తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది? పార్టీలో చీలిక రాబోతుందా? కీలక నేతలు ఆ పార్టీ వీడేందుకు సిద్ధమయ్యారా? అంటే రాజకీయ విశ్లేషకుల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. తాజాగా ఏడెనిమిది మంది తెలంగాణ బీజేపీ కీలక నాయకులు ఓ నేత ఇంట్లో రహస్య భేటీ కావడం సంచలనంగా మారింది. ఈ నాయకులు బీజేపీని వీడే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం చర్చనీయాంశంగా మారింది. మాజీ ఎంపీ వివేక్ ఇంట్లో మాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వరరెడ్డి, విజయ శాంతి, రవీంద్ర నాయక్, మాజీ ఎమ్మెల్యేలు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి, సీనియర్ నేతలు గరికపాటి రామ్మోహన రావు తదితరులు హైదరాబాద్ లో సీక్రెట్ మీటింగ్ పెట్టుకున్నట్లు తెలిసింది.
ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల రేసులో బీజేపీ వెనుకబడింది. అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్ ఢీ అంటే ఢీ అన్నట్లు తలపడుతున్నాయి. కానీ బీజేపీ మాత్రం దూరంలో ఆగిపోతోందనే అభిప్రాయాలున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆ పార్టీలోని కీలక నేతల రహస్య సమావేశం చర్చకు దారి తీసిందనే చెప్పాలి. పార్టీలో ప్రాధాన్యత దక్కడం లేదని, తమను అధిష్ఠానం పట్టించుకోవడం లేదని ఈ నాయకులు అసంత్రుప్తి వ్యక్తం చేశారని తెలిసింది. అధిష్ఠానం తమను గుర్తించడం లేదని ఆవేదన చెందుతున్నారని సమాచారం.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం పార్టీలో పరిణామాలు, భవిష్యత్ పై ఈ నేతలు రహస్య భేటీలో చర్చించినట్లు తెలిసింది. విజయ శాంతి ఇప్పటికే బీజేపీకి దూరం దూరంగా ఉంటున్నారు. ఇటీవల సోనియా గాంధీ అంటే గౌరవం అంటూ రాములమ్మ ట్వీట్ చేశారు. మరోవైపు రాజగోపాల్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డికి కూడా పార్టీలో ఆశాజనక పరిస్థితులు కనిపించడం లేదని తెలిసింది. వచ్చే ఎన్నికల్లో వీళ్లకు టికెట్లు వస్తాయి కానీ బీజేపీ తరపున గెలిచే పరిస్థితే లేదని ఈ నాయకులు అనుకుంటున్నారని సమాచారం. అందుకే బీజేపీ వదిలి కాంగ్రెస్ వైపు వెళ్లేందుకు చూస్తున్నారని టాక్. ఇప్పటికే వివేక్ కాంగ్రెస్ అధిష్ఠానంతో చర్చించారని, త్వరలోనే ఆయన కాంగ్రెస్ గూటికి వెళ్తారనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ నాయకులంగా కాంగ్రెస్లో చేరితే మాత్రం రాష్ట్రంలో బీజేపీకి కోలుకోలేని దెబ్బ తగులుతుందనే చెప్పాలి.
This post was last modified on September 20, 2023 3:22 pm
టీడీపీలో నాయకులు.. చంద్రబాబు కనుసన్నల్లోనే మెలుగుతున్నారా? ఆయన చెప్పినట్టే చేస్తున్నారా? అంటే.. మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా…
అవకాశాలు.. అదృష్టాలు.. పదే పదే రావని అంటారు. అవి వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకునేందుకు వ్యక్తులైనా పార్టీలైనా.. ఎవరైనా సరే..…
ఐపీఎల్ 2026 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు అస్సలు కలిసి రావడం లేదు. వరుసగా రెండో ఓటమిని…
ఎన్నికలు సమీపిస్తున్నపుడు కొందరు రాజకీయ నాయకులకు ఎలివేషన్లు ఇస్తూ సినిమాలు వస్తుంటాయి. అలాగే కొందరు నేతలను టార్గెట్ చేస్తూ మూవీస్…
ఏపీ రాజధాని అమరావతిపై సీఎం చంద్రబాబుకు ఉన్న ముందుచూపు, తాజాగా రాజధాని బిల్లును ఆమోదించిన విధానం.. వంటివి చర్చకు వస్తున్నాయి.…
ఏప్రిల్ 8 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా రేసు గుర్రం రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.…