పైకి ఎంత గంభీర వచనాలు చెప్పినా.. ఎన్నికల సమయానికి సెటిలర్ల ఓట్లు.. తెలంగాణ పాలక పక్షానికి కానీ, ప్రతిపక్షాలకు కానీ అత్యంత కీలకం. ఎల్బీనగర్ నుంచి ఖైరతాబాద్, కూకట్పల్లి సహా సుమారు 12 నియోజకవర్గాల పరిధిలో సెటిలర్ల ఓట్లు నాయకుల తలరాతలను సెటిల్ చేస్తున్నాయి. ఈ విషయం తెలిసే.. అధికార బీఆర్ ఎస్ నుంచి కాంగ్రెస్, బీజేపీ సహా వామపక్షాల వరకు సెటిలర్లపై పన్నెత్తు మాట అనేందుకు సాహసం చేసే పరిస్థితి లేదు.
అయితే.. తాజాగా మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు.. సెటిలర్ల మనోభావాలను దెబ్బతీశాయని, సెటిలర్లు ఈ సారి తమవైపు నిలుస్తారని కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు.. చర్చకు దారితీశాయి. ఏపీలో జరిగిన చంద్రబాబు అరెస్టు, జైలు వంటి పరిణామాల దరిమిలా.. కొంత గ్యాప్తో సెటిలర్లు చైతన్యం అయ్యారు. చంద్రబాబుకు మద్దతుగా ఐటీ రంగం కూడా ఉద్యమించింది. ఇక, సెటిలర్లు కూడా.. చంద్రబాబుకు అనుకూలంగా ధర్నాలు, నిరసనలు వ్యక్తం చేశారు.
సెటిలర్ల మనోభావాలను గుర్తించిన ఎల్బీ నగర్ బీఆర్ ఎస్ ఎమ్మెల్యే కూడా.. వీరితో చేతులు కలిపి.. చంద్రబాబుకు అనుకూలంగా వ్యాఖ్యలు చేశారు. ఆయన కూడా ధర్నాలో పాల్గొన్నారు. తద్వారా.. సెటిలర్ల ఓట్లు తన నుంచి జారిపోకుండా చూసుకునే ప్రయత్నం చేశారు. కానీ, అనూహ్యంగా మంత్రి కేటీఆర్ మాత్రం తమకు.. చంద్రబాబు కేసుకు సంబంధం ఏంటని, ఇక్కడ ఆందోళనలకు, నిరసనలకు, ధర్నాలకు ఎలా అనుమతులు ఇస్తామని ప్రకటించి సంచలనం సృష్టించారు.
అసలు ఏదైనా ఇలాంటి కార్యక్రమాలు ఉంటే.. వెంటనే ఏపీకి వెళ్లి అక్కడ ధర్నాలు, రోకోలు చేసుకోవాలని కేటీఆర్ ఉచిత సలహా ఇచ్చారు. ఇది సహజంగానే ఐటీ ఉద్యోగులకు, సెటిలర్లుగా ఉన్న పారిశ్రామిక వేత్తలు.. ఇతర వర్గాలకు కూడా..ఒకింత ఇబ్బందిగానే తోచింది. ప్రస్తుత లెక్కల ప్రకారం తెలంగాణ ఓటు బ్యాంకులో సెటిలర్లది 5 శాతం పైగా ఉందని అంటున్నారు.
సో.. వీరు ఇప్పుడు కేటీఆర్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో బీఆర్ ఎస్కు దూరమవుతారని.. ఇది తమకు లాభిస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే నిన్న మొన్నటి వరకు చంద్రబాబు విషయంలో సైలెంట్గా ఉన్న కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి గళం గట్టిగానే వినిపించారు. చంద్రబాబుకు మద్దతుగా మాట్లాడారు. ఇది కాంగ్రెస్ అంతర్గత రాజకీయాలపై ప్రభావం చూపించినా.. సెటిలర్లు మాత్రం కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడం ఖాయమనే అంచనాతో రేవంత్ ఇలా వ్యవహరించి ఉంటారని అంటున్నారు.
This post was last modified on September 28, 2023 11:57 am
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…