నిజమే. ఇప్పడు తెలంగాణ కాంగ్రెస్లో మరోసారి పార్టీ రాష్ట్ర చీఫ్ రేవంత్రెడ్డి వ్యవహారంపై సీనియర్ల నుంచి ఆగ్రహ జ్వాలలు ఎగిసి పడుతున్నాయి. ముఖ్యంగా ఆయనను ఆది నుంచి వ్యతిరేకిస్తున్న వీ. హనుమంతరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, దుద్దిళ్ల శ్రీధర్బాబు వంటి చాలా మంది పేరున్న నాయకులు రేవంత్పై అంతర్గత సంభాషణల్లో విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయన ఆదిపత్యం పెరిగిపోయిందని వ్యాఖ్యానిస్తున్నారు.
సాధారణంగా కాంగ్రెస్ పార్టీలో టికెట్ల కేటాయింపు అనేది అధిష్టానం చూస్తుంది. రాష్ట్ర స్థాయిలో నాయకులు ఒక జాబితా రెడీ చేసుకుని కేంద్ర అధిష్టానానికి పంపిన తర్వాత.. జాబితాలోని పేర్లను పరిశీలించి, వారి ఆటో బయోగ్రఫీని ఆమూలాగ్రం అధ్యయనం చేసిన తర్వాత.. టికెట్లను కన్ఫర్మ్ చేయడం అనేది కాంగ్రెస్లో సంప్రదాయంగా వస్తోంది. అయితే, ఈవిషయంలో రేవంత్ కొంత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. తానే స్వయంగా కొందరికి టికెట్లు ప్రకటిస్తున్నారు.
ముఖ్యంగా ఒకే కుటుంబంలోని వారికి రెండేసి టికెట్లు ఇచ్చేందుకు కూడా తాము సిద్ధమనే విధంగా రేవంత్ ప్రకటనలు చేస్తున్నారు. ఇది సీనియర్లకు సరిపడడం లేదు. కనీసం తమతో కూడా చర్చించ కుండానే ఇలాంటి ప్రకటనలు చేస్తున్న విధానంపైనే వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆఫ్ దిరికార్డుగా మీడియా మిత్రుల వద్ద ఇదే కామెంట్లు చేస్తున్నారు. పార్టీలో టికెట్ల నిర్ణయం అనేది అత్యంత కీలకమైన వ్యవహారమని, దీనిని ఏ ఒక్కరో తీసుకునే పరిస్థితి లేదని వారు చెబుతున్నారు.
అదేసమయంలో టీడీపీ వ్యవహారంపైనా రేవంత్ స్పందించిన తీరును కూడా సీనియర్లు తప్పుబడుతున్నారు. ఇప్పటి వరకు సంయమనంతో వ్యవహరించిన రేవంత్ ఇప్పుడు.. అనూహ్యంగా టీడీపీకి మద్దతుగా మాట్లాడడం.. చంద్రబాబు అరెస్టు వంటి అంశాలను స్పృశించడం ద్వారా.. బీఆర్ఎస్ పార్టీకి అనవసరపు ఆయుధాలను అందించినట్టు అవుతుందని వారు చెబుతున్నారు. ఈ పరిణామాల విషయంలో అధిష్టాన్యం జోక్యం కోరుతున్న వారు పెరుగుతుండడం గమనార్హం. అయితే, ఇదే విషయంలో రేవంత్ను సమర్థిస్తున్న వారు కూడా ఉన్నారు. మరి ఎన్నికల ముంగిట కాంగ్రెస్లో ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో చూడాల్సి ఉంది.
This post was last modified on September 28, 2023 9:49 am
ఏపీలో ఎన్నికల పోలింగ్ అనంతరం చెలరేగిన హింసాత్మక ఘటనలను నిలువరించలేక పోయిన.. ఉన్నతాధికారులపై(ఒక జిల్లా కలెక్టరు, ముగ్గురు ఎస్పీలు) వేటు…
ఇంకా షూటింగ్ కాదు కదా కనీసం పూజా కార్యక్రమాలు కూడా జరగని మహేష్ బాబు - రాజమౌళి సినిమా తాలూకు…
ఏపీ సీఎం జగన్ కుటుంబ సమేతంగా విహార యాత్రకు వెళ్లిన విషయం తెలిసిందే. సతీమణి వైఎస్ భారతి, కుమార్తెలు హర్ష,…
మన కల్కి 2898 ఏడిలాగే తమిళంలోనూ విపరీతమైన జాప్యానికి గురవుతున్న ప్యాన్ ఇండియా మూవీ కంగువ. సిరుతై శివ దర్శకత్వంలో…
నిన్న ఎలాగూ కొత్త తెలుగు సినిమాలు లేవనే కారణంగా మిరల్ అనే డబ్బింగ్ మూవీని రిలీజ్ చేశారు. ప్రేమిస్తేతో టాలీవుడ్…
గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…