కరోనా కలకలం కొనసాగుతున్న తరుణంలో దేశవ్యాప్తంగా, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో నివసిస్తున్న ప్రజలకు గుడ్ న్యూస్. కీలక సమయంలో కేంద్రం తీపికబురు తెలిపింది. లాక్ డౌన్ విముక్తి అయిపోయి అన్లాక్ దశలు ఒకదాని వెంట ఒకటి వస్తున్నా… ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్తున్న ప్రజలకు కొనసాగుతున్న కష్టాలకు చెక్ పడింది. అంతర్రాష్ట్ర రవాణాపై ఆంక్షలు ఉండకూడదని కేంద్రం అన్ని రాష్ట్రాలను ఆదేశించింది.
అంతరాష్ట్ర రవాణ విషయంలో కీలక వివరాలు వెల్లడిస్తూ కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా నేడు ఆదేశాలు వెలువరించారు. దేశంలో ఓ రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లాలంటే ఎలాంటి ఆంక్షలు లేకుండా వెళ్లేందుకు ఎలాంటి షరతులు విధించవద్దని అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు రాసిన లేఖలో ఆయన స్పష్టం చేశారు. అంతరాష్ట్ర రవాణ ఆంక్షలతో ఆర్థిక కార్యకలాపాలు, ఉపాధిపై ప్రభావం పడుతోందని అందుకే తాజా ఆదేశాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి పేర్కొన్నారు. వ్యక్తులు, వస్తువుల రవాణాపై ఎలాంటి ఆంక్షలు ఉండకూడదని లేఖలో స్పష్టం చేసిన అజయ్ భల్లా ఆంక్షలు విధిస్తే నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తోందని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా, కరోనా మహమ్మారి వల్ల విధించిన లాక్డౌన్ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలోనే వివిధ ప్రాంతాల్లో ఇరుక్కుపోయారు. క్రమంగా సడలింపులు వచ్చినప్పటికీ ఒక ప్రాంతం వరకు, ఒక రాష్ట్రం వరకు మాత్రం ఇబ్బంది లేదు. అయితే, రాష్ట్రాల సరిహద్దుల విషయంలో సమస్యలు ఎదురయ్యాయి. అవతలి రాష్ట్రం అనుమతి ఉండాల్సిందేనన్న ఆదేశాలతో అంతరాష్ట్ర రవాణాపై తీవ్ర ప్రభావమే పడింది. ఇటీవల హైదరాబాద్లో లాక్ డౌన్ అనే ప్రచారం సమయంలో ఈ విషయం స్పష్టమైంది. తాజాగా కేంద్రం ఇచ్చిన ఆదేశాలు ఇలా ఇరుక్కుపోయిన వారికి పెద్ద ఉపశమనం అని అంటున్నారు.
This post was last modified on August 24, 2020 10:49 am
సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ఎంత మద్దతు ఉన్నా సుధీర్ బాబు పెద్ద స్థాయికి వెళ్లలేకపోతున్నాడు. వరస ఫెయిల్యూర్స్…
అక్కినేని కుటుంబం నుంచి ఘనంగా అరంగేట్రం చేసిన కథానాయకుల్లో సుమంత్ ఒకడు. కానీ తన కెరీర్ పుంజుకోవడానికి చాలా టైం…
స్టార్ పవర్ అంటే మాటల్లో కొలిచేది కాదు. దాని సత్తా ఏ స్థాయిలో ఉంటుదంటే ఒక్కసారి ట్రేడ్ వర్గాలకు సైతం…
ఇంకో నాలుగు రోజుల్లో విడుదల కాబోతున్న శ్రీనివాస మంగాపురం మీద సినిమా కంటే ఎక్కువగా మహేష్ బాబు ఆ మూవీ…
ఈ రోజుల్లో పెద్ద స్టార్లు థియేటర్లకు వచ్చి సినిమాలు చూడడం అన్నది దాదాపు అసాధ్యంగా మారిపోయింది. మిడ్ రేంజ్ హీరోలు…
తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన జనసేన నాయకుడు, సీనియర్ నేత ఆరణి శ్రీనివాసులు రాజకీయ భవిష్యత్తుపై ఆసక్తికర…