అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేరును ఏ 14గా పేర్కొంటూ సిఐడి అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబును ఏ1గా పేర్కొన్న సిఐడి తాజాగా లోకేష్ ను ఏ14 గా పేర్కొనడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపింది. ఈ నేపథ్యంలోనే తన యువగళం పాదయాత్ర మళ్ళీ ప్రారంభం కాబోతోందన్న భయంతోనే జగన్ ఈ కేసులో తన పేరు చేర్పించారని లోకేష్ ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే ముందస్తు బెయిల్ కోరుతూ ఏపీ హైకోర్టులో లోకేష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై రేపు విచారణ జరిగే అవకాశం ఉంది.
ఈ కేసులో లోకేష్ ను14వ ముద్దాయిగా సిఐడి చేర్చడంపై వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఈ కేసులో లోకేష్ పాత్ర ఉందనే సీఐడీకి తాను ఫిర్యాదు చేశానని ఆర్కే అన్నారు. టిడిపికి అనుకూలమైన వ్యక్తులకు లబ్ధి చేకూర్చేలా మార్పులు చేర్పులు చేశారని ఆరోపించారు. చట్టాలను గౌరవిస్తానని చెప్పే చంద్రబాబు, లోకేష్ ఈ కేసులకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ఇన్నర్ రింగ్ రోడ్డు లేదని, స్కామ్ ఎలా జరిగిందని లోకేష్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి రోజా స్పందించారు. రోడ్డు వేయకముందే అలైన్మెంట్ పేరుతో దోచుకున్నారని ఆరోపించారు.
అరెస్టు భయంతోనే లోకేష్ ఢిల్లీ వెళ్లి దాక్కున్నారని విమర్శించారు. ఎర్రబుక్కులో రాసుకుంటానంటూ అధికారులను లోకేష్ బెదిరిస్తున్నారని విమర్శించారు. ఎర్ర బుక్ సంగతి తర్వాత చూడొచ్చని, సిఐడి మెమోలో లోకేష్ పేరు చేర్చిన విషయం తెలుసుకోవాలని చురుకులంటించారు. నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి అబద్ధాలు చెబుతున్నారని, వారి మాటలు వింటుంటే ఎన్టీఆర్ కూతురు, మనవరాలు అనే గౌరవం కూడా పోతుందని రోజా షాకింగ్ కామెంట్స్ చేశారు.
This post was last modified on September 27, 2023 2:51 pm
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల్లో ఒకరైన కొడాలి నానికి తెలుగుదేశం అన్నా, జనసేన అన్నా ఎంత కోపమో ప్రత్యేకంగా…
హైడ్రా కూల్చివేతలపై చాలామంది ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. మరికొంత మంది మాత్రం నాలాలపై, చెరువలు…
మాస్ రాజా రవితేజ కొత్త సినిమా ఇరుముడి తెలుగు రాష్ట్రాలతో పాటు తెలుగు వాళ్లుండే ప్రతి చోటా ఇరగాడేస్తోంది. తెలుగులో…
బాక్సాఫీస్ వద్ద వీర విహారం చేస్తున్న ఇరుముడి ఎక్కడికి వెళ్తుందో ఎవరికి అంతు చిక్కడం లేదు. పాజిటివ్ టాక్ రావడంలో…
అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ కొత్త సినిమా ‘రాకా’ మొదలైనపుడే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సన్ పిక్చర్స్ ప్రొడక్షన్లో…
విశాఖపట్నంలో విద్యార్థులు చెలరేగిపోయారు. ప్రేమ వ్యవహారంలో రెండు గ్రూపులుగా విడిపోయి కర్రలు, రాడ్లు పట్టుకొని రోడ్డెక్కారు. సినిమా తరహాలో నడి…