Political News

చారిత్ర‌క నిర్ణ‌యాలు త‌ప్ప‌వు: మోడీ

పార్ల‌మెంటు ప్ర‌త్యేక స‌మావేశాల్లో చారిత్ర‌క నిర్ణ‌యాలే ఉంటాయ‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ స్ప‌ష్టం చేశారు. స‌మావేశాల‌ ప్రారంభానికి ముందు ప్ర‌ధాని ఈ రోజు ఉద‌యం పార్ల‌మెంటు ఆవ‌ర‌ణ‌లో మీడియాతో మాట్లాడారు. జీ-20 స‌మావేశాల‌ను విజ‌యవంతంగా నిర్వ‌హించామ‌ని తెలిపారు. భారత్‌ అధ్యక్షతన జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సు విజయవంతం కావ‌డం ప‌ట్ల‌ ఆయన హర్షం వ్యక్తం చేశారు.

ప్రపంచ భవిష్యత్తుకు భారత్‌ ఆశాకిరణంగా మారిందని ప్రధాని మోడీ అన్నారు. పార్ల‌మెంటు ప్రత్యేక సమావేశాల్లో చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. ఉజ్వల భవిష్యత్తు దిశగా భారత్‌ పయనిస్తోందన్న ఆయ‌న‌.. కొత్త సంకల్పం దిశగా మరిన్ని అడుగులు ముందుకు వేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని తెలిపారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ అవతరిస్తుందని ధీమా వ్య‌క్తం చేశారు.

దేశవ్యాప్తంగా సరికొత్త ఉత్సాహం వెల్లివిరుస్తోందని ప్ర‌ధాని అన్నారు. దేశాభివృద్ధి నిర్విఘ్నంగా కొనసాగుతుందని ఆశిస్తున్నామ‌న్నారు. పార్ల‌మెంటు ప్రత్యేక సమావేశాలకు ఐదు రోజులు మాత్ర‌మే కేటాయించినా.. స‌మావేశాలు జరుగుతున్న సందర్భం చాలా గొప్పదని పేర్కొన్నారు. ఈ స‌మావేశాల్లో చారిత్రక నిర్ణయాలు తీసుకోనున్నామ‌ని ప్ర‌ధాని తెలిపారు.

ఏడుపుల‌కు స‌మ‌యం కాదు!

ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై ప్రధాని మోడీ విమర్శలు గుప్పించారు. పార్లమెంట్‌ సభ్యులంతా ప్ర‌త్యేక స‌మావేశాల‌కు హాజరుకావాలని కోరుకుంటున్నామ‌ని, ఏడుపులు, విమర్శలకు ఇది సమయం కాదని వ్యాఖ్యానించారు. విశ్వాసం, సానుకూల దృక్పథంతో స‌భ‌ల‌ను నిర్వహించుకుందామ‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. సభ్యులంతా ఉత్సాహంగా చర్చల్లో పాల్గొంటారని ఆశిస్తున్నామ‌ని ప్ర‌ధాని అన్నారు.

This post was last modified on September 18, 2023 4:31 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

4 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

4 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

4 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

5 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

7 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

8 hours ago