Political News

కూక‌ట్‌ప‌ల్లి టికెట్ కోట్లు ప‌లుకుతోందా? అన్ని పార్టీల్లోనూ చ‌ర్చ‌

కో.. కోటి! అని తెలుగులో ఓ పాట ఉంది. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల స‌మ‌యంలోనూ.. ఇదే పాట వినిపి స్తోంది. అత్యంత కీల‌క‌మైన కూక‌ట్‌ప‌ల్లి టికెట్ కోట్ల రూపాయ‌లు ప‌లుకుతున్న‌ట్టు దాదాపు అన్ని పార్టీల్లో నూ చ‌ర్చ సాగుతోంది. కూక‌ట్‌ప‌ల్లి టికెట్‌ను కోరుకునేవారి సంఖ్య పెరుగుతోంది. పైగా..ఈ టికెట్ కోసం కోట్ల రూపాయ‌లు పార్టీల‌కు ఫండ్‌గా ఇచ్చేందుకు కూడా కొంద‌రు పారిశ్రామిక వేత్త‌లు ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు స‌మాచారం.

గ‌త 2018 ఎన్నిక‌ల్లో బీఆర్ ఎస్ పార్టీ ఇక్క‌డ విజ‌యం ద‌క్కించుకుంది. ఈ పార్టీ త‌ర‌ఫున పోటీ చేసిన మాధ‌వ‌రం కృష్ణారావు 41 వేల ఓట్ల మెజారిటీతో గెలుపు గుర్రం ఎక్కారు. దీనికి ముందు రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత జ‌రిగిన తొలి ఎన్నిక‌ల్లో ఇదే కృష్ణారావు టీడీపీ త‌ర‌ఫున ఇక్క‌డ నుంచి పోటీ చేసి 43 వేల పైచిలుకు ఓట్ల‌తో విజయం ద‌క్కించుకున్నారు. ఇక‌, 2018లో కాంగ్రెస్ పార్టీ టీడీపీతో చేతులు క‌లిపిన నేప‌థ్యంలో ఈ టికెట్‌ను టీడీపీ త‌ర‌ఫున నంద‌మూరి హ‌రికృష్ణ కుమార్తె సుహాసినికి కేటాయించారు.

గ‌ట్టి పోటీ ఇచ్చినా.. నంద‌మూరి బాల‌కృష్ణ వంటివారు ప్ర‌చారం చేసినా.. సుహాసిని గెలుపు గుర్రం ఎక్క‌లేదు. క‌ట్ చేస్తే.. ఇప్పుడు మ‌రోసారి తెలంగాణ ఎన్నిక‌ల ముంగిట కూక‌ట్‌ప‌ల్లి టికెట్ కోసం.. కాంగ్రెస్‌, బీజేపీ, టీడీపీ లు తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. టీడీపీలోనే ఓ కీల‌క నాయ‌కుడు ఈ టికెట్ త‌న‌కు ఇవ్వాల‌ని.. మాధ‌వ‌రంను ఓడించి తీరుతాన‌ని.. పార్టీని గెలిపించే బాధ్య‌త త‌న‌మీద వేసుకుంటాన‌ని చెబుతున్నార‌ట‌.

ఇక, కాంగ్రెస్ విష‌యానికి వ‌స్తే.. టీటీడీ మాజీ చైర్మ‌న్ సుబ్బిరామిరెడ్డి ద్వారా.. ఈ టికెట్ కోసం ఒక కీల‌క పారిశ్రామిక వేత్త ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు కూక‌ట్‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో జోరుగా వినిపిస్తున్న మాట‌. రెండు కోట్ల రూపాయ‌లు పార్టీకి ఫండ్‌గా ఇచ్చేందుకు, అదేస‌మయంలో మ‌రో రెండు మూడు నియోజ‌క వ‌ర్గాల‌కు డ‌బ్బు స‌మ‌కూర్చేందుకు కూడా స‌ద‌రు పారిశ్రామిక వేత్త రెడీగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. దీనిపై పార్టీ అధిష్టానం వ‌ద్దే చ‌ర్చ జ‌ర‌గ‌నుంద‌ని.. అంటున్నారు.

మ‌రోవైపు బీఆర్ ఎస్ త‌ర‌ఫున మాధ‌వ‌రం పోటీ చేసినా.. ఈ సారి ఆయ‌న గ్రాఫ్ త‌గ్గింద‌నే అంచ‌నాలు వ‌స్తుండ‌డం.. వ‌రుస విజ‌యాలు సాధించినా.. త‌మ‌ను ప‌ట్టించుకోలేద‌ని.. మాధ‌వ‌రంపై ఇక్క‌డి ప్ర‌జలు పెద‌వి విర‌వ‌డం వంటి అంశాలు.. ఇత‌ర పార్టీల్లో ఈ టికెట్ ను హాట్ టాపిక్‌గా మార్చాయి. ఇక్క‌డ దాదాపు అంద‌రూ కూడా ఏపీ నుంచి వ‌చ్చిన సెటిల‌ర్లే ఉండ‌డం కూడా నాయ‌కుల‌ను ఊరిస్తోంది.

This post was last modified on September 28, 2023 1:41 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

దురంధర్ 2 డౌన్ అవ్వడానికి కారణాలేంటి

హఠాత్తుగా నిన్నటి నుంచి దురంధర్ ది రివెంజ్ బాగా డౌన్ అయిపోయింది. ట్రేడ్ వర్గాల ప్రకారం చాలా ఏరియాల్లో అరవై…

15 minutes ago

టొవినో డ్రాపయ్యాడు… డ్రాగన్ నో అన్నాడు

జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీలో టొవినో థామస్ ఒక ముఖ్యమైన పాత్ర…

2 hours ago

అనుష్కని కాసేపే చూపిస్తే ఎలా

https://www.youtube.com/watch?v=stdHpPR8djw అభిమానులు స్వీటీ అని పిలుచుకునే అనుష్క మలయాళం డెబ్యూ కథనర్ తో జరగబోతోంది. ఇవాళ ట్రైలర్ లాంచ్ చేశారు.…

2 hours ago

త్రివిక్రమ్… ఆ ఒక్క సీన్‌లో అసలైన స్టఫ్?

వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటేనే ఒక ప్రత్యేకమైన బ్రాండ్. గతంలో వీరిద్దరూ కలిసి చేసిన సినిమాలు (రచయితగా మల్లీశ్వరి,…

3 hours ago

జ‌న‌సేన ఎమ్మెల్యేకు బాబు కితాబు

సాధార‌ణంగా త‌న పార్టీ ఎమ్మెల్యేల‌కు, ప్ర‌జాప్ర‌తినిధులు ఆయా పార్టీలు ప్రాధాన్యం ఇస్తాయి. వారి ప‌నితీరు మెచ్చుకుంటాయి. మ‌రింత మెరుగు ప‌రుచుకోవాల‌ని…

3 hours ago

బెంగళూరులో టెకీ జంట సూసైడ్… ఇద్దరు తెలుగువారే

షాకింగ్ విషాద ఉదంతం చోటు చేసుకుంది. కాస్త ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఉదంతంలో ఆత్మహత్య చేసుకున్న ఇద్దరు తెలంగాణ…

3 hours ago