కో.. కోటి! అని తెలుగులో ఓ పాట ఉంది. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల సమయంలోనూ.. ఇదే పాట వినిపి స్తోంది. అత్యంత కీలకమైన కూకట్పల్లి టికెట్ కోట్ల రూపాయలు పలుకుతున్నట్టు దాదాపు అన్ని పార్టీల్లో నూ చర్చ సాగుతోంది. కూకట్పల్లి టికెట్ను కోరుకునేవారి సంఖ్య పెరుగుతోంది. పైగా..ఈ టికెట్ కోసం కోట్ల రూపాయలు పార్టీలకు ఫండ్గా ఇచ్చేందుకు కూడా కొందరు పారిశ్రామిక వేత్తలు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.
గత 2018 ఎన్నికల్లో బీఆర్ ఎస్ పార్టీ ఇక్కడ విజయం దక్కించుకుంది. ఈ పార్టీ తరఫున పోటీ చేసిన మాధవరం కృష్ణారావు 41 వేల ఓట్ల మెజారిటీతో గెలుపు గుర్రం ఎక్కారు. దీనికి ముందు రాష్ట్ర విభజన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో ఇదే కృష్ణారావు టీడీపీ తరఫున ఇక్కడ నుంచి పోటీ చేసి 43 వేల పైచిలుకు ఓట్లతో విజయం దక్కించుకున్నారు. ఇక, 2018లో కాంగ్రెస్ పార్టీ టీడీపీతో చేతులు కలిపిన నేపథ్యంలో ఈ టికెట్ను టీడీపీ తరఫున నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసినికి కేటాయించారు.
గట్టి పోటీ ఇచ్చినా.. నందమూరి బాలకృష్ణ వంటివారు ప్రచారం చేసినా.. సుహాసిని గెలుపు గుర్రం ఎక్కలేదు. కట్ చేస్తే.. ఇప్పుడు మరోసారి తెలంగాణ ఎన్నికల ముంగిట కూకట్పల్లి టికెట్ కోసం.. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ లు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. టీడీపీలోనే ఓ కీలక నాయకుడు ఈ టికెట్ తనకు ఇవ్వాలని.. మాధవరంను ఓడించి తీరుతానని.. పార్టీని గెలిపించే బాధ్యత తనమీద వేసుకుంటానని చెబుతున్నారట.
ఇక, కాంగ్రెస్ విషయానికి వస్తే.. టీటీడీ మాజీ చైర్మన్ సుబ్బిరామిరెడ్డి ద్వారా.. ఈ టికెట్ కోసం ఒక కీలక పారిశ్రామిక వేత్త ప్రయత్నాలు చేస్తున్నట్టు కూకట్పల్లి నియోజకవర్గంలో జోరుగా వినిపిస్తున్న మాట. రెండు కోట్ల రూపాయలు పార్టీకి ఫండ్గా ఇచ్చేందుకు, అదేసమయంలో మరో రెండు మూడు నియోజక వర్గాలకు డబ్బు సమకూర్చేందుకు కూడా సదరు పారిశ్రామిక వేత్త రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై పార్టీ అధిష్టానం వద్దే చర్చ జరగనుందని.. అంటున్నారు.
మరోవైపు బీఆర్ ఎస్ తరఫున మాధవరం పోటీ చేసినా.. ఈ సారి ఆయన గ్రాఫ్ తగ్గిందనే అంచనాలు వస్తుండడం.. వరుస విజయాలు సాధించినా.. తమను పట్టించుకోలేదని.. మాధవరంపై ఇక్కడి ప్రజలు పెదవి విరవడం వంటి అంశాలు.. ఇతర పార్టీల్లో ఈ టికెట్ ను హాట్ టాపిక్గా మార్చాయి. ఇక్కడ దాదాపు అందరూ కూడా ఏపీ నుంచి వచ్చిన సెటిలర్లే ఉండడం కూడా నాయకులను ఊరిస్తోంది.
This post was last modified on September 28, 2023 1:41 pm
దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల ఐదో దశ పోలింగ్ సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభం కానుంది. మొత్తం 6…
లోక్ సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే తెలంగాణలో ఉన్న 33 జిల్లాలను 17 జిల్లాలకు కుదిస్తారని వస్తున్న వార్తలు…
ఇండస్ట్రీలో సుదీర్ఘ అనుభవంతో ఎన్నో బ్లాక్ బస్టర్లు చూసిన డివివి దానయ్య సగటు మాములు ప్రేక్షకుడికి బాగా దగ్గరయ్యింది మాత్రం…
భారత దేశ చరిత్రలో ఇదోక అనూహ్యమైన.. అసహ్యించుకునే ఘటన. ఈ దేశాన్ని పాలించి, రైతుల మన్ననలు, మహిళల మన్ననలు పొందిన…
ఏపీ సీఎం జగన్.. నీరో చక్రవర్తిని తలపిస్తున్నారంటూ.. సీబీఐ మాజీ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ సంచ లన వ్యాఖ్యలు చేశారు.…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో అత్యంత దురదృష్టకరమైన జట్టు పేరు చెప్పమని అడిగితే…ఠపీమని ఆర్సీబీ పేరు చెప్పేస్తారు క్రికెట్…