టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అరెస్టుకు వ్యతిరేకంగా హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం వరకు ఐటీ ఉద్యోగులు చేపట్టిన కార్ల ర్యాలీతో వాతావరణం టెన్షన్గా మారింది. ఆదివారం తెల్లవారుజామునే హైదరాబాద్ నుంచి కార్లలో ఐటీ ఉద్యోగులు బయల్దేరారు. అయితే ఈ ర్యాలీ గురించి రెండు, మూడు రోజులుగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఏపీ పోలీసులు దీనికి అనుమతి లేదని చెబుతున్నారు. అనుమతి లేనిదే ర్యాలీ నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో భారీగా పోలీసులు మోహరించారు. రోడ్డుపై వెళ్తున్న అన్ని కార్లను క్షుణ్నంగా పరీక్షిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉన్న కారణంగా ఎలాంటి ర్యాలీలకు అనుమతి లేదని చెబుతున్న పోలీసులు. ఎన్టీఆర్ జిల్లా గరికపాడు చెక్ పోస్ట్, జీలుగుమిల్లి, రాజుపేటతో పాటు మరోవైపు తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి, గోపాలపురం తదితర చోట్ల చెక్ పోస్టులు, పికెట్లు ఏర్పాటు చేసి కార్లను పోలీసులు తనిఖీ చేస్తున్నారు. అనుమానం వచ్చిన కార్లను అనుమంచిపల్లి కోల్డ్ స్టోరేజ్ వద్ద ఆపేస్తున్నారు. ఐటీ ఉద్యోగులను అడ్డుకుంటున్నారు.
పోలీసులు ఐటీ ఉద్యోగులను అడ్డుకోవడంతో ఏపీకి వెళ్లే స్వేచ్ఛ కూడా లేదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఏపీకి వెళ్లాలంటే వీసా కావాలా? అంటూ ఐటీ ఉద్యోగులతో పాటు నాయకులు, ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇది పాకిస్థాన్ బోర్డర్ కాదు ఆంధ్రప్రదేశ్ సరిహద్దు అంటూ.. ఐటీ ఉద్యోగులను అడ్డుకోవడం కోసం భారీ స్థాయిలో పోలీసులను మోహరించడాన్ని టీడీపీ ఎద్దేవా చేసింది. చంద్రబాబు అరెస్టు తర్వాత విజయవాడ వెళ్లేందుకు పవన్ ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. అప్పుడు రోడ్డుపై పడుకుని నిరసన తెలిపిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రాకు వెళ్లాలంటే వీసా, పాస్ పోర్టు కావాలా? అని ప్రశ్నించారు. ఇప్పుడు ఐటీ ఉద్యోగుల విషయంలోనూ పోలీసుల తీరు విమర్శలకు తావిస్తోంది. ఐటీ ఉద్యోగుల కార్లను పోలీసులు అడ్డుకోవడంతో ఏపీకి వెళ్లాలంటే వీసా కావాలా? అనే విమర్శలు వినిపిస్తున్నాయి.
This post was last modified on September 24, 2023 2:54 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…