పైకి ఎంత గంభీర వచనాలు చెప్పినా.. ఎన్నికల సమయానికి సెటిలర్ల ఓట్లు.. తెలంగాణ పాలక పక్షానికి కానీ, ప్రతిపక్షాలకు కానీ అత్యంత కీలకం. ఎల్బీనగర్ నుంచి ఖైరతాబాద్, కూకట్పల్లి సహా సుమారు 12 నియోజకవర్గాల పరిధిలో సెటిలర్ల ఓట్లు నాయకుల తలరాతలను సెటిల్ చేస్తున్నాయి. ఈ విషయం తెలిసే.. అధికార బీఆర్ ఎస్ నుంచి కాంగ్రెస్, బీజేపీ సహా వామపక్షాల వరకు సెటిలర్లపై పన్నెత్తు మాట అనేందుకు సాహసం చేసే పరిస్థితి లేదు.
అయితే.. తాజాగా మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు.. సెటిలర్ల మనోభావాలను దెబ్బతీశాయని, సెటిలర్లు ఈ సారి తమవైపు నిలుస్తారని కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు.. చర్చకు దారితీశాయి. ఏపీలో జరిగిన చంద్రబాబు అరెస్టు, జైలు వంటి పరిణామాల దరిమిలా.. కొంత గ్యాప్తో సెటిలర్లు చైతన్యం అయ్యారు. చంద్రబాబుకు మద్దతుగా ఐటీ రంగం కూడా ఉద్యమించింది. ఇక, సెటిలర్లు కూడా.. చంద్రబాబుకు అనుకూలంగా ధర్నాలు, నిరసనలు వ్యక్తం చేశారు.
సెటిలర్ల మనోభావాలను గుర్తించిన ఎల్బీ నగర్ బీఆర్ ఎస్ ఎమ్మెల్యే కూడా.. వీరితో చేతులు కలిపి.. చంద్రబాబుకు అనుకూలంగా వ్యాఖ్యలు చేశారు. ఆయన కూడా ధర్నాలో పాల్గొన్నారు. తద్వారా.. సెటిలర్ల ఓట్లు తన నుంచి జారిపోకుండా చూసుకునే ప్రయత్నం చేశారు. కానీ, అనూహ్యంగా మంత్రి కేటీఆర్ మాత్రం తమకు.. చంద్రబాబు కేసుకు సంబంధం ఏంటని, ఇక్కడ ఆందోళనలకు, నిరసనలకు, ధర్నాలకు ఎలా అనుమతులు ఇస్తామని ప్రకటించి సంచలనం సృష్టించారు.
అసలు ఏదైనా ఇలాంటి కార్యక్రమాలు ఉంటే.. వెంటనే ఏపీకి వెళ్లి అక్కడ ధర్నాలు, రోకోలు చేసుకోవాలని కేటీఆర్ ఉచిత సలహా ఇచ్చారు. ఇది సహజంగానే ఐటీ ఉద్యోగులకు, సెటిలర్లుగా ఉన్న పారిశ్రామిక వేత్తలు.. ఇతర వర్గాలకు కూడా..ఒకింత ఇబ్బందిగానే తోచింది. ప్రస్తుత లెక్కల ప్రకారం తెలంగాణ ఓటు బ్యాంకులో సెటిలర్లది 5 శాతం పైగా ఉందని అంటున్నారు.
సో.. వీరు ఇప్పుడు కేటీఆర్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో బీఆర్ ఎస్కు దూరమవుతారని.. ఇది తమకు లాభిస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే నిన్న మొన్నటి వరకు చంద్రబాబు విషయంలో సైలెంట్గా ఉన్న కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి గళం గట్టిగానే వినిపించారు. చంద్రబాబుకు మద్దతుగా మాట్లాడారు. ఇది కాంగ్రెస్ అంతర్గత రాజకీయాలపై ప్రభావం చూపించినా.. సెటిలర్లు మాత్రం కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడం ఖాయమనే అంచనాతో రేవంత్ ఇలా వ్యవహరించి ఉంటారని అంటున్నారు.
This post was last modified on September 28, 2023 11:57 am
మోహన్ లాల్ వయసు ప్రస్తుతం 66 సంవత్సరాలు. ఇంకో నాలుగేళ్లు పోతే ఏడు దశాబ్దాలు పూర్తి చేసుకోబోతున్నారు. ఇంత ఏజ్…
భర్త ఎవరితోనో సంబంధం పెట్టుకుంటాడు. భార్యకు అనుమానం వస్తుంది. విషయం రూఢి చేసుకుంటుంది. భర్తను జాగ్రత్తగా గమనిస్తూ.. పరాయి మహిళతో…
ఎట్టకేలకు మాజీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి రాజకీయ పార్టీ పెట్టనున్నట్లు ప్రకటించారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారానికి…
మిగతా దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో టికెట్ల ధరలు ఎక్కువ. పైగా పెద్ద సినిమాలు రిలీజైనపుడు అదనపు…
ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుకు మైకు పట్టడం బాగా తెలుసు. ఆయన మైకు అందుకుంటే.. వినేవారికైనా బోర్ కొడు…
మన తెలుగు ప్రేక్షకులు నిండు మనసుతో భాష భేదం లేకుండా కంటెంట్ బాగుంటే చాలు వసూళ్లు ఇచ్చి మరీ బ్లాక్…