స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అరెస్టు విషయంలో మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా కొన్ని రోజుల నుంచి ఈ బీఆర్ఎస్ నేత మాట్లాడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా బాబు అరెస్టుకు నిరసనగా మోత్కుపల్లి నరసింహులు ఆదివారం (సెప్టెంబర్ 24) హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ లో దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మోత్కుపల్లి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 2019లో జగన్ గెలుపు కోరుకుని తప్పు చేశానని మోత్కుపల్లి అన్నారు.
చంద్రబాబు కుటుంబాన్ని చంపే ప్రయత్నం జరుగుతోందని, బాబు చనిపోతే తమకు ఎదురుండదని జగన్ భావిస్తున్నారని మోత్కుపల్లి ఆరోపించారు. త్వరలోనే తాను రాజమండ్రి వెళ్లి చంద్రబాబు కుటుంబ సభ్యులను కలిసి మాట్లాడుతానని మోత్కుపల్లి అన్నారు. బాబు అరెస్టు రాజ్యాంగ విరుద్ధమని, నాలుగు నెలల తర్వాత జగన్ జైలుకు వెళ్లాల్సిందేనని మోత్కుపల్లి చెప్పారు. 2019లో జగన్ ను గెలిపించమని ప్రజలను కోరి తాను పొరపాటు చేశానని, ఇప్పుడు తల దించుకుంటున్నానని ఆయన అన్నారు.
నారా భువనేశ్వరి ఉసురు కచ్చితంగా జగన్ కు తగులుతుందని మోత్కుపల్లి అన్నారు. గవర్నర్ అనుమతి లేకుండా బాబును అరెస్టు చేయడం దుర్మార్గమని, సీఎం పదవి శాశ్వతం కాదని జగన్ గుర్తుంచుకోవాలన్నారు. లోకేష్ ను కూడా అరెస్టు చేయాలనుకోవడం అన్యాయమని మోత్కుపల్లి ధ్వజమెత్తారు. ముష్టి రూ.371 కోట్ల కోసం బాబు ఆశపడతారంటే ప్రజలు నమ్మటం లేదన్నారు. బాబును ఇబ్బంది పెడితే జగన్ కే నష్టమని, ఈ సారి ఎన్నికల్లో వైసీపీకి 151 కాదు కనీసం నాలుగు సీట్లు కూడా రావని మోత్కుపల్లి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎన్నికల్లో వాడుకున్న తర్వాత తల్లి, చెల్లిని బయటకు పంపిన చరిత్ర జగన్ ది అని, సొంత బాబాయ్ ను చంపిన నేరస్థులను పట్టుకోలేని అసమర్థుడు జగన్ అని మోత్కుపల్లి రెచ్చిపోయారు.
This post was last modified on September 24, 2023 2:45 pm
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…