స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అరెస్టు విషయంలో మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా కొన్ని రోజుల నుంచి ఈ బీఆర్ఎస్ నేత మాట్లాడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా బాబు అరెస్టుకు నిరసనగా మోత్కుపల్లి నరసింహులు ఆదివారం (సెప్టెంబర్ 24) హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ లో దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మోత్కుపల్లి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 2019లో జగన్ గెలుపు కోరుకుని తప్పు చేశానని మోత్కుపల్లి అన్నారు.
చంద్రబాబు కుటుంబాన్ని చంపే ప్రయత్నం జరుగుతోందని, బాబు చనిపోతే తమకు ఎదురుండదని జగన్ భావిస్తున్నారని మోత్కుపల్లి ఆరోపించారు. త్వరలోనే తాను రాజమండ్రి వెళ్లి చంద్రబాబు కుటుంబ సభ్యులను కలిసి మాట్లాడుతానని మోత్కుపల్లి అన్నారు. బాబు అరెస్టు రాజ్యాంగ విరుద్ధమని, నాలుగు నెలల తర్వాత జగన్ జైలుకు వెళ్లాల్సిందేనని మోత్కుపల్లి చెప్పారు. 2019లో జగన్ ను గెలిపించమని ప్రజలను కోరి తాను పొరపాటు చేశానని, ఇప్పుడు తల దించుకుంటున్నానని ఆయన అన్నారు.
నారా భువనేశ్వరి ఉసురు కచ్చితంగా జగన్ కు తగులుతుందని మోత్కుపల్లి అన్నారు. గవర్నర్ అనుమతి లేకుండా బాబును అరెస్టు చేయడం దుర్మార్గమని, సీఎం పదవి శాశ్వతం కాదని జగన్ గుర్తుంచుకోవాలన్నారు. లోకేష్ ను కూడా అరెస్టు చేయాలనుకోవడం అన్యాయమని మోత్కుపల్లి ధ్వజమెత్తారు. ముష్టి రూ.371 కోట్ల కోసం బాబు ఆశపడతారంటే ప్రజలు నమ్మటం లేదన్నారు. బాబును ఇబ్బంది పెడితే జగన్ కే నష్టమని, ఈ సారి ఎన్నికల్లో వైసీపీకి 151 కాదు కనీసం నాలుగు సీట్లు కూడా రావని మోత్కుపల్లి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎన్నికల్లో వాడుకున్న తర్వాత తల్లి, చెల్లిని బయటకు పంపిన చరిత్ర జగన్ ది అని, సొంత బాబాయ్ ను చంపిన నేరస్థులను పట్టుకోలేని అసమర్థుడు జగన్ అని మోత్కుపల్లి రెచ్చిపోయారు.
This post was last modified on September 24, 2023 2:45 pm
టీడీపీలో నాయకులు.. చంద్రబాబు కనుసన్నల్లోనే మెలుగుతున్నారా? ఆయన చెప్పినట్టే చేస్తున్నారా? అంటే.. మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా…
అవకాశాలు.. అదృష్టాలు.. పదే పదే రావని అంటారు. అవి వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకునేందుకు వ్యక్తులైనా పార్టీలైనా.. ఎవరైనా సరే..…
ఐపీఎల్ 2026 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు అస్సలు కలిసి రావడం లేదు. వరుసగా రెండో ఓటమిని…
ఎన్నికలు సమీపిస్తున్నపుడు కొందరు రాజకీయ నాయకులకు ఎలివేషన్లు ఇస్తూ సినిమాలు వస్తుంటాయి. అలాగే కొందరు నేతలను టార్గెట్ చేస్తూ మూవీస్…
ఏపీ రాజధాని అమరావతిపై సీఎం చంద్రబాబుకు ఉన్న ముందుచూపు, తాజాగా రాజధాని బిల్లును ఆమోదించిన విధానం.. వంటివి చర్చకు వస్తున్నాయి.…
ఏప్రిల్ 8 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా రేసు గుర్రం రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.…