Political News

షర్మిల అయోమయంలో ఉన్నారా ?

తనపార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే విషయంలో వైఎస్ షర్మిలలో అయోమయం పెరిగిపోతోందా ? గ్రౌండ్ లెవల్లో పరిస్ధితులను చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానం పెరిగిపోతోంది. ఎందుకంటే షర్మిల పార్టీ విలీనం ఇపుడు అప్పుడు, ఈరోజు, రేపు అంటు ఆలస్యమవుతోంది. ఏదో కారణంగా విలీనం ప్రక్రియలో జాప్యం జరుగుతుండటంతో షర్మిలతో పాటు ఇతరుల్లో కూడా కన్ఫ్యూజన్ పెరిగిపోతోంది. మొన్నటి 16,17 తేదీల్లో సోనియా, రాహుల్, ప్రియాంక గాంధిలు హైదరాబాద్ లోనే ఉన్నారు.

తుక్కుగూడలో బహిరంగసభ, సీడబ్ల్యూసీ మీటింగ్ జరిగాయి. ఆ సమయంలోనే షర్మిల పార్టీలో చేరబోతున్నట్లు ప్రచారం జరిగింది. అయితే విలీనం జరగలేదు. కారణం ఏమిటంటే షర్మిల అయోమయంలో ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. కారణం ఏమిటంటే ఖమ్మంజిల్లాలోని పాలేరు అసెంబ్లీ టికెట్ తనకు ఇవ్వటంతో పాటు మరో ఐదుగురికి టికెట్లు కేటాయించాలని షర్మిల అడిగారట. అయితే అందుకు కాంగ్రెస్ అధిష్టానం కుదరదని చెప్పేసింది.

ఇదే సమయంలో కర్నాటక కోటాలో రాజ్యసభకు నామినేట్ చేస్తామని, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తామని పార్టీ అధిష్టానం ప్రతిపాదించిందట. ఈ ప్రతిపాదనను ఆమోదించాలో లేదో తేల్చుకోలేక షర్మిల బెంగుళూరు వెళ్ళినట్లు సమాచారం. కర్నాటక పీసీసీ అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా పార్టీ అధిష్టానం చెప్పినట్లే నడుచుకోవాలని నచ్చచెప్పినట్లు తెలుస్తోంది. పార్టీ అధిష్టానం హామీఇచ్చిన ప్రకారం నడుచుకుంటే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఉండదని షర్మిలకు డీకే చెప్పారట.

కాబట్టి విలీనం ప్రక్రియను తొందరలోనే ముగించుకోమని కూడా సూచించినట్లు కాంగ్రెస్ వర్గాలు చెప్పాయి. రాజ్యసభ ఎంపీగా నామినేట్ అవ్వటం, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమితులవ్వటం అంటే షర్మిలకు చాలా పెద్ద హోదా దక్కినట్లే అని కాంగ్రెస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. జనరల్ సెక్రటరీ హోదాలో రెండు మూడు రాష్ట్రాలకు ఇన్చార్జిగా నియమిస్తారని మంచి పనితీరు కనబరిస్తే మరింత ప్రాధాన్యత దక్కుతుందని కూడా అంటున్నారు. కాంగ్రెస్ తరపున మంచి ప్రతిపాదన వచ్చిందని మరి షర్మిల ఏమి ఆలోచించుకుంటారో చూడాలని అంటున్నారు. ఆలస్యం కాకుండా ఏదో ఒకటి తేల్చుకుంటే షర్మిలకే మంచిదని కూడా కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.

Satya

Recent Posts

బండ్ల గణేశ్… నిజంగా పవన్ భక్తుడే

టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్… తనను తాను జనసేన అధినేత,…

26 minutes ago

తెలంగాణలో ప‌వ‌న్‌… కిక్కిరిసిన అభిమానులు

ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. తెలంగాణ‌లోని హ‌నుమకొండ‌లో ప‌ర్య‌టించారు. ఢిల్లీ నుంచి నేరుగా హైద‌రాబాద్‌కు…

39 minutes ago

హన్మకొండలో పవన్… చోటా గబ్బర్ సింగ్ కు పరామర్శ

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బుధవారం తన పొరుగు రాష్ట్రం తెలంగాణలో పర్యటిస్తున్నారు. తెలంగాణలోని హన్మకొండ…

2 hours ago

సింగీతం మెచ్చిన పుష్ప

వయసు ఒక నంబర్ మాత్రమే అనే నానుడిని రుజువు చేస్తూ 94 ఏళ్ల వయసులో ఫుల్ లెంత్ ఫీచర్ ఫిలిం…

2 hours ago

బంగారం బోణీ నిజంగా బంగారమే

సమంత మా ఇంటి బంగారం బాగానే బోణీ కొట్టేలా ఉంది. ఓవర్సీస్ లో ఇప్పటికే లక్షా పాతిక వేల డాలర్లు…

2 hours ago

వారణాసి లెక్కలు వేరే ఉన్నాయి

వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదల కానున్న వారణాసి నుంచి ఇప్పుడప్పుడే అప్డేట్స్ వచ్చేలా లేవు కానీ ఈ ప్రాజెక్టుకు…

3 hours ago