అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేరును ఏ 14గా పేర్కొంటూ సిఐడి అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబును ఏ1గా పేర్కొన్న సిఐడి తాజాగా లోకేష్ ను ఏ14 గా పేర్కొనడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపింది. ఈ నేపథ్యంలోనే తన యువగళం పాదయాత్ర మళ్ళీ ప్రారంభం కాబోతోందన్న భయంతోనే జగన్ ఈ కేసులో తన పేరు చేర్పించారని లోకేష్ ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే ముందస్తు బెయిల్ కోరుతూ ఏపీ హైకోర్టులో లోకేష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై రేపు విచారణ జరిగే అవకాశం ఉంది.
ఈ కేసులో లోకేష్ ను14వ ముద్దాయిగా సిఐడి చేర్చడంపై వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఈ కేసులో లోకేష్ పాత్ర ఉందనే సీఐడీకి తాను ఫిర్యాదు చేశానని ఆర్కే అన్నారు. టిడిపికి అనుకూలమైన వ్యక్తులకు లబ్ధి చేకూర్చేలా మార్పులు చేర్పులు చేశారని ఆరోపించారు. చట్టాలను గౌరవిస్తానని చెప్పే చంద్రబాబు, లోకేష్ ఈ కేసులకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ఇన్నర్ రింగ్ రోడ్డు లేదని, స్కామ్ ఎలా జరిగిందని లోకేష్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి రోజా స్పందించారు. రోడ్డు వేయకముందే అలైన్మెంట్ పేరుతో దోచుకున్నారని ఆరోపించారు.
అరెస్టు భయంతోనే లోకేష్ ఢిల్లీ వెళ్లి దాక్కున్నారని విమర్శించారు. ఎర్రబుక్కులో రాసుకుంటానంటూ అధికారులను లోకేష్ బెదిరిస్తున్నారని విమర్శించారు. ఎర్ర బుక్ సంగతి తర్వాత చూడొచ్చని, సిఐడి మెమోలో లోకేష్ పేరు చేర్చిన విషయం తెలుసుకోవాలని చురుకులంటించారు. నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి అబద్ధాలు చెబుతున్నారని, వారి మాటలు వింటుంటే ఎన్టీఆర్ కూతురు, మనవరాలు అనే గౌరవం కూడా పోతుందని రోజా షాకింగ్ కామెంట్స్ చేశారు.
This post was last modified on September 27, 2023 2:51 pm
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…