Political News

రాజధాని కాదు, సీఎం ఆఫీసు మాత్రమే తరలింపు !

దసరా పండుగ నుండి జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం మారబోతున్న విషయం తెలిసిందే. రాబోయే దసరా పండుగను తాను వైజాగ్ లోనే చేసుకోబోతున్నట్లు స్వయంగా జగనే మంత్రివర్గ సహచరులతో చెప్పారు. ఇదే విషయమై మంత్రి అమర్నాధ్ మాట్లాడుతూ అక్టోబర్ 23వ తేదీనుండి జగన్ వైజాగ్ లోనే ఉంటారని ప్రకటించారు. స్వయంగా తాను వైజాగ్ కు మారబోతున్నట్లు జగనే ప్రకటించారు కాబట్టి ఉన్నతాధికారులు కూడా ఈ దిశగా పనుల్లో స్పీడు పెంచారు.

ముఖ్యమంత్రి కార్యాలయం, క్యాంపు కార్యాలయం, మంత్రులు, ఉన్నతాధికారుల కార్యాలయాలు, నివాసాలు, అవసరమైన సిబ్బంది క్వార్టర్స్ తదితరాల ఏర్పాట్లలో చాలా బిజీగా ఉన్నారు. ఈ నేపధ్యంలోనే ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం వారంలో రెండు రోజులు జగన్ వైజాగ్ లో ఉండబోతున్నట్లు తెలిసింది. అదికూడా గురు, శుక్ర వారాల్లో విశాఖపట్నంలో ఉంటారని మిగిలిన రోజుల్లో అమరావతితో పాటు ఇతర ప్రాంతాల్లో పర్యటనలు చేయబోతున్నట్లు సమాచారం.

జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానుల కాన్సెప్టుకు టెక్నికల్ గా న్యాయస్థానం నుంచి అడ్డంకులు ఎదురయ్యాయి. మూడు రాజధానులకు వ్యతిరేకంగా హైకోర్టులో ను తర్వాత సుప్రింకోర్టులోను చాలా కేసులున్నాయి. వీటి విచారణ కూడా నత్తనడక నడుస్తున్నాయి. దాంతో రాబోయే ఎన్నికల్లోపు తన ఆపీసును వైజాగ్ కు తీసుకెళ్ళిపోవాలని జగన్ డిసైడ్ అయ్యారు. మూడు రాజధానులు అంటే సాంకేతిక కారణాలు అడ్డువస్తాయి. అదే ముఖ్యమంత్రి క్యాంపు ఆఫీసంటే ఏ టెక్నికల్ సమస్యా అడ్డురాదు. ఎందుకంటే ముఖ్యమంత్రిగా జగన్ ఎక్కడినుండైనా పరిపాలన చేయవచ్చు.

ముఖ్యమంత్రి హోదాలో పలానా చోటే కూర్చోవాలని ఏ కోర్టు కూడా చెప్పలేదు. అందుకనే ముందుగా తాను వైజాగ్ కి మారిపోతే తర్వాత విషయాలను తర్వాత చూసుకోవచ్చని జగన్ అనుకున్నట్లున్నారు. జగన్ ఎక్కడుంటే అదే రాజధాని అన్నట్లుగా వైసీపీ కలరింగ్ ఇస్తోంది. కాబట్టి అనధికారికంగా విశాఖపట్నమే రాజధాని అన్న ప్రచారం పెరిగిపోతోంది. వచ్చేఎన్నికల్లోగా వైజాగ్ ను రాజధాని అని అనిపించుకోవాలన్నది జగన్ ఉద్దేశ్యం. అందుకు తగ్గట్లే అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరి ముహూర్తం నాటికి ఏమవుతుందో చూడాలి.

This post was last modified on September 22, 2023 10:36 am

Share

Recent Posts

చిన్న శ్రీను శాంపిల్ మాత్ర‌మే.. మ‌రింత మంది సైకిల్ ఎక్కేస్తారా?

వైసీపీకి డేంజ‌ర్ బెల్స్ మోగుతున్నాయా.. ఉత్త‌రాంధ్రలో తాజాగా చోటు చేసుకున్న చిన్న శ్రీను వ్య‌వ‌హారంతో పాటు.. పార్టీలో మ‌రింత మంది…

42 minutes ago

ఏఐ వాడకం… ముంచుకొస్తున్న ప్రమాదం

జాంబీ సినిమాలో వైరస్ లాగా ఏఐ వాడకం క్రమంగా టెకీస్ నుంచి సామాన్యుల చేతుల్లోకి వెళ్ళిపోతోంది. ఒకరేమో వారణాసిలో మహేష్…

53 minutes ago

డిజాస్టర్ తాత సినిమాకు సీక్వెల్ వస్తోందా

లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…

5 hours ago

అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల…

5 hours ago

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

6 hours ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

6 hours ago