Political News

తెలంగాణపై ఫోకస్.. ఖర్చుకు తగ్గేదే లేదంటున్న కాంగ్రెస్

రాబోయే తెలంగాణ ఎన్నికలపై కాంగ్రెస్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. గట్టిగా ప్రయత్నిస్తే.. శక్తివంచన లేకుండా కష్టపడితే వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో గెలవొచ్చనే అంచనాలతో హస్తం పార్టీ ఉంది. ఇప్పటికే ఆ పార్టీ రాష్ట్రంలో దూకుడు ప్రదర్శిస్తోంది. ఇప్పుడు పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహాన్ని నింపేందుకు.. ప్రజలు కాంగ్రెస్ గురించి మరింత ఎక్కువగా మాట్లాడుకునేందుకు పార్టీ రంగంలోకి దిగింది. తొలిసారి హైదరాబాద్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాలు నిర్వహిస్తోంది. తెలంగాణలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో ఈ సారి సీడబ్ల్యూసీ సమావేశాల కోసం కాంగ్రెస్ వ్యూహాత్మకంగా హైదరాబాద్ ను వేదికగా ఎంచుకుంది.

ఈ సమావేశాలు ముగియగానే 17న సాయంత్రం జరిగే విజయభేరి సభలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో సహా జాతీయ అగ్ర నాయకులు పాల్గొంటారు. ఈ సీడబ్ల్యూసీ సమావేశాలు, విజయభేరి సభతో ఎన్నికలకు సమరోత్సాహంతో సిద్ధమవాలని కాంగ్రెస్ చూస్తోంది. అందుకే వీటి నిర్వహణకు భారీగా ఖర్చు పెడుతోందని తెలిసింది. తాజ్ క్రిష్ణలో జరుగుతున్న రెండు రోజుల సమావేశాలకు వచ్చే నాయకుల కోసం 130 గదులను పార్టీ బుక్ చేసింది. అలాగే జాతీయ మీడియా ప్రతినిధుల కోసం మరో హోటల్లోను భారీగానే గదులను రెంటుకు తీసుకుంది.

ఇక ఢిల్లీ నుంచి నేతలు రావడానికి, పోవడానికి విమాన ఖర్చులు కూడా ఉంటాయి. వీళ్లకు ప్రైవేటు భద్రత కూడా ఉంటుంది. అంతే కాకుండా విజయభేరి సభను కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఇలా వీటన్నింటికీ కలిపి రూ.కోట్లలోనే ఖర్చు అవుతుందని సమాచారం. అయినప్పటికీ కాంగ్రెస్ ఎక్కడా తగ్గకుండా ముందుకు సాగుతుందనే చెప్పాలి. ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఆ పార్టీ వేగంగా అడుగులు వేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

This post was last modified on September 17, 2023 10:13 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

వంట సామాగ్రితో రెడీగా ఉండండి… దీదీ హాట్ కామెంట్స్!

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర పరిశీలన వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ…

2 hours ago

రోడ్లకు మహర్దశ… పవన్ కు మంత్రుల అభినందనలు

ఆంధ్రప్రదేశ్ రహదారుల అభివృద్ధికి మహర్దశ వచ్చింది. పంచాయతీరాజ్‌ శాఖ రాష్ట్రవ్యాప్తంగా 157 నియోజకవర్గాల్లో మొత్తం 1299 రహదారి నిర్మాణ–మరమ్మతు పనులను…

5 hours ago

చావు భయంలో ఎలన్ మస్క్

ఎప్పుడూ ట్విట్టర్ లో, బయట హడావిడి చేసే ఎలన్ మస్క్ ఇప్పుడు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఇది ఆయనకి ఆయనగా…

6 hours ago

కార్యకర్తలతో చంద్రబాబు… కాఫీ కబుర్లు

తెలుగుదేశం పార్టీ ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.   'కాఫీ కబుర్లు' పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం కార్యకర్తల్లో…

7 hours ago

ప్రశ్నార్థకంగా మారుతున్న రామ్ సెలక్షన్

ఆంధ్రకింగ్ తాలూకా ఫైనల్ రన్ అయిపోయింది. పాజిటివ్ రివ్యూలు, బాగుందని చెప్పిన పబ్లిక్ టాక్స్ ఇవేవి పట్టుమని మూడు వారాల…

7 hours ago

సెన్సారుకి సారీ… మంచి సాంప్రదాయం

నిన్న జరిగిన మోగ్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విలన్ గా నటించిన బండి సరోజ్ కుమార్ సెన్సార్ బోర్డుని…

8 hours ago