ఏదైనా ఊహించని పరిణామం ఎదురైతే షాక్ కు గురి కావడం సహజమే. ఇప్పుడు టీడీపీ కూడా అదే షాక్ లో ఉంది. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అరెస్టును ఎవరూ ఊహించలేదు.
రాజకీయ నాయకులపై ఆరోపణలు రావడం సహజమే.. కానీ పోలీసులు రంగంలోకి దిగి నేరుగా అదుపులోకి తీసుకునే అవకాశం లేదని టీడీపీ అనుకుంది. అరెస్టయితే చేశారు కానీ కేసు నిలబడదని కూడా టీడీపీ శ్రేణులు ఆశించాయి. కానీ టీడీపీ అనుకున్నది ఒకటైతే జరుగుతోంది మరొకటి.
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబుకు మొదటి నుంచి ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. మొదట 14 రోజలు రిమాండ్ విధించిన ఏసీబీ కోర్టు.. దీన్ని అక్టోబర్ 5 వరకు పెంచింది. మరోవైపు బాబు వేసిన క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. ఇవన్నీ ఊహించని పరిణామాలే.
దీంతో బాబు ఇంకొంత కాలం జైల్లోనే ఉండే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో షాక్ నుంచి బయటకు వచ్చి యాక్షన్ ప్లాన్ పై టీడీపీ ఫోకస్ పెట్టింది. బాబు అరెస్టును జనాల్లోకి మరింతగా తీసుకెళ్లేందుకు కసరత్తులు ప్రారంభించింది.
బాబు అరెస్టుకు వ్యతిరేకంగా చేపట్టాల్సిన నిరసన కార్యక్రమాలు, పార్టీ వ్యవహారల నిర్వహణ, వీటి పర్యవేక్షణ కోసం 14 మంది సభ్యులతో ఓ పొలిటికల్ యాక్షన్ కమిటీని టీడీపీ ఏర్పాటు చేసింది. ఇందులో సీనియర్, కీలక నేతలు ఉన్నారు.
చంద్రబాబు ఆదేశాల మేరకే 14 మందితో ఈ కమిటీ ఏర్పాటైంది. కమిటీలో యనమల రామక్రిష్ణుడు, అచ్చెన్నాయుడు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, బాలక్రిష్ణ, లోకేష్, పయ్యావుల కేశవ్, ఎంఏ షరీఫ్, నక్కా ఆనంద్ బాబు తదితరులున్నారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ చేపట్టే కార్యక్రమాలతో పాటు నేతల్ని సమన్వయం చేసుకోవడం ఈ కమిటీ విధి. అంతే కాకుండా మద్దతుగా వచ్చే రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ఇతరులతో ఈ కమిటీ సంప్రదింపులు జరుపుతుంది.
This post was last modified on September 25, 2023 5:12 pm
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…