Political News

మూడో కేసు…చంద్రబాబుకు బెయిల్ కష్టమేనా?

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు సంబంధించిన పలు పిటిషన్లపై ఈ రోజు హైకోర్టులో జరిగిన విచారణలో ఊరట లభించని సంగతి తెలిసిందే. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ వస్తుందని ఆయన తరఫు లాయర్లు ఆశించగా…ఆ విచారణ ఈ నెల 21కి వాయిదా పడింది.

ఇక, చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై విచారణ పూర్తయినా తీర్పు, ఉత్తర్వులు రెండ్రోజుల తర్వాత వెల్లడిస్తామని కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ క్రమంలో తీవ్ర నిరాశలో కూరుకుపోయిన చంద్రబాబు, టీడీపీ శ్రేణులకు ఏపీ సీఐడీ మరో షాకిచ్చింది. ఫైబర్ నెట్ స్కాం కేసులో చంద్రబాబుపై పీటీ వారెంట్ ను విజయవాడ ఏసీబీ కోర్టులో ఏపీ సీఐడీ దాఖలు చేసింది.

ఫైబర్ నెట్ స్కాంలో చంద్రబాబును ప్రధాన ముద్దాయిగా పేర్కొంటూ పిటీషన్ ను దాఖలు చేశారు. దీంతో, ఆ పీటీ వారెంట్ ను ఏసీబీ కోర్టు విచారణకు స్వీకరించడంతో చంద్రబాబుకు మరో షాక్ తగిలినట్లయింది. ఫైబర్ నెట్ స్కాంలో రూ.121 కోట్లు దారిమళ్లాయని సీఐడీ పేర్కొంది.

గతంలో ఈ వ్యవహారంపై సిట్ దర్యాప్తు చేసిందని, 2021లోనే 19 మందిపై కేసు నమోదైందని వెల్లడించింది. టెర్రా సాఫ్ట్ కు అక్రమంగా టెండర్ కట్టబెట్టారని ఆరోపించింది. ఈ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాత్ర కూడా ఉందని గతంలో సీఐడీ అధికారులు పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆ ఎఫ్ఐఆర్‌లో ఏ1గా వేమూరి హరిప్రసాద్, ఏ2గా మాజీ ఎండీ సాంబశివరావు ఉన్నారు.

ఇక, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో చంద్రబాబు అరెస్టయి రాజమండ్రి జైల్లో జ్యుడిషియల్ రిమాండ్ పై ఉన్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే చంద్రబాబుపై అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసులో పీటీ వారెంట్ దాఖలైంది. ఇపుడు తాజాగా ఫైబర్ నెట్ స్కాంలో కూడా పీటీ వారెంట్ జారీ కావడం, ఏసీబీ కోర్టు విచారణకు స్వీకరించడం సంచలనం రేపింది. ఈ మూడు వ్యవహారాలతో పాటు చంద్రబాబుపై మరిన్ని కేసులు పెట్టేందుకు సీఐడీ అధికారులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

This post was last modified on September 20, 2023 6:33 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

దేవర 2 భవిష్యత్తు ఏంటి

బాలకృష్ణ - కొరటాల శివ కాంబినేషన్ సినిమా ఫిక్సయిపోయింది. వచ్చే వారమే పూజా కార్యక్రమాలతో ఓపెనింగ్ జరగనుందని సమాచారం. అయితే…

5 hours ago

వైసీపీలో వ‌రుస అరెస్టులు.. అంతా రెడీనా?

వైసీపీ అధినేత జ‌గ‌న్ శుక్ర‌వారం నుంచి యూర‌ప్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్తున్నారు. దాదాపు 20 రోజుల‌కు పైగానే ఆయ‌న రాష్ట్రానికి దూరంగా…

5 hours ago

కేసీఆర్ చేసిన తప్పే రేవంత్ చేస్తున్నారా?

తెలంగాణలో రెండు రోజుల క్రితం మొదలైన ఆర్టీసీ కార్మికుల సమ్మె అప్పుడే రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన…

5 hours ago

నిప్పురవ్వతో ఉస్తాద్ పోలిక చాలా బాగుంది

బాలకృష్ణ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు అత్యంత భారీ బడ్జెట్ తో తీసిన సినిమా నిప్పురవ్వ. దానికైన ఖర్చు గురించి…

7 hours ago

‘చెడు’ చూపించకుంటే ‘మంచి’ బయోపిక్ ఎలా?

70, 80, 90 దశకాల్లో ప్రపంచ వ్యాప్తంగా సంగీత ప్రియులను ఒక ఊపు ఊపిన లెజెండరీ మ్యుజీషియన్ మైకేల్ జాక్సన్…

7 hours ago

ప్రేమ కావాలంటే డార్లింగ్ జోరు తగ్గాలి

కొత్త సినిమాల సంగతేమో కానీ తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు డార్లింగ్ వర్షంలో తడిసిపోతున్నారు. ఇవాళ ఏపీ తెలంగాణ వ్యాప్తంగా దీనికొచ్చిన…

7 hours ago