Political News

జగన్ కు ఇది లాభమా.. నష్టమా..?

పెన్షన్ విధానంపై ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఫైనల్ చేసేసింది. కొత్తగా రూపొందించిన గ్యారెంటీ పెన్షన్ స్కీమ్ (జీపీఎస్)మాత్రమే అమలు చేయబోతున్నట్లు మంత్రి బొత్సా సత్యనారాయణ ఉద్యోగ సంఘాల నేతలకు స్పష్టంగా చెప్పేశారు. అయితే ఉద్యోగులేమో తమకు జీపీఎస్ వద్దని ఓపీఎస్సే కావాలని పట్టుబడుతున్నారు. ఓపీఎస్ అంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్. ఈ ఓపీఎస్ ను యూపీఏ ప్రభుత్వం అమల్లోకి రాగానే అంటే 2004లోనే రద్దుచేసింది. 2004కి ముందు ఉన్న ఉద్యోగులకు మాత్రమే ఓపీఎస్ వర్తిస్తుంది.

2004 తర్వాత ఉద్యోగంలో చేరి రిటైర్ అయిన వాళ్ళెవరికీ ఓపీఎస్ వర్తించదు. అయితే ఏ పద్దతిలో పెన్షన్ ఇవ్వాలనే విషయాన్ని అప్పట్లో కేంద్రప్రభుత్వం రాష్ట్రప్రభుత్వాలకు వదిలిపెట్టేసింది. ఇపుడు సమస్య ఏమైందంటే కేంద్రంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు ఓపీఎస్ ను అమలు చేస్తామని చెబుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో అమల్లోకి తెచ్చాయి. అయితే దీనివల్ల సమస్య ఏమిటంటే ముందుముందు ఖజానాపై ఆర్ధికభారం చాలా ఎక్కువైపోతుంది.

ఈ విషయం తెలియటంతోనే చంద్రబాబునాయుడు ఉద్యోగులకు ఎలాంటి హామీ ఇవ్వలేదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు సీపీఎస్ అంటే కంపల్సరీ పెన్షన్ స్కీమ్ అమల్లో ఉండేది. అయితే 2019 ఎన్నికలకు ముందు పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి మాత్రం అధికారంలోకి రాగానే సీపీఎస్ రద్దుచేస్తానని హామీ ఇచ్చేశారు. దీనివల్ల ఉద్యోగుల ఓట్లు పడితే పడుండచ్చుకానీ తన హామీని మాత్రం నిలుపుకోలేకపోయారు. ఉద్యోగులకు తప్పుడు హామీ ఇచ్చినట్లయ్యింది. దాదాపు నాలుగేళ్ళు సీపీఎస్సే అమల్లో ఉండి ఇపుడు రద్దయ్యింది. దీనిస్ధానంలో జీపీఎస్ ను తీసుకొచ్చారు. దీన్నే ఇపుడు ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

జగన్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన జీపీఎస్ ను కేంద్రం కూడా అభినందించింది. అయితే ఇక్కడ ఆమోదించాల్సింది ఉద్యోగులు మాత్రమే. మరి వీళ్ళంతా ఇపుడు ప్రభుత్వంపై మండిపోతున్నారు. దాంతో రాబోయే ఎన్నికల్లో పెన్షన్ అన్న అంశం వైసీపీపై ఏ మేరకు ప్రభావం పడుతుందో చూడాలి. ఎందుకంటే ఇపుడున్న ఉద్యోగులందరికీ జీపీఎస్ వర్తించదు. అంటే పెన్షన్ విధానంపైన ఉద్యోగుల్లోనే విభేదాలున్నాయి. 2004 తర్వాత ఉద్యోగంలో చేరిన ఉద్యోగులు ఎంతమంది అన్న లెక్కలు తేలితే ప్రభుత్వంపై పదే ప్రభావం లెక్కతేలుతుంది.

This post was last modified on September 24, 2023 1:13 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చిరంజీవి దగ్గరికి వెళ్తే ఏమవుతుంది

ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…

34 minutes ago

పెద్దిని వద్దనుకుంటే ఎవరికి నష్టం

నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…

1 hour ago

“రాహుల్-ప్రియాంక‌.. కేర‌ళ మిమ్మ‌ల్ని క్ష‌మించ‌దు!“

కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత‌లు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీల‌కు కేర‌ళలో తీవ్ర‌నిర‌స‌న సెగ త‌గులుతోంది. రాహుల్‌-ప్రియాంక‌.. కేర‌ళ మిమ్మ‌ల్ని క్ష‌మించ‌దు.…

2 hours ago

పవన్ చెప్తే చేస్తాడండోయ్

నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…

3 hours ago

బండి భగీరథ్ కేసు ఫిర్యాదురాలి వయసుపై ట్విస్ట్

కేంద్ర హోం శాఖ సహాయం మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి…

3 hours ago

నిర్మాతల మధ్య ముదురుతున్న వివాదం

తెలంగాణ‌లో సింగిల్ స్క్రీన్ల‌ను న‌డిపించే ఎగ్జిబిట‌ర్ల‌కు, నిర్మాత‌ల‌కు మధ్య పీట‌ముడి గ‌ట్టిగానే బిగుసుకునేలా క‌నిపిస్తోంది. అద్దె విధానం ప‌క్క‌న పెట్టి…

3 hours ago