పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో చారిత్రక నిర్ణయాలే ఉంటాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. సమావేశాల ప్రారంభానికి ముందు ప్రధాని ఈ రోజు ఉదయం పార్లమెంటు ఆవరణలో మీడియాతో మాట్లాడారు. జీ-20 సమావేశాలను విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. భారత్ అధ్యక్షతన జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సు విజయవంతం కావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
ప్రపంచ భవిష్యత్తుకు భారత్ ఆశాకిరణంగా మారిందని ప్రధాని మోడీ అన్నారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. ఉజ్వల భవిష్యత్తు దిశగా భారత్ పయనిస్తోందన్న ఆయన.. కొత్త సంకల్పం దిశగా మరిన్ని అడుగులు ముందుకు వేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
దేశవ్యాప్తంగా సరికొత్త ఉత్సాహం వెల్లివిరుస్తోందని ప్రధాని అన్నారు. దేశాభివృద్ధి నిర్విఘ్నంగా కొనసాగుతుందని ఆశిస్తున్నామన్నారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలకు ఐదు రోజులు మాత్రమే కేటాయించినా.. సమావేశాలు జరుగుతున్న సందర్భం చాలా గొప్పదని పేర్కొన్నారు. ఈ సమావేశాల్లో చారిత్రక నిర్ణయాలు తీసుకోనున్నామని ప్రధాని తెలిపారు.
ఏడుపులకు సమయం కాదు!
ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై ప్రధాని మోడీ విమర్శలు గుప్పించారు. పార్లమెంట్ సభ్యులంతా ప్రత్యేక సమావేశాలకు హాజరుకావాలని కోరుకుంటున్నామని, ఏడుపులు, విమర్శలకు ఇది సమయం కాదని వ్యాఖ్యానించారు. విశ్వాసం, సానుకూల దృక్పథంతో సభలను నిర్వహించుకుందామని ఆయన పిలుపునిచ్చారు. సభ్యులంతా ఉత్సాహంగా చర్చల్లో పాల్గొంటారని ఆశిస్తున్నామని ప్రధాని అన్నారు.
This post was last modified on September 18, 2023 4:31 pm
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…
ఏపీలో మరో కీలక పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక పథకాన్ని సీఎం చంద్రబాబు, ఉప…
మంత్రి నారా లోకేష్.. మంగళవారం ఉమ్మడి కృష్ణాజిల్లాలోని ఓ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా…
ఏపీకి పొరుగునే ఉన్న తమిళనాడులో ఇప్పుడు ఇదే తరహా రాజకీయాలు కూడా కనిపిస్తున్నాయి. పార్టీలు లెక్కకు మిక్కిలిగా ఉన్నా.. నాయకులు…