రాష్ట్ర ప్రభుత్వంపై సీబీఐకి ఫిర్యాదు చేస్తానని బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ దగ్గుబాటి పురందేశ్వరి చెప్పారు. రాష్ట్రంలో భారీ ఎత్తున మద్యం కుంభకోణం జరుగుతోందని ఆమె ఆరోపించారు. ఆమె లెక్కల ప్రకారం ఏడాదికి సుమారు రు. 36,750 కోట్లు అవినీతి జరుగుతోందట. విషయం ఏమిటంటే మద్యం ద్వారా ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం రు. 20 వేల కోట్లు వస్తోందట. అయితే వాస్తవంగా జరుగుతున్న అమ్మకాలు రూ. 56,750 కోట్లట.
రు. 56,750 కోట్ల అమ్మకాల్లో ప్రభుత్వానికి అందుతున్నది రు. 20 వేల కోట్లే అయితే మరి మిగిలిన రు. 36,750 కోట్లు ఎటు పోతున్నాయన్నది ఆమె ప్రశ్న. జవాబు కూడా ఆమే చెప్పేశారు. అన్ని వేల కోట్లరూపాయలు అధికారపార్టీ నేతల జేబుల్లోకి వెళుతున్నట్లుగా పురందేశ్వరి తేల్చేశారు. రు. 36,750 కోట్ల మేర మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని, అందులో రు. 20 వేల కోట్లే ప్రభుత్వానికి అందుతున్నాయని ఆమెకు ఎవరు చెప్పారో తెలీదు. మిగిలిన రు. 36,750 కోట్లు అధికార పార్టీ నేతల జేబుల్లోకి వెళుతున్నదని ఆమె దగ్గర ఉన్న సమాచారం, దానికి ఆధారం ఏమిటో కూడా తెలీదు.
మొత్తానికి వేల కోట్ల రూపాయలకు సరిపడా లెక్కలు చెప్పేశారు. అలా అవినీతి జరుగుతున్న వేల కోట్ల రూపాయల పైనే తాను తొందరలోనే సీబీఐని కలిసి ఫిర్యాదులు చేయబోతున్నట్లు చెప్పారు. ఇదే కాదు టిడ్కో ఇళ్ళ పథకంలో కూడా భారీ అవినీతి జరుగుతోందని పురందేశ్వరి పదేపదే ఆరోపిస్తున్నారు. ఇలాంటి అవినీతి చిట్టాను సేకరించి సీబీఐకి ఫిర్యాదులు చేయబోతున్నట్లు చెప్పారు.
బాక్సాఫీస్ యమా నీరసంగా ఉంది. సరైన కొత్త సినిమాలు లేక చాలా థియేటర్లలో సగం షోలు కూడా పడటం లేదు.…
ప్రస్తుతం వైసీపీకి ఉన్న 11 నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల నాటికి 4 నియోజకవర్గాలు చేజారి పోవడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు.…
బాలకృష్ణ - కొరటాల శివ కాంబినేషన్ సినిమా ఫిక్సయిపోయింది. వచ్చే వారమే పూజా కార్యక్రమాలతో ఓపెనింగ్ జరగనుందని సమాచారం. అయితే…
వైసీపీ అధినేత జగన్ శుక్రవారం నుంచి యూరప్ పర్యటనకు వెళ్తున్నారు. దాదాపు 20 రోజులకు పైగానే ఆయన రాష్ట్రానికి దూరంగా…
తెలంగాణలో రెండు రోజుల క్రితం మొదలైన ఆర్టీసీ కార్మికుల సమ్మె అప్పుడే రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన…
బాలకృష్ణ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు అత్యంత భారీ బడ్జెట్ తో తీసిన సినిమా నిప్పురవ్వ. దానికైన ఖర్చు గురించి…