నిజమే. ఇప్పడు తెలంగాణ కాంగ్రెస్లో మరోసారి పార్టీ రాష్ట్ర చీఫ్ రేవంత్రెడ్డి వ్యవహారంపై సీనియర్ల నుంచి ఆగ్రహ జ్వాలలు ఎగిసి పడుతున్నాయి. ముఖ్యంగా ఆయనను ఆది నుంచి వ్యతిరేకిస్తున్న వీ. హనుమంతరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, దుద్దిళ్ల శ్రీధర్బాబు వంటి చాలా మంది పేరున్న నాయకులు రేవంత్పై అంతర్గత సంభాషణల్లో విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయన ఆదిపత్యం పెరిగిపోయిందని వ్యాఖ్యానిస్తున్నారు.
సాధారణంగా కాంగ్రెస్ పార్టీలో టికెట్ల కేటాయింపు అనేది అధిష్టానం చూస్తుంది. రాష్ట్ర స్థాయిలో నాయకులు ఒక జాబితా రెడీ చేసుకుని కేంద్ర అధిష్టానానికి పంపిన తర్వాత.. జాబితాలోని పేర్లను పరిశీలించి, వారి ఆటో బయోగ్రఫీని ఆమూలాగ్రం అధ్యయనం చేసిన తర్వాత.. టికెట్లను కన్ఫర్మ్ చేయడం అనేది కాంగ్రెస్లో సంప్రదాయంగా వస్తోంది. అయితే, ఈవిషయంలో రేవంత్ కొంత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. తానే స్వయంగా కొందరికి టికెట్లు ప్రకటిస్తున్నారు.
ముఖ్యంగా ఒకే కుటుంబంలోని వారికి రెండేసి టికెట్లు ఇచ్చేందుకు కూడా తాము సిద్ధమనే విధంగా రేవంత్ ప్రకటనలు చేస్తున్నారు. ఇది సీనియర్లకు సరిపడడం లేదు. కనీసం తమతో కూడా చర్చించ కుండానే ఇలాంటి ప్రకటనలు చేస్తున్న విధానంపైనే వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆఫ్ దిరికార్డుగా మీడియా మిత్రుల వద్ద ఇదే కామెంట్లు చేస్తున్నారు. పార్టీలో టికెట్ల నిర్ణయం అనేది అత్యంత కీలకమైన వ్యవహారమని, దీనిని ఏ ఒక్కరో తీసుకునే పరిస్థితి లేదని వారు చెబుతున్నారు.
అదేసమయంలో టీడీపీ వ్యవహారంపైనా రేవంత్ స్పందించిన తీరును కూడా సీనియర్లు తప్పుబడుతున్నారు. ఇప్పటి వరకు సంయమనంతో వ్యవహరించిన రేవంత్ ఇప్పుడు.. అనూహ్యంగా టీడీపీకి మద్దతుగా మాట్లాడడం.. చంద్రబాబు అరెస్టు వంటి అంశాలను స్పృశించడం ద్వారా.. బీఆర్ఎస్ పార్టీకి అనవసరపు ఆయుధాలను అందించినట్టు అవుతుందని వారు చెబుతున్నారు. ఈ పరిణామాల విషయంలో అధిష్టాన్యం జోక్యం కోరుతున్న వారు పెరుగుతుండడం గమనార్హం. అయితే, ఇదే విషయంలో రేవంత్ను సమర్థిస్తున్న వారు కూడా ఉన్నారు. మరి ఎన్నికల ముంగిట కాంగ్రెస్లో ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో చూడాల్సి ఉంది.
This post was last modified on September 28, 2023 9:49 am
ప్రతి దర్శకుడూ తన అరంగేట్ర చిత్రంతోనే తన స్టైల్ ఏంటో, మున్ముందు ఎలాంటి సినిమాలు తీయబోతున్నానో ఒక సంకేతం ఇచ్చేస్తాడు. తొలి సినిమాను…
ఒకప్పుడు అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోగా సుమంత్ కు మంచి ఫాలోయింగ్ ఉండేది. సత్యం, గౌరీ, గోదావరి లాంటి…
సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…
ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…
ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…