Political News

చంద్రబాబు అరెస్టుపై కేటీఆర్ షాకింగ్ కామెంట్స్

టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా టిడిపి నేతలు, కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే హైదరాబాద్ లో ఐటీ ఉద్యోగులు పలు ప్రాంతాలలో ర్యాలీలు, ధర్నాలు చేసి తమ నిరసనను తెలియజేశారు. అయితే, తాజాగా ఆ ర్యాలీలపై మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ ర్యాలీలు ఏపీలో చేసుకోవాలని, ఆంధ్రా రాజకీయాలతో తెలంగాణకు ఏం సంబంధం అని కేటీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారు.

రాజమండ్రిలో భూమి దద్దరిల్లిపోయేలాగా ర్యాలీలు చేసుకోవాలని, ఇక్కడ హైదరాబాదులో ర్యాలీ చేస్తే ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు. హైదరాబాదులో ర్యాలీకి అనుమతి ఎందుకు ఇవ్వడం లేదని లోకేష్ తనకు ఫోన్ చేసి ప్రశ్నించారని, అయితే, శాంతిభద్రతలను దృష్టిలో పెట్టుకొని అనుమతి ఇవ్వలేదని ఆయనకు చెప్పానని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ లో ర్యాలీలు చేస్తే ఐటీ కారిడార్ డిస్టర్బ్ అవుతుందని, ఈ రోజు వీళ్ళు చేస్తే రేపు వాళ్ళు చేసి పోటాపోటీగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని కేటీఆర్ చెప్పారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లెగుస్తున్న సందర్భంగా కూడా ఐటీ కారిడార్ లో ర్యాలీలు, నిరసనలు జరగలేదని గుర్తు చేశారు.

వ్యక్తిగతంగా ఎవరైనా చంద్రబాబు అరెస్ట్ గురించి మాట్లాడవచ్చని, కానీ, అది పార్టీకి సంబంధం లేదని కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఇది రెండు రాజకీయ పార్టీల మధ్య తగాదా అని, వారికి తెలంగాణలో ఎటువంటి స్థానం లేదని కేటీఆర్ అన్నారు. అటువంటప్పుడు ఇక్కడ ర్యాలీలు చేయడం ఎందుకని ప్రశ్నించారు. ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి అలాగే హ్యాండిల్ చేస్తున్నామని అన్నారు. ఇక, చంద్రబాబు అరెస్ట్ విషయం కోర్టు పరిధిలో ఉందని, న్యాయపోరాటం చేసిన తర్వాత ఏం జరుగుతుందో వారు చూసుకుంటారని చెప్పారు. అయితే, ఏపీతో తమకు తగాదాలు లేవని, తనకు జగన్, లోకేష్, పవన్ అందరూ మిత్రులేనని కేటీఆర్ అన్నారు.

This post was last modified on September 26, 2023 6:13 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

యంగ్ అండ్ డేరింగ్ ఎంపీ.. హ్యాట్రిక్ ప‌క్కా!

లోక్‌స‌భ‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ హ‌క్కుల గురించి, రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి, ఏపీ ప్ర‌యోజ‌నాల గురించి ప్ర‌శ్నించిన నేత‌గా టీడీపీ ఎంపీ…

47 mins ago

రెబ‌ల్ స్టార్ స‌తీమ‌ణి.. ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కు విన్న‌పం

రెబ‌ల్ స్టార్, దివంగ‌త కృష్ణం రాజు స‌తీమ‌ణి శ్యామ‌లా దేవి అనూహ్యంగా ఎన్నిక‌ల ప్ర‌చారం చివ‌రి రోజు రాజ‌కీయ ప్ర‌చారం…

4 hours ago

పంతంగి ప్యాక్ అయింది !

సంక్రాంతి, దసరా సెలవులు వచ్చాయి అంటే మొదట మీడియాలో వినిపించే పేరు పంతంగి. హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారి…

5 hours ago

మీ శ్రేయోభిలాషి.. ఏపీ ప్ర‌జ‌ల‌కు చంద్ర‌బాబు లేఖ‌..!

"మీ శ్రేయోభిలాషి.." అంటూ టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఏపీ ప్ర‌జ‌ల‌కు బ‌హిరంగ లేఖ రాశారు. ఎన్నిక‌ల ప్ర‌చారం ముగిసిన మ‌రుక్ష‌ణం…

5 hours ago

ఏపీలో ఏం జ‌రుగుతోంది.. నిమ్మ‌గ‌డ్డకు టెన్ష‌న్ ఎందుకు?

ఎన్నిక‌ల పోలింగ్ ప్ర‌క్రియ ప్రారంభం అయ్యేందుకు మ‌రికొద్ది గంట‌ల స‌మ‌యం మాత్ర‌మే ఉంది. కానీ.. ఇంత‌లోనే ఏపీలో ఏదో జ‌రుగుతోంద‌నే…

5 hours ago

బ్రహ్మరథం బన్నీకా.. వైసీపీకా?

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ రోజు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాడు. రెండు రోజుల కిందటే…

7 hours ago