రాష్ట్ర ప్రభుత్వంపై సీబీఐకి ఫిర్యాదు చేస్తానని బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ దగ్గుబాటి పురందేశ్వరి చెప్పారు. రాష్ట్రంలో భారీ ఎత్తున మద్యం కుంభకోణం జరుగుతోందని ఆమె ఆరోపించారు. ఆమె లెక్కల ప్రకారం ఏడాదికి సుమారు రు. 36,750 కోట్లు అవినీతి జరుగుతోందట. విషయం ఏమిటంటే మద్యం ద్వారా ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం రు. 20 వేల కోట్లు వస్తోందట. అయితే వాస్తవంగా జరుగుతున్న అమ్మకాలు రూ. 56,750 కోట్లట.
రు. 56,750 కోట్ల అమ్మకాల్లో ప్రభుత్వానికి అందుతున్నది రు. 20 వేల కోట్లే అయితే మరి మిగిలిన రు. 36,750 కోట్లు ఎటు పోతున్నాయన్నది ఆమె ప్రశ్న. జవాబు కూడా ఆమే చెప్పేశారు. అన్ని వేల కోట్లరూపాయలు అధికారపార్టీ నేతల జేబుల్లోకి వెళుతున్నట్లుగా పురందేశ్వరి తేల్చేశారు. రు. 36,750 కోట్ల మేర మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని, అందులో రు. 20 వేల కోట్లే ప్రభుత్వానికి అందుతున్నాయని ఆమెకు ఎవరు చెప్పారో తెలీదు. మిగిలిన రు. 36,750 కోట్లు అధికార పార్టీ నేతల జేబుల్లోకి వెళుతున్నదని ఆమె దగ్గర ఉన్న సమాచారం, దానికి ఆధారం ఏమిటో కూడా తెలీదు.
మొత్తానికి వేల కోట్ల రూపాయలకు సరిపడా లెక్కలు చెప్పేశారు. అలా అవినీతి జరుగుతున్న వేల కోట్ల రూపాయల పైనే తాను తొందరలోనే సీబీఐని కలిసి ఫిర్యాదులు చేయబోతున్నట్లు చెప్పారు. ఇదే కాదు టిడ్కో ఇళ్ళ పథకంలో కూడా భారీ అవినీతి జరుగుతోందని పురందేశ్వరి పదేపదే ఆరోపిస్తున్నారు. ఇలాంటి అవినీతి చిట్టాను సేకరించి సీబీఐకి ఫిర్యాదులు చేయబోతున్నట్లు చెప్పారు.
అవకాశాలు.. అదృష్టాలు.. పదే పదే రావని అంటారు. అవి వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకునేందుకు వ్యక్తులైనా పార్టీలైనా.. ఎవరైనా సరే..…
ఐపీఎల్ 2026 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు అస్సలు కలిసి రావడం లేదు. వరుసగా రెండో ఓటమిని…
ఎన్నికలు సమీపిస్తున్నపుడు కొందరు రాజకీయ నాయకులకు ఎలివేషన్లు ఇస్తూ సినిమాలు వస్తుంటాయి. అలాగే కొందరు నేతలను టార్గెట్ చేస్తూ మూవీస్…
ఏపీ రాజధాని అమరావతిపై సీఎం చంద్రబాబుకు ఉన్న ముందుచూపు, తాజాగా రాజధాని బిల్లును ఆమోదించిన విధానం.. వంటివి చర్చకు వస్తున్నాయి.…
ఏప్రిల్ 8 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా రేసు గుర్రం రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.…
కేరళ రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫు స్టార్ క్యాంపెయినర్గా వ్యవహరిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి..…