టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టుపై పార్టీ ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తోంది. అటు ఏపీతో పాటు ఇటు తెలంగాణలోనూ నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ప్రజలను ఈ ఆందోళనల్లో భాగం చేయడంలో టీడీపీ నిమగ్నమైంది. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారనే విషయాన్ని జనాల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. బాబు అరెస్టును వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయం కోసం అనుకూలంగా మలుచుకోవాలనే ప్రయత్నాలను టీడీపీ చేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ దిశగా పార్టీ సరైన మార్గంలోనే సాగుతుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇప్పుడీ ఉద్యమాన్ని మరో స్థాయికి తీసుకెళ్లేందుకు టీడీపీ సంచలన నిర్ణయం తీసుకుందనే ప్రచారం జోరుగా సాగుతోంది.
తమ పార్టీ అధినేత చంద్రబాబుపై సీఎం జగన్ రాజకీయ కుట్రకు వ్యతిరేకంగా తమ పదవులకు రాజీనామా చేయాలని టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు నిర్ణయించారని సమాచారం. ప్రస్తుతం టీడీపీకి 19 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలున్నారు. వీళ్లంతా మూకుమ్మడి రాజీనామాలు చేసి జాతీయ స్థాయిలో చంద్రబాబు అరెస్టును హాట్ టాపిక్గా మార్చాలనే ప్రయత్నంలో ఉన్నారని తెలిసింది. జగన్ అక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు, ఆయనకు అడ్డుకట్ట వేసేందుకు రాజీనామాలు సరైన అస్ర్తమని టీడీపీ భావిస్తోందని టాక్.
ఏపీలో రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. ఈ సమావేశాల్లోనే ఉమ్మడిగా రాజీనామా చేయాలని ఎమ్మెల్యేలు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. మరోవైపు ఎంపీలు కూడా సరైన సమయం చూసుకుని రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నారని టాక్. తమ రాజీనామాల ద్వారా చంద్రబాబు అక్రమ అరెస్టు విషయాన్ని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లేందుకు టీడీపీ నేతలు రెడీగా ఉన్నారని తెలిసింది. అయితే అసెంబ్లీ తొలి రోజే ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తారా? అన్నదానిపై స్పష్టత లేదు. లేకపోతే రెండు మూడు రోజులు బాబు అరెస్టుపై చర్చకు పట్టుబట్టి అనంతరం రాజీనామా చేస్తారా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. మరి టీడీపీ ఎమ్మెల్యేలు ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on September 20, 2023 1:26 pm
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…