టీడీపీ అధినేత చంద్రబాబును స్కిల్ స్కామ్ కేసులో సీఐడీ కస్టడీకి అనుమతిస్తూ విజయవాడలోని ఏసీబీ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. తీవ్ర ఉత్కంఠకు తెరదించుతూ 2 రోజుల పాటు చంద్రబాబును విచారణ జరిపేందుకు సీఐడీ అధికారులకు అనుమతిచ్చింది. అయితే, రాజమండ్రి సెంట్రల్ జైలులోనే చంద్రబాబును రేపు, ఎల్లుండి ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ జరపాలని న్యాయమూర్తి తీర్పు వెల్లడించారు. అంతేకాదు, విచారణ పూర్తయిన తర్వాత చంద్రబాబును కోర్టులో హాజరుపరచాలని సీఐడీ అధికారులను ఆదేశించారు.
సీఐడీ మూడు రోజుల కస్టడీ కోరగా..2 రోజుల తీవ్ర ఉత్కంఠ తర్వాత 2 రోజుల పాటు కస్టడీకి అనుమతించింది. చంద్రబాబును ఎక్కడ విచారణ జరుపుతారని సీఐడీ తరపు న్యాయవాదులను న్యాయమూర్తి ప్రశ్నించారు. అయితే, రాజమండ్రి జైలులోనే విచారణ జరుపుతామని సీఐడీ అధికారులు చెప్పారు. దీంతో, ఇద్దరు న్యాయవాదుల సమక్షంలో విచారణ జరిపేందుకు కోర్టు అనుమతిచ్చింది. విచారణపై సీల్డ్ కవర్లో నివేదికలో ఇవ్వాలని సీఐడీ అధికారులను ఆదేశించింది. విచారణ అధికారుల జాబితా, విచారణకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు బయటకు రాకూడదని ఆదేశించింది.
మరోవైపు, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసులో కూడా చంద్రబాబును సీఐడీ కస్టడీకి ఇవ్వాలంటూ సీఐడీ అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
This post was last modified on September 22, 2023 4:08 pm
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…