వ్యవస్థలను మేనేజ్ చేస్తాడు.. కోర్టులు ఆయన గుప్పెట్లో ఉంటాయి.. స్టేలు తెచ్చుకుని కేసులు ముందుకు సాగకుండా అడ్డం పడతాడు.. ఇలా తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు మీద వైరి పక్షాలు అనేక ఆరోపణలు చేస్తుంటాయి. వ్యవస్థల్ని మేనేజ్ చేస్తాడని ఆయన మీద ఎంతోమంది వ్యాఖ్యానాలు చేసి .. జనాల్లో కూడా ఆ అభిప్రాయం బలపడిపోయేలా చేశారు. కట్ చేస్తే ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో పరిణామాలు చూస్తుంటే ఈ ఆరోపణలు ఎంత వరకు నిజం అనే ప్రశ్న తలెత్తుతోంది.
ఇది చాలా చిన్న కేసు అని.. అసలు ఈ ఈ కేసులో అవినీతి జరిగినట్లు సరైన ఆధారాలే లేవని.. ఒకవేళ ఎక్కడైనా తప్పు జరిగినా.. పద్ధతి ప్రకారం అన్నీ చేసి కేబినెట్ ఆమోదంతో నిధుల విడుదలకు ఆమోదం తెలిపినంత మాత్రాన సీఎం దీనికి ఎలా బాధ్యత వహిస్తాడని జయప్రకాష్ నారాయణ లాంటి నిపుణులు ప్రశ్నిస్తున్నారు.
ఇలాంటి వ్యవహారాల్లో సీఎంను బాధ్యుడిని చేయాలంటే అసలు దేశంలో ప్రభుత్వాలే నడవవు అని ఆయన తేల్చేశారు. కేసు ఇంత స్పష్టంగా ఉన్నా సరే.. చంద్రబాబు ఈ కేసులో రిమాండ్లో గడపాల్సి వస్తోంది. ఆధారాలు లేకుండా కేసు పెట్టి.. విచారణ తర్వాత నిజాలు బయటికి తీస్తాం అంటోంది ప్రభుత్వం. చంద్రబాబు నిజంగా వ్యవస్థల్ని మేనేజ్ చేసేట్లయితే.. ఈ కేసులో ఆయన రిమాండుకు వెళ్లాల్సిన పనే ఉండేది కాదు. ఒకవేళ వెళ్లినా ఒకట్రెండు రోజుల్లో బయటికి వచ్చేసేవారే.
కానీ వారం తర్వాత కూడా బాబు ఇంకా జైల్లో ఉన్నారంటే ఆయన నిస్సహాయంగా ఉన్నట్లే. కేసులో పరిణామాలు చూస్తుంటే జగన్ అండ్ కోనే వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నారేమో అన్న సందేహాలు బలంగా కలుగుతున్నాయి. ఈ కేసు వ్యవహారం చూశాక అయినా చంద్రబాబు వ్యవస్థల్ని మేనేజ్ చేస్తాడు అనే అపప్రథ తొలగిపోతుందేమో చూడాలి.
అంతర్గత వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం కనక నిజమయ్యే పక్షంలో రామ్ చరణ్ అభిమానులకు అది గుడ్ న్యూస్ కానుంది.…
అల్లు అర్జున్ హీరోగా లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో రాబోతున్న కొత్త సినిమాపై ఇండస్ట్రీలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. సినిమా…
విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది చనిపోగా… ఆరుగురు తీవ్రంగా గాయపడి వేర్వేరు ఆసుపత్రుల్లో…
గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కు ఎప్పుడు కష్టం వచ్చినా… ఆదుకునేందుకు కర్ణాకట కొత్త సీఎం డీకే శివకుమార్ సదా…
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక క్రేజీ ప్రాజెక్ట్ ఆగిపోయిందనే వార్త హాట్ టాపిక్ గా మారింది. కోలీవుడ్ కు…
విశాఖ స్టీల్ ప్లాంట్ లో సోమవారం భారీ ప్రమాదం సంభవించింది. 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు గాయపడ్డారు.…