టీడీపీ అధినేత చంద్రబాబును స్కిల్ స్కామ్ కేసులో సీఐడీ కస్టడీకి అనుమతిస్తూ విజయవాడలోని ఏసీబీ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. తీవ్ర ఉత్కంఠకు తెరదించుతూ 2 రోజుల పాటు చంద్రబాబును విచారణ జరిపేందుకు సీఐడీ అధికారులకు అనుమతిచ్చింది. అయితే, రాజమండ్రి సెంట్రల్ జైలులోనే చంద్రబాబును రేపు, ఎల్లుండి ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ జరపాలని న్యాయమూర్తి తీర్పు వెల్లడించారు. అంతేకాదు, విచారణ పూర్తయిన తర్వాత చంద్రబాబును కోర్టులో హాజరుపరచాలని సీఐడీ అధికారులను ఆదేశించారు.
సీఐడీ మూడు రోజుల కస్టడీ కోరగా..2 రోజుల తీవ్ర ఉత్కంఠ తర్వాత 2 రోజుల పాటు కస్టడీకి అనుమతించింది. చంద్రబాబును ఎక్కడ విచారణ జరుపుతారని సీఐడీ తరపు న్యాయవాదులను న్యాయమూర్తి ప్రశ్నించారు. అయితే, రాజమండ్రి జైలులోనే విచారణ జరుపుతామని సీఐడీ అధికారులు చెప్పారు. దీంతో, ఇద్దరు న్యాయవాదుల సమక్షంలో విచారణ జరిపేందుకు కోర్టు అనుమతిచ్చింది. విచారణపై సీల్డ్ కవర్లో నివేదికలో ఇవ్వాలని సీఐడీ అధికారులను ఆదేశించింది. విచారణ అధికారుల జాబితా, విచారణకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు బయటకు రాకూడదని ఆదేశించింది.
మరోవైపు, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసులో కూడా చంద్రబాబును సీఐడీ కస్టడీకి ఇవ్వాలంటూ సీఐడీ అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
This post was last modified on September 22, 2023 4:08 pm
‘జాతిరత్నాలు’ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేశాడు యువ దర్శకుడు అనుదీప్. అందులో అతను పండించిన కొత్త రకం కామెడీకి ఈ…
ఎప్స్టీన్ ఫైల్స్.. ఇప్పుడు ప్రపంచాన్ని కుదిపేస్తున్న మాట. ఎప్స్టీన్ అనే అమెరికన్ వ్యాపారవేత్త.. తాను ఇచ్చే ప్రైవేట్ పార్టీలకు ఎంతోమంది…
తెలంగాణలో జరుగుతున్న మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు వీలుగా అధికార కాంగ్రెస్ పార్టీ కొన్ని కమిటీలను నియమించింది. మరో…
ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్పై.. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు భగ్గుమన్నారు. పవన్ కల్యాణ్ కాదు.. దిష్టి…
ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…
సినీ రంగంలోకి కాస్త పేరు తెచ్చుకున్న ఎవ్వరైనా.. మళ్లీ జన్మంటూ ఉంటే ఇలా పుట్టాలని కోరుకోను అన్నారంటే ఆశ్చర్యపోవాల్సిందే. ముఖ్యంగా…