ఏదైనా ఊహించని పరిణామం ఎదురైతే షాక్ కు గురి కావడం సహజమే. ఇప్పుడు టీడీపీ కూడా అదే షాక్ లో ఉంది. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అరెస్టును ఎవరూ ఊహించలేదు.
రాజకీయ నాయకులపై ఆరోపణలు రావడం సహజమే.. కానీ పోలీసులు రంగంలోకి దిగి నేరుగా అదుపులోకి తీసుకునే అవకాశం లేదని టీడీపీ అనుకుంది. అరెస్టయితే చేశారు కానీ కేసు నిలబడదని కూడా టీడీపీ శ్రేణులు ఆశించాయి. కానీ టీడీపీ అనుకున్నది ఒకటైతే జరుగుతోంది మరొకటి.
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబుకు మొదటి నుంచి ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. మొదట 14 రోజలు రిమాండ్ విధించిన ఏసీబీ కోర్టు.. దీన్ని అక్టోబర్ 5 వరకు పెంచింది. మరోవైపు బాబు వేసిన క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. ఇవన్నీ ఊహించని పరిణామాలే.
దీంతో బాబు ఇంకొంత కాలం జైల్లోనే ఉండే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో షాక్ నుంచి బయటకు వచ్చి యాక్షన్ ప్లాన్ పై టీడీపీ ఫోకస్ పెట్టింది. బాబు అరెస్టును జనాల్లోకి మరింతగా తీసుకెళ్లేందుకు కసరత్తులు ప్రారంభించింది.
బాబు అరెస్టుకు వ్యతిరేకంగా చేపట్టాల్సిన నిరసన కార్యక్రమాలు, పార్టీ వ్యవహారల నిర్వహణ, వీటి పర్యవేక్షణ కోసం 14 మంది సభ్యులతో ఓ పొలిటికల్ యాక్షన్ కమిటీని టీడీపీ ఏర్పాటు చేసింది. ఇందులో సీనియర్, కీలక నేతలు ఉన్నారు.
చంద్రబాబు ఆదేశాల మేరకే 14 మందితో ఈ కమిటీ ఏర్పాటైంది. కమిటీలో యనమల రామక్రిష్ణుడు, అచ్చెన్నాయుడు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, బాలక్రిష్ణ, లోకేష్, పయ్యావుల కేశవ్, ఎంఏ షరీఫ్, నక్కా ఆనంద్ బాబు తదితరులున్నారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ చేపట్టే కార్యక్రమాలతో పాటు నేతల్ని సమన్వయం చేసుకోవడం ఈ కమిటీ విధి. అంతే కాకుండా మద్దతుగా వచ్చే రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ఇతరులతో ఈ కమిటీ సంప్రదింపులు జరుపుతుంది.
This post was last modified on September 25, 2023 5:12 pm
టీడీపీలో నాయకులు.. చంద్రబాబు కనుసన్నల్లోనే మెలుగుతున్నారా? ఆయన చెప్పినట్టే చేస్తున్నారా? అంటే.. మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా…
అవకాశాలు.. అదృష్టాలు.. పదే పదే రావని అంటారు. అవి వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకునేందుకు వ్యక్తులైనా పార్టీలైనా.. ఎవరైనా సరే..…
ఐపీఎల్ 2026 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు అస్సలు కలిసి రావడం లేదు. వరుసగా రెండో ఓటమిని…
ఎన్నికలు సమీపిస్తున్నపుడు కొందరు రాజకీయ నాయకులకు ఎలివేషన్లు ఇస్తూ సినిమాలు వస్తుంటాయి. అలాగే కొందరు నేతలను టార్గెట్ చేస్తూ మూవీస్…
ఏపీ రాజధాని అమరావతిపై సీఎం చంద్రబాబుకు ఉన్న ముందుచూపు, తాజాగా రాజధాని బిల్లును ఆమోదించిన విధానం.. వంటివి చర్చకు వస్తున్నాయి.…
ఏప్రిల్ 8 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా రేసు గుర్రం రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.…