Political News

నాతోపాటు ఇండస్ట్రీ మొత్తాన్ని వైసీపీ అవమానించింది: బాలకృష్ణ

ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సభలో మంత్రి అంబటి రాంబాబు వర్సెస్ హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అన్న రీతిలో మాటల యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అంబటిని ఉద్దేశించి మీసం మెలేసిన బాలకృష్ణ తొడగొట్టి మరీ సవాల్ చేశారు. దీంతో, బాలయ్యను స్పీకర్ తమ్మినేని మందలించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా సభ నుంచి సస్పెండ్ అయిన తర్వాత బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబుపై బాలయ్య బాబు సంచలన విమర్శలు చేశారు. అంబటి రాంబాబు సభలో ముందు తనను రెచ్చగొట్టారని బాలకృష్ణ ఆరోపించారు. మీసం మెలేసి తొడ గొట్టారని, తన వృత్తిని అంబటి అవమానించాడని అన్నారు.

అసెంబ్లీలో మీసం మెలేసి తొడగొట్టింది వైసీపీ ఎమ్మెల్యేలే అని, తాను చేయని పనిని చేసినట్లుగా అసత్యాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. స్పీకర్ చేత కూడా అబద్ధాలు చెప్పించారని, మంద బలంతో విర్రవీగుతున్న వైసీపీ ఎమ్మెల్యేలు ప్రజల చేతిలో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఈరోజు సభలో తనకు మాత్రమే అవమానం జరగలేదని, యావత్ తెలుగు చిత్ర పరిశ్రమను వైసీపీ నేతలు కించపరిచారని ఆరోపించారు. తెలుగు సినీ కళాకారులను వైసీపీ ఎమ్మెల్యేలు అవమానించారని ఆరోపించారు. సినీ రంగం నుంచి అసెంబ్లీకి వెళ్లిన అన్నగారు ఎందరికో రాజకీయ భిక్ష పెట్టారన్న విషయం గుర్తుంచుకోవాలని అన్నారు.

రా చూసుకుందాం అని అంబటి అనడంతో తాను కూడా రా చూసుకుందాం అని అన్నానని చెప్పుకొచ్చారు. ఇండస్ట్రీలో తనలా ధైర్యంగా మాట్లాడేవారు కొందరే ఉంటారని, తాను మిగతా వారిలాగా మౌనంగా ఉంటానని అంబటి అనుకున్నారని, కానీ తాను ధైర్యంగా ముందుకు వచ్చేసరికి బిత్తర పోయారని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా జగన్ పై బాలయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు జగన్ మైండ్ గేమ్ ఆడుతున్నాడని, ఇలాంటివి టిడిపి ఎన్నో చూసిందని బాలకృష్ణ చెప్పారు. వైజాగ్ లో జూనియర్ ఆర్టిస్టులతో ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుందని ఎద్దేవా చేశారు. చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసును ఉపసంహరించుకోవాలని శాసనసభలో స్పీకర్ కు విజ్ఞప్తి చేశామని, చంద్రబాబుకు క్షమాపణలు చెప్పాలని కోరామని అన్నారు.

రోమ్ తగలబడుతుంటే చక్రవర్తి ఫిడేల్ వాయించుకున్నట్టుగా జగన్ తీరు ఉందని సెటైర్లు వేశారు. స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారంలో నిజంగా స్కామ్ జరిగి ఉంటే చార్జిషీట్ ఎందుకు దాఖలు చేయలేదని బాలయ్య ప్రశ్నించారు. జగన్ తీరేంటో ఎవరికి అర్థం కావడం లేదని, కక్ష సాధింపు చర్య తప్ప రాష్ట్ర అభివృద్ధి గురించి జగన్ పట్టించుకోవడంలేదని బాలకృష్ణ విమర్శించారు.

This post was last modified on September 21, 2023 9:47 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

1 hour ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

2 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

2 hours ago

కాసేపు క్లాస్ రూములో విద్యార్థులుగా మారిన చంద్రబాబు, లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…

2 hours ago

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

4 hours ago

రష్యా vs ఉక్రెయిన్ – ఇండియా ఎవరివైపో చెప్పిన మోడీ

ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…

4 hours ago