Political News

నాలుగేళ్లు ఏం పీకావు జగన్?: మోత్కుపల్లి

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై మాజీ టీడీపీ నేత, మాజీ మంత్రి, తెలంగాణ సీనియర్ పొలిటిషన్ మోత్కుపల్లి నర్సింహులు స్పందించారు. ఈ సందర్భంగా జగన్ పై మోత్కుపల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. నువ్వు ఒక దుర్మార్గుడివి జగన్…చంద్రబాబు వంటి పెద్ద మనిషిని నిరాధార ఆరోపణలపై అరెస్టు చేసేందుకు నీకు సిగ్గు, బుద్ధి ఉన్నాయా?అంటూ విరుచుకుపడ్డారు. ఎన్టీఆర్ ఘాట్ లో ఎన్టీఆర్ కు నివాళులు అర్పించిన తర్వాత మీడియాతో మాట్లాడిన మోత్కుపల్లి జగన్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు.

2018 ఎన్నికల సమయంలో ఇదే ఘాట్ దగ్గర తాను జగన్ గెలవాలని కోరుకున్నానని గుర్తు చేసుకున్నారు. అయితే, అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ మైకంలోకి వెళ్లారని, ఇంటి నుంచి తల్లిని, చెల్లిని బయటకు పంపించేంతగా ఆ మైకం చేరుకుందని షాకింగ్ కామెంట్స్ చేశారు. రాజధాని లేని రాజ్యాన్ని నడిపిస్తున్న జగన్ నియంత మాదిరిగా రాజ్యమేలుతున్నాడని విమర్శించారు. 74 సంవత్సరాల పెద్దమనిషి, ఈ దేశానికి నాయకుడు, వాజ్ పేయి ప్రభుత్వానికి సలహాదారుడిగా ఉన్న చంద్రబాబును జగన్ జైల్లో పెట్టి రాక్షసానందం పొందుతున్నారని దుయ్యబట్టారు. మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు 371 కోట్లకు దిగజారుతారా అని ప్రశ్నించారు.

ఈ నాలుగేళ్లు ఏం పీకావని జగన్ ను మోత్కుపల్లి నిలదీశారు. చంద్రబాబు వయసుకు విలువ ఇచ్చి జగన్ వెంటనే ఆయనకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక, చంద్రబాబు అక్రమ అరెస్టును కేసీఆర్ ఖండించాలని కూడా మోత్కుపల్లి కోరారు. జగన్ మనిషిగా మారాలని, బటన్ ఒత్తి పాలన చేయడం కాదని హితవు పలికారు. జైలుకెళ్లిన జగన్ ఎన్నికల్లో గెలిచారని, ఇప్పుడు అదే తరహాలో చంద్రబాబు గెలుస్తారని జోస్యం చెప్పారు. చంద్రబాబుకు జగన్ క్షమాపణ చెప్పి చేసిన తప్పును సరిదిద్దుకోవాలని సూచించారు. రేపు రాజమండ్రి వెళ్లి భువనేశ్వరిని పరామర్శిస్తానని , ములాఖత్ కు అనుమతి దొరికితే చంద్రబాబును కలుస్తానని మోత్కుపల్లి చెప్పారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద రేపు నిరాహార దీక్ష చేపడుతున్నానని ప్రకటించారు.

Share
Show comments
Published by
Satya
Tags: motkupalli

Recent Posts

మళ్ళీ పవన్ పై కాంగ్రెస్ ఫైర్

ఏపీ ఉప ముఖ్య‌మంత్రి, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కల్యాణ్‌పై.. తెలంగాణ కాంగ్రెస్ నాయ‌కులు భ‌గ్గుమ‌న్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ కాదు.. దిష్టి…

20 minutes ago

నాని ఎదుర్కున్న సమస్యే శ్రీవిష్ణుకి వస్తుందా

ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…

6 hours ago

మూడు రోజులుగా లడ్డూ లడాయి.. వైసీపీ ట్రాప్‌లో చిక్కారా?

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…

6 hours ago

తిరుమ‌ల ల‌డ్డూపై క‌మిష‌న్‌.. సూత్రధారులు దొరుకుతారా?

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వినియోగంపై ప్ర‌స్తుతం సీబీఐ విచార‌ణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్‌ను కూడా నెల్లూరు…

8 hours ago

రాజా సాబ్ మళ్ళీ టార్గెట్ అవుతాడా

డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…

8 hours ago

అర్జున్ ఈ విషయంలో అదృష్టవంతుడే

వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…

9 hours ago