సీఎం జగన్ బెయిల్ మీద బయట ఉండి సీఎం అయ్యారని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. అక్రమాస్తుల కేసుల్లో 16 నెలలు జైలులో ఉన్న జగన్…చంద్రబాబును కనీసం 16 రోజులైనా జైలులో ఉంచాలని కక్షగట్టారని విమర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేస్ సెటైర్లు వేశారు. జగన్ గత పదేళ్లుగా బెయిల్పై ఉన్నారని, బెయిల్ డే వార్షికోత్సవ శుభాకాంక్షలు జైలు మోహన్ అని లోకేష్ ఎద్దేవా చేశారు.
సీబీఐ, ఈడీ పెట్టిన 38 కేసుల్లో ఏ1గా ఉన్న జగన్ రూ.42 వేల కోట్లు ప్రజాధనం దోచి పదేళ్లుగా బెయిలుపై తిరుగుతున్నారని, ఆర్థిక ఉగ్రవాది జైలు మోహన్ ప్రజాస్వామ్య వ్యవస్థల్ని ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. రాజ్యాంగాన్ని కాలరాస్తూ, నీతిమంతుల్ని జైలుకు పంపుతున్నాడని లోకేష్ ఆరరోపిించారు. జైలులో ఉండాల్సిన జగన్ పదేళ్లుగా బయట ఉంటే, జనంలో ఉండాల్సిన నిజాయితీపరుడు సీబీఎన్ జైలులో ఉన్నారంటూ లోకేష్ విమర్శించారుు.
ఇక, జగన్ పై టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి కూడా విమర్శలు గుప్పించారు. పదేళ్లుగా జగన్ బెయిల్ పై ఉన్నారని, వైఎస్ అధికారాన్ని అడ్డుపెట్టుకుని భారీ అవినీతికి పాల్పడిన జగన్ 23 సెప్టెంబరు 2013న బెయిల్ పై బయటకు వచ్చారని చురకలంటించారు. పదేళ్లుగా కోర్టుల నుంచి తప్పించుకుని బెయిల్ పై బయట తిరుగుతున్నారని, దేశంలో ఇదో రికార్డని ఎద్దేవా చేశారు. ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో దీనిని నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ రికార్డు సర్టిఫికెట్ను ఫ్రేమ్ కట్టి తాడేపల్లి ప్యాలెస్కు వచ్చి అందిస్తారని సెటైర్లు వేశారు. జగన్ విద్యార్హతల గురించి ఏ సర్టిఫికెట్ ఉందో ఎవరికీ తెలీదని, ఈ రికార్డు సర్టిఫికెట్ను జగన్ ఇంటి గోడలు, పార్టీ, ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయాలని చురకలంటించారు.
This post was last modified on September 23, 2023 5:24 pm
వైసీపీలో మరోసారి సజ్జల రామకృష్ణారెడ్డి శకం ప్రారంభం అవుతుందని పార్టీ నాయకులు చెబుతున్నారు. పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్..…
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్లే లక్ష్యంగా ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. భారత…
తెలుగు సినిమా చరిత్రలోనే ది బెస్ట్ లవ్ స్టోరీల లిస్ట్ తీస్తే.. అందులో ‘తొలిప్రేమ’ కచ్చితంగా ఉంటుంది. తమిళుడైన కరుణాకరన్ ఈ…
ఇంకో అయిదు రోజుల్లో ధనుష్ కర విడుదల కానుంది. తమిళంతో పాటు తెలుగులో సమాంతరంగా రిలీజ్ చేస్తున్నా ఇక్కడ ప్రమోషన్ల…
వరుణ్ తేజ్ను పెళ్లి చేసుకుని మెగా ఫ్యామిలీలోకి కోడలిగా వెళ్లిన లావణ్య త్రిపాఠి.. తర్వాత సినిమాలకు దాదాపుగా దూరమైనట్లే కనిపించింది. ఐతే పెళ్లి…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రతిష్టాత్మక `బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్` అవార్డు లభించింది. ముంబైలో జరిగిన కార్యక్రమంలో శనివారం…