రాష్ట్ర ప్రభుత్వంపై సీబీఐకి ఫిర్యాదు చేస్తానని బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ దగ్గుబాటి పురందేశ్వరి చెప్పారు. రాష్ట్రంలో భారీ ఎత్తున మద్యం కుంభకోణం జరుగుతోందని ఆమె ఆరోపించారు. ఆమె లెక్కల ప్రకారం ఏడాదికి సుమారు రు. 36,750 కోట్లు అవినీతి జరుగుతోందట. విషయం ఏమిటంటే మద్యం ద్వారా ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం రు. 20 వేల కోట్లు వస్తోందట. అయితే వాస్తవంగా జరుగుతున్న అమ్మకాలు రూ. 56,750 కోట్లట.
రు. 56,750 కోట్ల అమ్మకాల్లో ప్రభుత్వానికి అందుతున్నది రు. 20 వేల కోట్లే అయితే మరి మిగిలిన రు. 36,750 కోట్లు ఎటు పోతున్నాయన్నది ఆమె ప్రశ్న. జవాబు కూడా ఆమే చెప్పేశారు. అన్ని వేల కోట్లరూపాయలు అధికారపార్టీ నేతల జేబుల్లోకి వెళుతున్నట్లుగా పురందేశ్వరి తేల్చేశారు. రు. 36,750 కోట్ల మేర మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని, అందులో రు. 20 వేల కోట్లే ప్రభుత్వానికి అందుతున్నాయని ఆమెకు ఎవరు చెప్పారో తెలీదు. మిగిలిన రు. 36,750 కోట్లు అధికార పార్టీ నేతల జేబుల్లోకి వెళుతున్నదని ఆమె దగ్గర ఉన్న సమాచారం, దానికి ఆధారం ఏమిటో కూడా తెలీదు.
మొత్తానికి వేల కోట్ల రూపాయలకు సరిపడా లెక్కలు చెప్పేశారు. అలా అవినీతి జరుగుతున్న వేల కోట్ల రూపాయల పైనే తాను తొందరలోనే సీబీఐని కలిసి ఫిర్యాదులు చేయబోతున్నట్లు చెప్పారు. ఇదే కాదు టిడ్కో ఇళ్ళ పథకంలో కూడా భారీ అవినీతి జరుగుతోందని పురందేశ్వరి పదేపదే ఆరోపిస్తున్నారు. ఇలాంటి అవినీతి చిట్టాను సేకరించి సీబీఐకి ఫిర్యాదులు చేయబోతున్నట్లు చెప్పారు.
తెలుగుదేశం పార్టీ ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 'కాఫీ కబుర్లు' పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం కార్యకర్తల్లో…
ఆంధ్రకింగ్ తాలూకా ఫైనల్ రన్ అయిపోయింది. పాజిటివ్ రివ్యూలు, బాగుందని చెప్పిన పబ్లిక్ టాక్స్ ఇవేవి పట్టుమని మూడు వారాల…
నిన్న జరిగిన మోగ్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విలన్ గా నటించిన బండి సరోజ్ కుమార్ సెన్సార్ బోర్డుని…
టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల జీతాల్లో కోత పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏటా ఆటగాళ్లకు…
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తో పాటు ప్రముఖ సినీ నటులు నాగార్జున, సమంత, నాగ చైతన్యలపై…
జైల్లో ఉన్న కన్నడ స్టార్ హీరో దర్శన్ కొత్త సినిమా డెవిల్ ఇవాళ భారీ హడావిడి మధ్య కర్ణాటకలో విడుదలయ్యింది.…