Political News

చంద్రబాబుకు షాక్..2 రోజుల కస్టడీ

టీడీపీ అధినేత చంద్రబాబును స్కిల్ స్కామ్ కేసులో సీఐడీ కస్టడీకి అనుమతిస్తూ విజయవాడలోని ఏసీబీ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. తీవ్ర ఉత్కంఠకు తెరదించుతూ 2 రోజుల పాటు చంద్రబాబును విచారణ జరిపేందుకు సీఐడీ అధికారులకు అనుమతిచ్చింది. అయితే, రాజమండ్రి సెంట్రల్ జైలులోనే చంద్రబాబును రేపు, ఎల్లుండి ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ జరపాలని న్యాయమూర్తి తీర్పు వెల్లడించారు. అంతేకాదు, విచారణ పూర్తయిన తర్వాత చంద్రబాబును కోర్టులో హాజరుపరచాలని సీఐడీ అధికారులను ఆదేశించారు.

సీఐడీ మూడు రోజుల కస్టడీ కోరగా..2 రోజుల తీవ్ర ఉత్కంఠ తర్వాత 2 రోజుల పాటు కస్టడీకి అనుమతించింది. చంద్రబాబును ఎక్కడ విచారణ జరుపుతారని సీఐడీ తరపు న్యాయవాదులను న్యాయమూర్తి ప్రశ్నించారు. అయితే, రాజమండ్రి జైలులోనే విచారణ జరుపుతామని సీఐడీ అధికారులు చెప్పారు. దీంతో, ఇద్దరు న్యాయవాదుల సమక్షంలో విచారణ జరిపేందుకు కోర్టు అనుమతిచ్చింది. విచారణపై సీల్డ్ కవర్‌లో నివేదికలో ఇవ్వాలని సీఐడీ అధికారులను ఆదేశించింది. విచారణ అధికారుల జాబితా, విచారణకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు బయటకు రాకూడదని ఆదేశించింది.

మరోవైపు, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసులో కూడా చంద్రబాబును సీఐడీ కస్టడీకి ఇవ్వాలంటూ సీఐడీ అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

This post was last modified on September 22, 2023 4:08 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రశ్నార్థకంగా మారుతున్న రామ్ సెలక్షన్

ఆంధ్రకింగ్ తాలూకా ఫైనల్ రన్ అయిపోయింది. పాజిటివ్ రివ్యూలు, బాగుందని చెప్పిన పబ్లిక్ టాక్స్ ఇవేవి పట్టుమని మూడు వారాల…

11 minutes ago

కోహ్లీ, రోహిత్‌… జీతాలు తగ్గుతాయా?

టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల జీతాల్లో కోత పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏటా ఆటగాళ్లకు…

2 hours ago

హడావిడి చేసిన ‘డెవిల్’ ఎలా ఉన్నాడు

జైల్లో ఉన్న కన్నడ స్టార్ హీరో దర్శన్ కొత్త సినిమా డెవిల్ ఇవాళ భారీ హడావిడి మధ్య కర్ణాటకలో విడుదలయ్యింది.…

4 hours ago

`పిన్నెల్లి జైలు`తో ప‌ల్నాడు వైసీపీ విల‌విల‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు భారీ దెబ్బ త‌గిలింది. ఇప్ప‌టి వ‌ర‌కు ప‌ల్నాడు రాజ‌కీయాల్లో ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చ‌క్రం తిప్పిన పిన్నెల్లి…

4 hours ago

ఇండిగో… కోపాలు తగ్గించేందుకు ఆఫర్లు

ఇండిగో ఎయిర్‌లైన్స్ ఎట్టకేలకు దిగొచ్చింది. ప్రయాణికుల నుంచి వస్తున్న తీవ్ర వ్యతిరేకతను తట్టుకోలేక 'డ్యామేజ్ కంట్రోల్' చర్యలు మొదలుపెట్టింది. డిసెంబర్…

5 hours ago

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు

బీఆర్ఎస్ పాలనలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న ఆరోపణల వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో…

5 hours ago