టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్పై ఇరు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న పలువురు కీలక నేతలు స్పందించిన సంగతి తెలిసిందే. చాలామంది చంద్రబాబు అరెస్టు చేసిన తీరును ఖండించారు. మరికొందరైతే, మోడీ అండతోనే జగన్..చంద్రబాబును అరెస్టు చేయించారని కూడా ఆరోపించారు.
ఈ క్రమంలోనే తాజాగా చంద్రబాబు అరెస్టుపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అరెస్ట్ వెనుక జగన్, మోడీలతోపాటు సీఎం కేసీఆర్ ఉన్నారని షాకింగ్ ఆరోపణలు చేశారు. చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండించిన మధుయాష్కీ…జగన్, కేసీఆర్ కుమ్మక్కై చంద్రబాబును కటకటాల వెనక్కు పంపారని ఆరోపించారు.
ఈ సందర్భంగా కేసీఆర్ పై కూడా మధుయాష్కీ షాకింగ్ కామెంట్లు చేశారు. 2019 ఎన్నికల్లో జగన్ ను గెలిపించేందుకు కేసీఆర్ సూట్కేసులు అందించారని, బీఆర్ఎస్, బీజేపీ, వైసీపీ ఒక్కటేనని ఆరోపించారు. కేసీఆర్, జగన్, మోడీ కుట్రలను ప్రజలు గమనించాలని ఆయన పిలుపునిచ్చారు.
చంద్రబాబు అరెస్టు అక్రమమని, నిందితులను అరెస్టు చేసే సమయంలో అధికారులు చట్టపరమైన నిబంధనలను పాటించాల్సిన అవసరం ఉందని హితవు పలికారు. చట్టాన్ని అతిక్రమించి కక్ష సాధింపుతో చంద్రబాబును అరెస్టు చేయడం సరికాదన్నారు. కేసీఆర్కు తెలియకుండా జగన్ ఏమీ చేయరని, బీఆర్ఎస్, బీజేపీ, వైసీపీ మూడు ఒక్కటేనని ఆరోపించారు.
This post was last modified on September 20, 2023 10:15 am
నిన్న జరిగిన బ్యాండ్ మేళం సక్సెస్ మీట్ లో ఎక్కువ శాతం నటీనటులు, దర్శకుడు ఒక పాయింట్ మీద ఫిర్యాదు…
అనుకున్నది ఒకటి.. అవుతున్నది మరొకటి అన్నట్లుగా మారింది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీరు. ఇరాన్ తో మొదలు పెట్టిన యుద్ధాన్ని…
ప్రభాస్ లాంటి పాన్ ఇండియా సూపర్ స్టార్.. చిన్న, మిడ్ రేంజ్ సినిమాల గురించి ఒక ట్వీట్ వేసినా చాలు..…
భారత రాజ్యాంగ చరిత్రలో అరుదైన సన్నివేశానికి బుధవారం (ఏప్రిల్ 1, 2026) వేదిక కానుంది. ఈ ప్రత్యేక సందర్భానికి కారణం…
రాజకీయాల్లో జంపింగులు కొత్తకాదు. ఎవరికి నచ్చిన దిక్కుకు వారు వెళ్లిపోవడమూ కొత్తకాదు. ఎవరికి అవసరం.. అవకాశం ఉన్న దిశగా నాయకులు,…
ఎటు చూసినా వైసీపీకి ఛాన్స్ కనిపించడం లేదా? ఏ వర్గం కూడా వైసీపీకి ఆశించిన మేరకు చేరువ అయ్యే అవకాశం…