టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అరెస్టుకు వ్యతిరేకంగా హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం వరకు ఐటీ ఉద్యోగులు చేపట్టిన కార్ల ర్యాలీతో వాతావరణం టెన్షన్గా మారింది. ఆదివారం తెల్లవారుజామునే హైదరాబాద్ నుంచి కార్లలో ఐటీ ఉద్యోగులు బయల్దేరారు. అయితే ఈ ర్యాలీ గురించి రెండు, మూడు రోజులుగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఏపీ పోలీసులు దీనికి అనుమతి లేదని చెబుతున్నారు. అనుమతి లేనిదే ర్యాలీ నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో భారీగా పోలీసులు మోహరించారు. రోడ్డుపై వెళ్తున్న అన్ని కార్లను క్షుణ్నంగా పరీక్షిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉన్న కారణంగా ఎలాంటి ర్యాలీలకు అనుమతి లేదని చెబుతున్న పోలీసులు. ఎన్టీఆర్ జిల్లా గరికపాడు చెక్ పోస్ట్, జీలుగుమిల్లి, రాజుపేటతో పాటు మరోవైపు తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి, గోపాలపురం తదితర చోట్ల చెక్ పోస్టులు, పికెట్లు ఏర్పాటు చేసి కార్లను పోలీసులు తనిఖీ చేస్తున్నారు. అనుమానం వచ్చిన కార్లను అనుమంచిపల్లి కోల్డ్ స్టోరేజ్ వద్ద ఆపేస్తున్నారు. ఐటీ ఉద్యోగులను అడ్డుకుంటున్నారు.
పోలీసులు ఐటీ ఉద్యోగులను అడ్డుకోవడంతో ఏపీకి వెళ్లే స్వేచ్ఛ కూడా లేదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఏపీకి వెళ్లాలంటే వీసా కావాలా? అంటూ ఐటీ ఉద్యోగులతో పాటు నాయకులు, ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇది పాకిస్థాన్ బోర్డర్ కాదు ఆంధ్రప్రదేశ్ సరిహద్దు అంటూ.. ఐటీ ఉద్యోగులను అడ్డుకోవడం కోసం భారీ స్థాయిలో పోలీసులను మోహరించడాన్ని టీడీపీ ఎద్దేవా చేసింది. చంద్రబాబు అరెస్టు తర్వాత విజయవాడ వెళ్లేందుకు పవన్ ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. అప్పుడు రోడ్డుపై పడుకుని నిరసన తెలిపిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రాకు వెళ్లాలంటే వీసా, పాస్ పోర్టు కావాలా? అని ప్రశ్నించారు. ఇప్పుడు ఐటీ ఉద్యోగుల విషయంలోనూ పోలీసుల తీరు విమర్శలకు తావిస్తోంది. ఐటీ ఉద్యోగుల కార్లను పోలీసులు అడ్డుకోవడంతో ఏపీకి వెళ్లాలంటే వీసా కావాలా? అనే విమర్శలు వినిపిస్తున్నాయి.
విజయవాడలోని కృష్ణలంక ప్రాంతానికి చెందిన సాయికృష్ణ అనే యువకుడు లాకప్ డెత్ కు గురయ్యాడని తీవ్రస్థాయిలో ఆరోపణలు వస్తున్న సంగతి…
అమెరికానుంచి తరచుగా భారత్కు అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. వలస విధానానికి సంబంధించి, హెచ్-1బీ వీసాలకు సంబంధించి కూడా భారత్కు అమెరికా…
ఓ పరామర్శ అయినా, ఓ సాయం అయినా, ఓ ఓదార్పు అయినా, ఓ కేసు అయినా, ఓ పథకం అయినా……
ఇప్పుడు ప్రపంచంలో నంబర్ వన్ డైౌరెక్టర్ ఎవరు అని పోల్ పెడితే.. తిరుగులేని ఆధిక్యంతో క్రిస్టోఫర్ నోలనే గెలుస్తాడు అనడంలో…
గత శుక్రవారం ‘సింగ్గీతం’ చిత్రం విడుదల కావడానికి ముందు పెద్దగా బజ్ కనిపించలేదు. 94 ఏళ్ల వయసులో సింగీతం ఓపిగ్గా…
గత ఎన్నికల సమయంలో మంగళగిరిలోని ప్రతి వీధిలోనూ పర్యటించిన నారా లోకేష్.. అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యను ప్రభుత్వం…