Political News

అసెంబ్లీలో ఈల వేసి గోల చేసిన బాలకృష్ణ

ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కూడా వాడీవేడిగా సాగుతున్నాయి. మొదటి రోజు సభలో బాలకృష్ణ మీసం మెలేసి తొడ కొట్టడం… అంబటి రాంబాబుకు సవాల్ విసరడం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రెండో రోజు సభలో కూడా టీడీపీ సభ్యులు చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ప్లకార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే సభలో చంద్రబాబు సీటు పైకెక్కిన బాలకృష్ణ విజిల్ ఊదుతూ తన నిరసన వ్యక్తం చేయడం సంచలనం రేపింది.

చంద్రబాబు అరెస్టు తర్వాత మునుపెన్నడూ లేని విధంగా రాజకీయంగా బాలయ్య యాక్టివ్ అయిన సంగతి తెలిసిందే. అదే ఊపును అసెంబ్లీలో సైతం కొనసాగిస్తున్నారు. దూకుడుగా వ్యవహరిస్తూ అధికార పార్టీ సభ్యులకు జవాబిస్తున్నారు. ఇక, రెండో రోజు కూడా చంద్రబాబు అరెస్టుపై టీడీపీ సభ్యులు వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టగా తమ్మినేని దానిని తిరస్కరించారు. ఈ క్రమంలోనే పోడియాన్ని చుట్టుముట్టిన టిడిపి సభ్యులు ప్లకార్డులు పట్టుకొని తమ నిరసన వ్యక్తం చేశారు.

ఈ క్రమంలోనే స్పీకర్ 10 నిమిషాల పాటు సభను వాయిదా వేశారు. అయితే, సభ పున:ప్రారంభమైన తర్వాత కూడా గందరగోళం కొనసాగుతూనే ఉంది. వైసీపీ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్న సందర్భంగా టీడీపీ సభ్యులు నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. సైకో పాలన పోవాలి…చంద్రబాబును విడుదల చేయాలి అంటూ నినాదాలు చేశారు. దీంతో, టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినా వారు వినకుండా నినాదాలు చేయడంతో టిడిపి సభ్యులు అచ్చెన్నాయుడు, బెందాళం అశోక్ లను ఈ సెషన్ మొత్తానికి సస్పెండ్ చేస్తున్నట్టుగా స్పీకర్ ప్రకటించారు.

This post was last modified on September 22, 2023 11:14 am

Share
Show comments
Published by
satya
Tags: Feature

Recent Posts

సోనియ‌మ్మ‌.. సెంటిమెంటు రాహుల్‌ను కాపాడుతుందా?

రాజ‌కీయాల్లో సెంటిమెంటుకు ఛాన్స్ ఎక్కువ‌. ఉద్ధండ నాయ‌కుల నుంచి చ‌రిత్ర సొంతం చేసుకున్న పార్టీల వ‌ర‌క కూడా సెంటి మెంటుకు…

2 hours ago

“వైసీపీకి ప్ర‌తిప‌క్ష హోదా కూడా ద‌క్క‌క‌పోవ‌చ్చు”

వైసీపీ నాయ‌కులు స‌హా స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్నారెడ్డి క‌ళ్ల‌లో భ‌యం క‌నిపిస్తోంద‌ని ఆ పార్టీ రెబ‌ల్ ఎంపీ, ఉండి నుంచి…

9 hours ago

సీమ ఓట్ల హైజాక్‌.. ఎవ‌రికి మేలు?

రాయ‌లసీమ‌లో ఓట్ల హైజాక్ జ‌రిగిందా? వైసీపీకి ప‌డాల్సిన ఓట్లు.. కాంగ్రెస్‌కు ప‌డ్డాయా? అంటే.. ఔన‌నే అంటున్నారు కొంద‌రు రాజ‌కీయ విశ్లేష‌కులు.…

13 hours ago

చీటింగ్ కేసులో ఇరుక్కున్న కేఏ పాల్

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌పై చీటింగ్ కేసు నమోదయ్యింది. ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తానని చెప్పి తన వద్ద రూ.50…

14 hours ago

డ్రాగన్ టైటిల్ వెనుక ఊహించని మెలిక

జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఇంకా ప్రారంభం కాని ప్యాన్ ఇండియా మూవీకి డ్రాగన్ టైటిల్…

14 hours ago

కాస్త సౌండ్ పెంచు పురుషోత్తమా

యూత్ హీరో రాజ్ తరుణ్ కు మంచి హిట్టు దక్కి ఎంత కాలమయ్యిందో చెప్పడం కష్టం. సీనియర్ హీరోలతో సపోర్టింగ్…

16 hours ago