Political News

ఏపీకి అన్యాయం జ‌రిగింది.. తెలంగాణ‌లో ర‌క్తం పారింది: మోడీ

పార్ల‌మెంటు ప్ర‌త్యేక స‌మావేశాల తొలిరోజు.. లోక్‌స‌భ‌లో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ సుదీర్ఘ ప్ర‌సంగం చేశారు. సుమారు 42 నిమిషాల పాటు ఆయ‌న 75 ఏళ్ల పార్ల‌మెంటు ప్ర‌స్థానంపై చ‌ర్చ‌ను ప్రారంభించి ప్ర‌సంగించారు. ఈ క్ర‌మంలో ఆయ‌న కీల‌క‌మైన ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభ‌జ‌న అంశాన్ని ప్ర‌స్తావించారు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభ‌జ‌న కూడా ఈ పార్ల‌మెంటు భ‌వ‌నంలోనే జ‌రిగింద‌న్న ప్ర‌ధాని.. అయితే, శాస్త్రీయంగా ఈ విభ‌జ‌న జ‌ర‌గ‌లేద‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు.

“తెలంగాణ ఏర్పాటు ఈ పార్లమెంట్ భవనంలోనే జరిగింది. కానీ, ఉత్తరాఖండ్‌, జార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌లా ఏపీ, తెలంగాణ విభజన జరగలేదు. మాజీ ప్ర‌ధాని వాజ్‌పేయి హయాంలో మూడు రాష్ట్రాల విభజన ప్రణాళికాబ ద్ధంగా, శాస్త్రీయంగా జరిగింది. ఆ మూడు రాష్ట్రాల విభజన సమయంలో అన్ని చోట్లా సంబరాలు జరిగాయి. ప్ర‌జ‌లు ఎంతో సంతోషించారు. కానీ, ఆంధ్రప్రదేశ్ విభజన సరిగా జరగలేదు” అని ప్ర‌ధాని మోడీ అన్నారు.

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభజన ఏపీ, తెలంగాణ ఇరు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌ను సంతృప్తిపర్చలేకపోయిందని ప‌రోక్షంగా కాంగ్రెస్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. తెలంగాణ ఏర్పాటు ఎంతో ప్రయాసతో జరిగిందన్న ప్ర‌ధాని.. తెలంగాణ ఏర్పాటు సమయంలో రక్తపుటేర్లు పారాయని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అదేస‌మ‌యంలో ఏపీకి అన్యాయం చేశార‌ని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. కొత్త రాష్ట్రం వచ్చినా తెలంగాణ సంబరాలు చేసుకోలేకపోయింద‌ని, ఇది దారుణ‌మ‌ని వ్యాఖ్యానించారు.

This post was last modified on September 18, 2023 2:17 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

దెబ్బతిన్న హీరోలు vs రావిపూడి

టాలీవుడ్‌లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…

5 minutes ago

తెలంగాణ జనసేన టార్గెట్ ఫిక్స్… పొత్తు ఉంటుందా పవన్ సార్?

తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్‌చార్జ్‌ శంకర్‌గౌడ్‌…

31 minutes ago

లెజెండరీ ప్లేయర్లను దాటేసిన హిట్ మ్యాన్

వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…

1 hour ago

తొమ్మిదేళ్ల విక్రమ్ సినిమాకు మోక్షం ?

క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…

2 hours ago

‘అప్పుడు మహ్మద్ గజిని… ఇప్పుడు వైఎస్ జగన్’

అప్పుడు మహ్మద్‌ గజని… ఇప్పుడు వైఎస్‌ జగన్‌ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…

2 hours ago

రాజాసాబ్.. దేవర రూట్లో వెళ్లినా..

సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…

2 hours ago