టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ వ్యవహారంలో అరెస్టయి రాజమండ్రి జైల్లో రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చంద్రబాబు రిమాండ్ రిపోర్టు, ఎఫ్ఐఆర్ క్వాష్ చేయాలని, అమరావతి రింగ్ రోడ్డు కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని దాఖలైన పిటిషన్లపై ఈరోజు ఏపీ హైకోర్టులో విచారణ జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా చంద్రబాబుకు హైకోర్టులో ఊరట లభించలేదు. అమరావతి ఇన్నర్ రింగురోడ్డు కేసులో ముందస్తు బెయిల్ విచారణను ఏపీ హైకోర్టు ఈ నెల 21కి వాయిదా వేసింది.
మరోవైపు, స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో చంద్రబాబుపై నమోదైన ఎఫ్ఐఆర్ క్వాష్ చేయాలంటూ దాఖలైన పిటిషన్ పై విచారణ కొనసాగుతోంది. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది హరీష్ సాల్వే వర్చువల్ గా వాదనలు వినిపిస్తున్నారు. పీసీ యాక్ట్ 17ఏపై సాల్వే వాదిస్తున్నారు. దీనికి సంబంధించి అనేక తీర్పులున్నాయని ఆయన వాదించారు. ఆర్నబ్ గోస్వామి కేసును ఉదహరించిన సాల్వే…ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాతే అరెస్టు చేయాలని వాదనలు వినిపించారు. 2021లో నమోదైన కేసులో ఇప్పుడు చంద్రబాబు పేరును ఎలా చేరుస్తారని ప్రశ్నించారు. ఇక, చంద్రబాబు అరెస్టుకు గవర్నర్ అనుమతి తీసుకోలేదని అన్నారు. ఆయన అరెస్టు విషయంలో ప్రొసీజర్ ఫాలో కాలేదని వాదించారు.
ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో చంద్రబాబుపై దురుద్దేశ్యంతోనే కేసు పెట్టారని ఆరోపించారు. అంతకుముందు, సాల్వే 12 గంటలకు అందుబాటులోకి వస్తారని, ఆ సమయంలో విచారణ మొదలుబెట్టాలన్న ప్రతిపాదనకు సీఐడీ తరపు న్యాయవాదులు అంగీకరించారు. ఇక చంద్రబాబును ఈ నెల 18 వరకు కస్టడీలోకి కోరవద్దంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆ గడువు ముగియడంతో ఈరోజు చంద్రబాబును సిఐడి కస్టడీకి 5 రోజులపాటు అప్పగించాలన్న పిటిషన్ పై కూడా విచారణ జరగబోతుంది.
This post was last modified on September 19, 2023 2:27 pm
భారత రాష్ట్రసమితి(బీఆర్ఎస్).. ఈ పేరుకు పెద్ద ప్రాభవమే ఉంది. ఒక్కొక్కపార్టీకి నాయకుల పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. కానీ, బీఆర్ఎస్ కు…
సెంటిమెంటుకు-రాజకీయాలకు మధ్య సయామీ కవలలకు ఉన్నంత బంధం ఉంటుంది. సో.. సెంటిమెంటును కాదని నాయకులు రాజకీయాలు చేయగలరా? సాధ్యంకాదు. సో..…
తెలంగాణ పంచాయతీ ఎన్నికల పోలింగ్.. దీనికి ముందు జరిగిన ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు పంచిన నగదు.. వంటివి కీలక…
``ఫలానా వ్యక్తితో కలిసి పనిచేయండి.. ఫలానా పార్టీతో చేతులు కలపండి!`` అని ప్రధాని నరేంద్ర మోడీ తన రాజకీయ జీవితంలో…
కొందరు హీరోయిన్లు అసలేం మాట్లాడుతున్నారో ఆలోచించకుండా ఏదో ఒకటి అనేస్తారు. ఇప్పుడు రాధికా ఆప్టే అదే కోవలోకి వస్తోంది. బాలకృష్ణతో…
ప్రపంచ కప్ను కైవసం చేసుకున్న భారత మహిళా అంధుల క్రికెట్ జట్టును ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళగిరి క్యాంపు…