో ఈ టికెట్ను టీడీపీ తరఫున నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసినికి కేటాయించారు.
గట్టి పోటీ ఇచ్చినా.. నందమూరి బాలకృష్ణ వంటివారు ప్రచారం చేసినా.. సుహాసిని గెలుపు గుర్రం ఎక్కలేదు. కట్ చేస్తే.. ఇప్పుడు మరోసారి తెలంగాణ ఎన్నికల ముంగిట కూకట్పల్లి టికెట్ కోసం.. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ లు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. టీడీపీలోనే ఓ కీలక నాయకుడు ఈ టికెట్ తనకు ఇవ్వాలని.. మాధవరంను ఓడించి తీరుతానని.. పార్టీని గెలిపించే బాధ్యత తనమీద వేసుకుంటానని చెబుతున్నారట.
ఇక, కాంగ్రెస్ విషయానికి వస్తే.. టీటీడీ మాజీ చైర్మన్ సుబ్బిరామిరెడ్డి ద్వారా.. ఈ టికెట్ కోసం ఒక కీలక పారిశ్రామిక వేత్త ప్రయత్నాలు చేస్తున్నట్టు కూకట్పల్లి నియోజకవర్గంలో జోరుగా వినిపిస్తున్న మాట. రెండు కోట్ల రూపాయలు పార్టీకి ఫండ్గా ఇచ్చేందుకు, అదేసమయంలో మరో రెండు మూడు నియోజక వర్గాలకు డబ్బు సమకూర్చేందుకు కూడా సదరు పారిశ్రామిక వేత్త రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై పార్టీ అధిష్టానం వద్దే చర్చ జరగనుందని.. అంటున్నారు.
మరోవైపు బీఆర్ ఎస్ తరఫున మాధవరం పోటీ చేసినా.. ఈ సారి ఆయన గ్రాఫ్ తగ్గిందనే అంచనాలు వస్తుండడం.. వరుస విజయాలు సాధించినా.. తమను పట్టించుకోలేదని.. మాధవరంపై ఇక్కడి ప్రజలు పెదవి విరవడం వంటి అంశాలు.. ఇతర పార్టీల్లో ఈ టికెట్ ను హాట్ టాపిక్గా మార్చాయి. ఇక్కడ దాదాపు అందరూ కూడా ఏపీ నుంచి వచ్చిన సెటిలర్లే ఉండడం కూడా నాయకులను ఊరిస్తోంది.
This post was last modified on September 28, 2023 1:41 pm
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…