Political News

సీఎం జ‌గ‌న్‌కు సీపీఎస్ గండం.. 30 ల‌క్ష‌ల ఓట్లు ఎటువైపు?

ఒక‌టి కాదు రెండు కాదు.. ఏకంగా 30 ల‌క్ష‌ల ఓట్లు. ఒక పార్టీ అధికారంలోకి రావాలా.. వ‌ద్దా.. అని నిర్ణ‌యించే ఓటు బ్యాంకు. అధికారం చేప‌ట్టాల‌ని భావించే పార్టీకి ప్రాణ ప్ర‌ద‌మైన ఓటుబ్యాంకు.. ఇప్పుడు ఇదే ఓటు బ్యాంకు వైసీపీని వీడుతోంద‌నే చ‌ర్చ ఏపీలో జోరుగా సాగుతోంది. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌భుత్వ ఉద్యోగుల‌(2004 త‌ర్వాత నియామ‌కం పొందిన‌) కంట్రిబ్యూట‌రీ పింఛ‌న్ స్కీం(సీపీఎస్‌)ను ర‌ద్దు చేస్తామ‌ని వైసీపీ అధినేత‌గా జ‌గ‌న్ హామీ ఇచ్చారు.

దీంతో సీపీఎస్ ఉద్యోగుల కుటుంబాలు.. పూర్తిగా వైసీపీకి అనుకూలంగా మారాయి. ఫ‌లితంగా 30 ల‌క్ష‌ల ఓట్లుగా ఉన్న సీపీఎస్ కుటుంబాల ఓటు బ్యాంకు పూర్తిగా వైసీపీ ఖాతాలోకి చేరింది. సీపీఎస్‌ను వారంలోనే ర‌ద్దు చేస్తామ‌ని చెప్పిన సీఎం జ‌గ‌న్‌ను వారు విశ్వ‌సించారు. కానీ, నాలుగున్న‌రేళ్లు అయినా.. సీపీఎస్‌ను ర‌ద్దు చేయ‌క‌పోగా.. అప్ప‌ట్లో దీని గురించి తెలియ‌ద‌ని అందుకే జ‌గ‌న్ హామీ ఇచ్చార‌ని.. స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి మంగ‌ళం పాడేశారు.

క‌ట్ చేస్తే.. ఇప్పుడు ఇదేసీపీఎస్ ఉద్యోగుల కుటుంబాలు.. ఈ నెల 25న విజ‌య‌వాడ‌లో మ‌హాధ‌ర్నాకు పిలుపునిచ్చాయి. ఉద్యోగుల‌కు జ‌గ‌న్ ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేయ‌క‌పోగా..సీపీఎస్ విష‌యంలో మ‌డ‌మ తిప్పార‌ని.. ఉద్యోగ కుటుంబాల‌కు చెందిన మ‌హిళా జేఏసీ(ఉద్యోగుల స‌తీమ‌ణులు) వ్యాఖ్యానించింది. అంతేకాదు.. ఈ నెల 25లోగా జ‌రిగే అసెంబ్లీలో సీపీఎస్‌ను ర‌ద్దు చేస్తూ.. తీర్మానం చేయాల‌ని డిమాండ్ చేసింది. లేనిప‌క్షంలో 25న మ‌హాధ‌ర్నా ఉంటుంద‌ని హెచ్చ‌రించింది.

అంతేకాదు.. త‌మ కుటుంబాల‌కు మొత్తం 30 ల‌క్ష‌ల ఓటు బ్యాంకు ఉంద‌ని, గ‌త ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ ఇచ్చిన హామీని న‌మ్మి ఆయ‌న‌కు అనుకూలంగా ఓటు వేశామ‌ని.. ఇప్పుడు ఆయ‌న మాట నిల‌బెట్టుకోక‌పోతే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీని దూరం పెడ‌తామ‌ని.. ఒక్క ఓటు కూడా ప‌డ‌బోద‌ని మ‌హిళా జేఏసీ హెచ్చ‌రించ‌డం ఇప్పుడు ప్రాధాన్యం సంత‌రించుకుంది. ఈ ప‌రిణామం.. వైసీపీని ఇబ్బందుల్లోకి నెట్ట‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. నిజంగానే 30 ల‌క్ష‌ల ఓటు బ్యాంకులో సగంపోయినా.. వైసీపీ అధికారంలోకి రావ‌డం క‌ష్ట‌మ‌నే లెక్క‌లు అప్పుడే తెర‌మీదికి వ‌స్తున్నాయి. మ‌రి వైసీపీ ఏం చేస్తుందో చూడాలి.

This post was last modified on September 20, 2023 11:26 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

విదేశీ యూనివ‌ర్సిటీల డాక్టరేట్లు వదులుకున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక `ఎక‌న‌మిక్ టైమ్స్‌`.. ప్ర‌తిష్టాత్మ‌క వ్యాపార సంస్క‌ర్త‌-2025 పుర‌స్కారానికి ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే.…

6 minutes ago

బంగ్లా విషయంలో భారత్ భద్రంగా ఉండాల్సిందేనా?

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…

46 minutes ago

ఆమెకు ‘ఏఐ’ మొగుడు

ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…

58 minutes ago

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు.…

2 hours ago

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

4 hours ago

దమ్ముంటే నన్ను జైలుకు పంపు: జగన్ కు బీజేపీ మంత్రి సవాల్

మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…

4 hours ago