రాబోయే తెలంగాణ ఎన్నికలపై కాంగ్రెస్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. గట్టిగా ప్రయత్నిస్తే.. శక్తివంచన లేకుండా కష్టపడితే వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో గెలవొచ్చనే అంచనాలతో హస్తం పార్టీ ఉంది. ఇప్పటికే ఆ పార్టీ రాష్ట్రంలో దూకుడు ప్రదర్శిస్తోంది. ఇప్పుడు పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహాన్ని నింపేందుకు.. ప్రజలు కాంగ్రెస్ గురించి మరింత ఎక్కువగా మాట్లాడుకునేందుకు పార్టీ రంగంలోకి దిగింది. తొలిసారి హైదరాబాద్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాలు నిర్వహిస్తోంది. తెలంగాణలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో ఈ సారి సీడబ్ల్యూసీ సమావేశాల కోసం కాంగ్రెస్ వ్యూహాత్మకంగా హైదరాబాద్ ను వేదికగా ఎంచుకుంది.
ఈ సమావేశాలు ముగియగానే 17న సాయంత్రం జరిగే విజయభేరి సభలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో సహా జాతీయ అగ్ర నాయకులు పాల్గొంటారు. ఈ సీడబ్ల్యూసీ సమావేశాలు, విజయభేరి సభతో ఎన్నికలకు సమరోత్సాహంతో సిద్ధమవాలని కాంగ్రెస్ చూస్తోంది. అందుకే వీటి నిర్వహణకు భారీగా ఖర్చు పెడుతోందని తెలిసింది. తాజ్ క్రిష్ణలో జరుగుతున్న రెండు రోజుల సమావేశాలకు వచ్చే నాయకుల కోసం 130 గదులను పార్టీ బుక్ చేసింది. అలాగే జాతీయ మీడియా ప్రతినిధుల కోసం మరో హోటల్లోను భారీగానే గదులను రెంటుకు తీసుకుంది.
ఇక ఢిల్లీ నుంచి నేతలు రావడానికి, పోవడానికి విమాన ఖర్చులు కూడా ఉంటాయి. వీళ్లకు ప్రైవేటు భద్రత కూడా ఉంటుంది. అంతే కాకుండా విజయభేరి సభను కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఇలా వీటన్నింటికీ కలిపి రూ.కోట్లలోనే ఖర్చు అవుతుందని సమాచారం. అయినప్పటికీ కాంగ్రెస్ ఎక్కడా తగ్గకుండా ముందుకు సాగుతుందనే చెప్పాలి. ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఆ పార్టీ వేగంగా అడుగులు వేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
This post was last modified on September 17, 2023 10:13 am
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…