Political News

తెలంగాణపై ఫోకస్.. ఖర్చుకు తగ్గేదే లేదంటున్న కాంగ్రెస్

రాబోయే తెలంగాణ ఎన్నికలపై కాంగ్రెస్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. గట్టిగా ప్రయత్నిస్తే.. శక్తివంచన లేకుండా కష్టపడితే వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో గెలవొచ్చనే అంచనాలతో హస్తం పార్టీ ఉంది. ఇప్పటికే ఆ పార్టీ రాష్ట్రంలో దూకుడు ప్రదర్శిస్తోంది. ఇప్పుడు పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహాన్ని నింపేందుకు.. ప్రజలు కాంగ్రెస్ గురించి మరింత ఎక్కువగా మాట్లాడుకునేందుకు పార్టీ రంగంలోకి దిగింది. తొలిసారి హైదరాబాద్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాలు నిర్వహిస్తోంది. తెలంగాణలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో ఈ సారి సీడబ్ల్యూసీ సమావేశాల కోసం కాంగ్రెస్ వ్యూహాత్మకంగా హైదరాబాద్ ను వేదికగా ఎంచుకుంది.

ఈ సమావేశాలు ముగియగానే 17న సాయంత్రం జరిగే విజయభేరి సభలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో సహా జాతీయ అగ్ర నాయకులు పాల్గొంటారు. ఈ సీడబ్ల్యూసీ సమావేశాలు, విజయభేరి సభతో ఎన్నికలకు సమరోత్సాహంతో సిద్ధమవాలని కాంగ్రెస్ చూస్తోంది. అందుకే వీటి నిర్వహణకు భారీగా ఖర్చు పెడుతోందని తెలిసింది. తాజ్ క్రిష్ణలో జరుగుతున్న రెండు రోజుల సమావేశాలకు వచ్చే నాయకుల కోసం 130 గదులను పార్టీ బుక్ చేసింది. అలాగే జాతీయ మీడియా ప్రతినిధుల కోసం మరో హోటల్లోను భారీగానే గదులను రెంటుకు తీసుకుంది.

ఇక ఢిల్లీ నుంచి నేతలు రావడానికి, పోవడానికి విమాన ఖర్చులు కూడా ఉంటాయి. వీళ్లకు ప్రైవేటు భద్రత కూడా ఉంటుంది. అంతే కాకుండా విజయభేరి సభను కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఇలా వీటన్నింటికీ కలిపి రూ.కోట్లలోనే ఖర్చు అవుతుందని సమాచారం. అయినప్పటికీ కాంగ్రెస్ ఎక్కడా తగ్గకుండా ముందుకు సాగుతుందనే చెప్పాలి. ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఆ పార్టీ వేగంగా అడుగులు వేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

This post was last modified on September 17, 2023 10:13 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మోనాలిసా పెళ్లి… లవ్ జిహాద్ కాదట

గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన…

4 hours ago

ఇరాన్ పై యుద్ధం… ట్రంప్ కొంప ముంచుతుందా?

ఇరాన్‌తో యుద్ధం విష‌యంలో అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా?  నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…

6 hours ago

‘కల్కి’పై విమర్శలకు కట్టుబడి ఉన్న లిరిసిస్ట్

ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…

6 hours ago

ఎన్నిక‌ల క‌మిష‌నర్‌ను తొలగించడానికి తీర్మానమా?

దేశంలో గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ప‌లు కీల‌క అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్ర‌ధాని పైనే గ‌త ఐదేళ్ల‌లో…

9 hours ago

చంద్రబాబు 3సీ ఫార్ములా… ఇది కలెక్టర్ల కోసమే

ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…

10 hours ago

థియేటర్ అనుభూతికి ‘సబ్ టైటిల్స్’ దెబ్బ

మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…

11 hours ago