తుక్కుగూడ బహిరంగ సభలో సోనియాగాంధి ప్రకటించిన 6 గ్యారెంటీ స్కీముల తర్వాత తెలంగాణాలో కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగిందట. తెలంగాణా ఇన్టెన్షన్స్ అనే సంస్ధ ప్రతి వారం వీక్లీ ట్రాకర్ పేరుతో జనాల మూడ్ ను ప్రకటిస్తుంటుంది. ప్రజల్లో పార్టీలపై ఆదరణ పెరుగుతోందా లేకపోతే తగ్గుతోందా ? అనే విషయమై సర్వే జరిపి ప్రతివారం ప్రకటిస్తుంటుంది. ఈ వారంలో చేసిన సర్వేలో కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగిందని తేలింది. కారణం ఏమిటంటే 6 గ్యారెంటీస్ అనే సమాధానం వినిపిస్తోంది.
వివిధ కారణాల వల్ల గడచిన 45 రోజులుగా కాంగ్రెస్ పార్టీ తన గ్రాఫ్ ను మెల్లిగా పెంచుకుంటోంది. 6 గ్యారెంటీస్ ప్రకటన తర్వాత జనాల్లో కాంగ్రెస్ గ్రాఫ్ 2.8 శాతం పెరిగినట్లు సమాచారం. పదిరోజుల క్రితం హస్తం పార్టీ గ్రాఫ్ 30.3 శాతం ఉంటే ఇపుడా గ్రాఫ్ 33.1 శాతంకు చేరుకుంది. సోనియా ప్రకటించిన 6 హామీలు జనాలకు ఉపయోగపడేవే అని జనాలు చెప్పుకుంటున్నారు. 6 హామీలు రాబోయే పోలింగులో కాంగ్రెస్ పై ప్రభావం చూపుతుందని 46 శాతం మంది అభిప్రాయపడ్డారు.
అయితే ఇదే సమయంలో బీఆర్ఎస్ గ్రాఫ్ కూడా కాస్త పెరిగినా కాంగ్రెస్ గ్రాఫ్ కూడా పెరుగుతుండటంతో రెండు పార్టీల మధ్య అంతరం తగ్గుతోంది. కాంగ్రెస్ అధికారంలోకి తప్పకుండా వస్తుందని 37 శాతం మంది అభిప్రాయపడుతున్నారు. అయితే హామీలు వినడానికి బాగానే ఉన్నా అమలు సాధ్యం కాదని 38 శాతం అభిప్రాయపడ్డారు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే జనాల్లో కాంగ్రెస్ పార్టీ అభిమానం ఉంది. అయితే నేతల్లో ఉందా అన్నది పాయింట్. ఎందుకంటే అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా నేతలు ఎప్పుడూ గొడవలు పడుతునే ఉంటారు. పార్టీకన్నా సొంత ఇమేజే ముఖ్యమని ఫీలయ్యే నేతలు ఎక్కువైపోవటంతోనే సమస్య పెరిగిపోతోంది. పదేళ్ళు ప్రతిపక్షంలో ఉన్నకారణంగా రాబోయే ఎన్నికల్లో అయినా అందరు ఏకతాటిపైకి చేరుకుని పార్టీని గెలిపించుకోవాలనే ఆలోచన చాలామందిలో కనిపించటంలేదు. ప్రతి చిన్న విషయానికి ఏదో కారణంతో గొడవలు పడేవాళ్ళు, అలిగే వాళ్ళు ఎక్కువైపోయారు. అందుకనే జనాలకు కాంగ్రెస్ అంటే విరక్తి పెరిగిపోతోంది.
This post was last modified on September 27, 2023 7:37 am
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…