సీఎం జగన్ బెయిల్ మీద బయట ఉండి సీఎం అయ్యారని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. అక్రమాస్తుల కేసుల్లో 16 నెలలు జైలులో ఉన్న జగన్…చంద్రబాబును కనీసం 16 రోజులైనా జైలులో ఉంచాలని కక్షగట్టారని విమర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేస్ సెటైర్లు వేశారు. జగన్ గత పదేళ్లుగా బెయిల్పై ఉన్నారని, బెయిల్ డే వార్షికోత్సవ శుభాకాంక్షలు జైలు మోహన్ అని లోకేష్ ఎద్దేవా చేశారు.
సీబీఐ, ఈడీ పెట్టిన 38 కేసుల్లో ఏ1గా ఉన్న జగన్ రూ.42 వేల కోట్లు ప్రజాధనం దోచి పదేళ్లుగా బెయిలుపై తిరుగుతున్నారని, ఆర్థిక ఉగ్రవాది జైలు మోహన్ ప్రజాస్వామ్య వ్యవస్థల్ని ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. రాజ్యాంగాన్ని కాలరాస్తూ, నీతిమంతుల్ని జైలుకు పంపుతున్నాడని లోకేష్ ఆరరోపిించారు. జైలులో ఉండాల్సిన జగన్ పదేళ్లుగా బయట ఉంటే, జనంలో ఉండాల్సిన నిజాయితీపరుడు సీబీఎన్ జైలులో ఉన్నారంటూ లోకేష్ విమర్శించారుు.
ఇక, జగన్ పై టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి కూడా విమర్శలు గుప్పించారు. పదేళ్లుగా జగన్ బెయిల్ పై ఉన్నారని, వైఎస్ అధికారాన్ని అడ్డుపెట్టుకుని భారీ అవినీతికి పాల్పడిన జగన్ 23 సెప్టెంబరు 2013న బెయిల్ పై బయటకు వచ్చారని చురకలంటించారు. పదేళ్లుగా కోర్టుల నుంచి తప్పించుకుని బెయిల్ పై బయట తిరుగుతున్నారని, దేశంలో ఇదో రికార్డని ఎద్దేవా చేశారు. ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో దీనిని నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ రికార్డు సర్టిఫికెట్ను ఫ్రేమ్ కట్టి తాడేపల్లి ప్యాలెస్కు వచ్చి అందిస్తారని సెటైర్లు వేశారు. జగన్ విద్యార్హతల గురించి ఏ సర్టిఫికెట్ ఉందో ఎవరికీ తెలీదని, ఈ రికార్డు సర్టిఫికెట్ను జగన్ ఇంటి గోడలు, పార్టీ, ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయాలని చురకలంటించారు.
This post was last modified on September 23, 2023 5:24 pm
ఒకప్పుడు మెలోడీ బ్రహ్మ మణిశర్మ అంటే టాలీవుడ్ ప్రేక్షకులకు ఒక గూస్ బంప్స్ ఎమోషన్. కమర్షియల్ సినిమాలను తన నేపధ్య…
దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ, పరీక్షల నిర్వహణలో అక్రమాల వివాదం చివరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి…
‘బాహుబలి’ ప్రభంజనం తర్వాత ఇండియన్ సినిమాలో సీక్వెల్స్, ఫ్రాంఛైజీ సినిమాల జోరు ఎంతగా పెరిగిందో తెలిసిందే. అవసరం ఉన్నా లేకపోయినా పార్ట్-2లు…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మరో వారంలో ఏపీకి రానున్నారు. ఆగస్టు 1వ తేదీన ఆయన విజయనగరం జిల్లా భోగాపురానికి…
నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతమైన వేళ ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన అర్థరాత్రి సెల్ఫీ…
తాజాగా విడుదలైన చెన్నై లవ్ స్టోరీకి ఆశించిన ఓపెనింగ్ దక్కింది. టాక్ పరంగా సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ ఒకసారి…