అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేరును ఏ 14గా పేర్కొంటూ సిఐడి అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబును ఏ1గా పేర్కొన్న సిఐడి తాజాగా లోకేష్ ను ఏ14 గా పేర్కొనడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపింది. ఈ నేపథ్యంలోనే తన యువగళం పాదయాత్ర మళ్ళీ ప్రారంభం కాబోతోందన్న భయంతోనే జగన్ ఈ కేసులో తన పేరు చేర్పించారని లోకేష్ ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే ముందస్తు బెయిల్ కోరుతూ ఏపీ హైకోర్టులో లోకేష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై రేపు విచారణ జరిగే అవకాశం ఉంది.
ఈ కేసులో లోకేష్ ను14వ ముద్దాయిగా సిఐడి చేర్చడంపై వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఈ కేసులో లోకేష్ పాత్ర ఉందనే సీఐడీకి తాను ఫిర్యాదు చేశానని ఆర్కే అన్నారు. టిడిపికి అనుకూలమైన వ్యక్తులకు లబ్ధి చేకూర్చేలా మార్పులు చేర్పులు చేశారని ఆరోపించారు. చట్టాలను గౌరవిస్తానని చెప్పే చంద్రబాబు, లోకేష్ ఈ కేసులకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ఇన్నర్ రింగ్ రోడ్డు లేదని, స్కామ్ ఎలా జరిగిందని లోకేష్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి రోజా స్పందించారు. రోడ్డు వేయకముందే అలైన్మెంట్ పేరుతో దోచుకున్నారని ఆరోపించారు.
అరెస్టు భయంతోనే లోకేష్ ఢిల్లీ వెళ్లి దాక్కున్నారని విమర్శించారు. ఎర్రబుక్కులో రాసుకుంటానంటూ అధికారులను లోకేష్ బెదిరిస్తున్నారని విమర్శించారు. ఎర్ర బుక్ సంగతి తర్వాత చూడొచ్చని, సిఐడి మెమోలో లోకేష్ పేరు చేర్చిన విషయం తెలుసుకోవాలని చురుకులంటించారు. నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి అబద్ధాలు చెబుతున్నారని, వారి మాటలు వింటుంటే ఎన్టీఆర్ కూతురు, మనవరాలు అనే గౌరవం కూడా పోతుందని రోజా షాకింగ్ కామెంట్స్ చేశారు.
This post was last modified on September 27, 2023 2:51 pm
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మలయాళ పరిశ్రమను మినహాయిస్తే.. ప్రతి చోటా సినిమాల మేకింగ్ బాగా టైం తీసుకుంటోంది. కొంచెం స్టార్ ఇమేజ్…
టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఏపీకి పలుమార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దివంగత నందమూరి తారక రామారావుకు భారత దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలన్నమాట నిత్యం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి పార్టీలకు చెందిన నేతల మధ్య…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కడైనా హీరోల ఆధిపత్యమే నడుస్తుంటుంది. దర్శక నిర్మాతలు వాళ్ల మాటను అనుసరించే నడుచుకోవాల్సి ఉంటుంది. హీరోలు మాట తప్పినా..…
ఒక పాట థియేటర్లలో కంటే బయట ఎంతలా వినిపిస్తుందనే దానిపైనే ఆ సినిమా క్రేజ్ ఆధారపడి ఉంటుంది. తాజాగా ఉప్పల్…
తెలుగు సినిమా మార్కెట్ ఇప్పుడు మునుపెన్నడూ లేని విధంగా విస్తరించింది. ఒకప్పుడు వందల కోట్లతో ముగిసిపోయే లెక్కలు, ఇప్పుడు వేల…