జగన్మోహన్ రెడ్డిపై జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు యుద్ధం ప్రకటించారు. రాబోయే ఆరుమాసాలు చాలా కీలకమైనవని చెప్పారు. చిత్తూరు, తిరుపతి జిల్లాల నియోజకవర్గాల ఇన్చార్జిలు, ముఖ్యనేతల సమావేశంలో నాగబాబు మాట్లాడుతు నేతలందరు ఇగోని వదిలిపెట్టాలన్నారు. రాబోయే ఎన్నికలు జనసేనకు ఎంత కీలకమో అందరు గుర్తించాలన్నారు. ఎన్నికల్లో జగన్ను ఓడించేంతవరకు నేతలెవరు విశ్రాంతి కూడా తీసుకోకూడదని గట్టిగా చెప్పారు. నేతలు, క్యాడర్ అంతా కలిసికట్టుగా పనిచేస్తే జనసేన ప్రభంజనం సృష్టిస్తుందని అన్నారు.
పార్టీ కార్యక్రమాల నిర్వహణలో నేతల మధ్య ఇగో సమస్యలున్నట్లు నాగబాబుకు అనిపించిందట. ఇదే విషయాన్ని ఆయన నొక్కిచెప్పారు. నేతలైనా క్యాడరైనా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను చూసే పనిచేయాలన్నారు. రాబోయే ఎన్నికల్లో మన సత్తా చూపించకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. కాబట్టి ఇగోలను పక్కనపెట్టి పార్టీ పటిష్టత కోసం అందరు ఏకతాటిపైకి రావాలని విజ్ఞప్తిచేశారు.
సైకో ముఖ్యమంత్రిని అధికారంలో నుండి దింపే బాధ్యతను ప్రతి ఒక్కళ్ళు ఒక సంకల్పంలాగ తీసుకోవాలన్నారు. 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లును ఉద్దేశించి మాట్లాడుతు పార్టీలో మహిళలకు సముచిత స్ధానం ఎప్పుడూ ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇదే సమయంలో జగన్ పాలనా విధానాన్ని, అవినీతి, అరాచకాలను నాగబాబు నేతలకు విడమరచిచెప్పారు. వ్యవస్ధలను మ్యానేజ్ చేయటంలో జగన్ ఎంతటి అనుభవజ్ఞుడో ఇప్పటికే అందరికీ అర్ధమైపోయుంటుందన్నారు. కాబట్టి అన్నీ విషయాలను దృష్టిలో పెట్టుకుని పార్టీలో నేతలు, క్యాడర్ ఐకమత్యంగా ముందుకెళ్ళాలని పిలుపిచ్చారు.
వీలైనంతగా నేతలు, క్యాడర్ జనాల్లో చొచ్చుకుపోవాలన్నారు. స్ధానికంగా ఉండే సమస్యలపైన వాటి పరిష్కారాలపైన ఎక్కువగా దృష్టిపెట్టాలన్నారు. సమస్యలపై ఆందోళనలు, నిరసనలు చేయటం ద్వారా జనాలను ఆకట్టుకోవచ్చని చెప్పారు. సమస్యలపై ఆందోళనలను చేసినపుడు లోకల్ జనాలు కూడా కలిసొస్తారని, అప్పుడు వాటికి పరిష్కారం చూపించగలిగితే మన పార్టీపైన అందరికీ నమ్మకం వస్తుందని నాగబాబు చెప్పారు. కాబట్టి ప్రతి నియోజకవర్గంలోను నేతలు ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీచేసుకుని పోరాటాలను మరింత ఉధృతంచేయాలని పిలుపిచ్చారు. మరి నాగబాబు పిలుపుతో నేతలు, క్యాడర్ ఏమేరకు జనాల్లోకి వెళతారో చూడాల్సిందే.
This post was last modified on September 24, 2023 10:23 am
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…