టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు సంబంధించిన పలు పిటిషన్లపై ఈ రోజు హైకోర్టులో జరిగిన విచారణలో ఊరట లభించని సంగతి తెలిసిందే. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ వస్తుందని ఆయన తరఫు లాయర్లు ఆశించగా…ఆ విచారణ ఈ నెల 21కి వాయిదా పడింది.
ఇక, చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై విచారణ పూర్తయినా తీర్పు, ఉత్తర్వులు రెండ్రోజుల తర్వాత వెల్లడిస్తామని కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ క్రమంలో తీవ్ర నిరాశలో కూరుకుపోయిన చంద్రబాబు, టీడీపీ శ్రేణులకు ఏపీ సీఐడీ మరో షాకిచ్చింది. ఫైబర్ నెట్ స్కాం కేసులో చంద్రబాబుపై పీటీ వారెంట్ ను విజయవాడ ఏసీబీ కోర్టులో ఏపీ సీఐడీ దాఖలు చేసింది.
ఫైబర్ నెట్ స్కాంలో చంద్రబాబును ప్రధాన ముద్దాయిగా పేర్కొంటూ పిటీషన్ ను దాఖలు చేశారు. దీంతో, ఆ పీటీ వారెంట్ ను ఏసీబీ కోర్టు విచారణకు స్వీకరించడంతో చంద్రబాబుకు మరో షాక్ తగిలినట్లయింది. ఫైబర్ నెట్ స్కాంలో రూ.121 కోట్లు దారిమళ్లాయని సీఐడీ పేర్కొంది.
గతంలో ఈ వ్యవహారంపై సిట్ దర్యాప్తు చేసిందని, 2021లోనే 19 మందిపై కేసు నమోదైందని వెల్లడించింది. టెర్రా సాఫ్ట్ కు అక్రమంగా టెండర్ కట్టబెట్టారని ఆరోపించింది. ఈ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాత్ర కూడా ఉందని గతంలో సీఐడీ అధికారులు పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆ ఎఫ్ఐఆర్లో ఏ1గా వేమూరి హరిప్రసాద్, ఏ2గా మాజీ ఎండీ సాంబశివరావు ఉన్నారు.
ఇక, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో చంద్రబాబు అరెస్టయి రాజమండ్రి జైల్లో జ్యుడిషియల్ రిమాండ్ పై ఉన్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే చంద్రబాబుపై అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసులో పీటీ వారెంట్ దాఖలైంది. ఇపుడు తాజాగా ఫైబర్ నెట్ స్కాంలో కూడా పీటీ వారెంట్ జారీ కావడం, ఏసీబీ కోర్టు విచారణకు స్వీకరించడం సంచలనం రేపింది. ఈ మూడు వ్యవహారాలతో పాటు చంద్రబాబుపై మరిన్ని కేసులు పెట్టేందుకు సీఐడీ అధికారులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
This post was last modified on September 20, 2023 6:33 am
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…