Political News

ఏపీకి అన్యాయం జ‌రిగింది.. తెలంగాణ‌లో ర‌క్తం పారింది: మోడీ

పార్ల‌మెంటు ప్ర‌త్యేక స‌మావేశాల తొలిరోజు.. లోక్‌స‌భ‌లో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ సుదీర్ఘ ప్ర‌సంగం చేశారు. సుమారు 42 నిమిషాల పాటు ఆయ‌న 75 ఏళ్ల పార్ల‌మెంటు ప్ర‌స్థానంపై చ‌ర్చ‌ను ప్రారంభించి ప్ర‌సంగించారు. ఈ క్ర‌మంలో ఆయ‌న కీల‌క‌మైన ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభ‌జ‌న అంశాన్ని ప్ర‌స్తావించారు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభ‌జ‌న కూడా ఈ పార్ల‌మెంటు భ‌వ‌నంలోనే జ‌రిగింద‌న్న ప్ర‌ధాని.. అయితే, శాస్త్రీయంగా ఈ విభ‌జ‌న జ‌ర‌గ‌లేద‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు.

“తెలంగాణ ఏర్పాటు ఈ పార్లమెంట్ భవనంలోనే జరిగింది. కానీ, ఉత్తరాఖండ్‌, జార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌లా ఏపీ, తెలంగాణ విభజన జరగలేదు. మాజీ ప్ర‌ధాని వాజ్‌పేయి హయాంలో మూడు రాష్ట్రాల విభజన ప్రణాళికాబ ద్ధంగా, శాస్త్రీయంగా జరిగింది. ఆ మూడు రాష్ట్రాల విభజన సమయంలో అన్ని చోట్లా సంబరాలు జరిగాయి. ప్ర‌జ‌లు ఎంతో సంతోషించారు. కానీ, ఆంధ్రప్రదేశ్ విభజన సరిగా జరగలేదు” అని ప్ర‌ధాని మోడీ అన్నారు.

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభజన ఏపీ, తెలంగాణ ఇరు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌ను సంతృప్తిపర్చలేకపోయిందని ప‌రోక్షంగా కాంగ్రెస్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. తెలంగాణ ఏర్పాటు ఎంతో ప్రయాసతో జరిగిందన్న ప్ర‌ధాని.. తెలంగాణ ఏర్పాటు సమయంలో రక్తపుటేర్లు పారాయని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అదేస‌మ‌యంలో ఏపీకి అన్యాయం చేశార‌ని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. కొత్త రాష్ట్రం వచ్చినా తెలంగాణ సంబరాలు చేసుకోలేకపోయింద‌ని, ఇది దారుణ‌మ‌ని వ్యాఖ్యానించారు.

This post was last modified on September 18, 2023 2:17 pm

Share

Recent Posts

భోగాపురం క్రెడిట్ కోసం వైసీపీ తంటాలు…

వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు ఏపీ ప్ర‌జ‌లు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోష‌ల్ మీడియా ఊద‌ర గొడుతోంది. అంతేకాదు.. గ‌త…

10 minutes ago

స్పైడర్ మ్యాన్ సక్సెస్… ఏ పాఠం నేర్చుకోవాలి

సూపర్ స్టార్ కృష్ణ సోదరులు, సీనియర్ నిర్మాత ఆదిశేషగిరిరావు ఇవాళ జరిగిన శ్రీనివాస మంగాపురం ఈవెంట్ లో ఒక మాట…

54 minutes ago

టాక్సిక్ ట్రైలర్ మీద కోట్ల కళ్లున్నాయి

కెజిఎఫ్ లాంటి ఆల్ టైం బ్లాక్ బస్టర్ సాధించాక హీరో యష్ వేగంగా సినిమాలు చేయాలని తొందరపడలేదు. కోరుకుంటే స్టార్…

1 hour ago

ఎదిగే స్టేజిలో అలాంటి ఆలోచనలే రిస్కు

హీరో కిరణ్ అబ్బవరం మంచి ఊపులో ఉన్నాడు. చెన్నై లవ్ స్టోరీ అనుకున్న దానికన్నా బాగా ఆడటంతో పాటు యాభై…

2 hours ago

సందీప్ కిషన్ మూవీకి టెన్షన్ లేదు

కోలీవుడ్ స్టార్ హీరో, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ వ్యక్తిగత ఫ్యామిలీ సంబంధాల గురించి రకరకాల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.…

3 hours ago

అప్పుడు కుటుంబ పేర్లు… ఇప్పుడు వీరుల పేర్లు

భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ విమానాశ్రయాన్ని జాతికి…

4 hours ago