రాబోయే తెలంగాణ ఎన్నికలపై కాంగ్రెస్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. గట్టిగా ప్రయత్నిస్తే.. శక్తివంచన లేకుండా కష్టపడితే వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో గెలవొచ్చనే అంచనాలతో హస్తం పార్టీ ఉంది. ఇప్పటికే ఆ పార్టీ రాష్ట్రంలో దూకుడు ప్రదర్శిస్తోంది. ఇప్పుడు పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహాన్ని నింపేందుకు.. ప్రజలు కాంగ్రెస్ గురించి మరింత ఎక్కువగా మాట్లాడుకునేందుకు పార్టీ రంగంలోకి దిగింది. తొలిసారి హైదరాబాద్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాలు నిర్వహిస్తోంది. తెలంగాణలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో ఈ సారి సీడబ్ల్యూసీ సమావేశాల కోసం కాంగ్రెస్ వ్యూహాత్మకంగా హైదరాబాద్ ను వేదికగా ఎంచుకుంది.
ఈ సమావేశాలు ముగియగానే 17న సాయంత్రం జరిగే విజయభేరి సభలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో సహా జాతీయ అగ్ర నాయకులు పాల్గొంటారు. ఈ సీడబ్ల్యూసీ సమావేశాలు, విజయభేరి సభతో ఎన్నికలకు సమరోత్సాహంతో సిద్ధమవాలని కాంగ్రెస్ చూస్తోంది. అందుకే వీటి నిర్వహణకు భారీగా ఖర్చు పెడుతోందని తెలిసింది. తాజ్ క్రిష్ణలో జరుగుతున్న రెండు రోజుల సమావేశాలకు వచ్చే నాయకుల కోసం 130 గదులను పార్టీ బుక్ చేసింది. అలాగే జాతీయ మీడియా ప్రతినిధుల కోసం మరో హోటల్లోను భారీగానే గదులను రెంటుకు తీసుకుంది.
ఇక ఢిల్లీ నుంచి నేతలు రావడానికి, పోవడానికి విమాన ఖర్చులు కూడా ఉంటాయి. వీళ్లకు ప్రైవేటు భద్రత కూడా ఉంటుంది. అంతే కాకుండా విజయభేరి సభను కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఇలా వీటన్నింటికీ కలిపి రూ.కోట్లలోనే ఖర్చు అవుతుందని సమాచారం. అయినప్పటికీ కాంగ్రెస్ ఎక్కడా తగ్గకుండా ముందుకు సాగుతుందనే చెప్పాలి. ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఆ పార్టీ వేగంగా అడుగులు వేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
This post was last modified on September 17, 2023 10:13 am
ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు.. ఏపీ సీఐడీ మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి.. ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న సునీల్కు రఘురామకు…
టీడీపీలో నాయకులు.. చంద్రబాబు కనుసన్నల్లోనే మెలుగుతున్నారా? ఆయన చెప్పినట్టే చేస్తున్నారా? అంటే.. మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా…
అవకాశాలు.. అదృష్టాలు.. పదే పదే రావని అంటారు. అవి వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకునేందుకు వ్యక్తులైనా పార్టీలైనా.. ఎవరైనా సరే..…
ఐపీఎల్ 2026 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు అస్సలు కలిసి రావడం లేదు. వరుసగా రెండో ఓటమిని…
ఎన్నికలు సమీపిస్తున్నపుడు కొందరు రాజకీయ నాయకులకు ఎలివేషన్లు ఇస్తూ సినిమాలు వస్తుంటాయి. అలాగే కొందరు నేతలను టార్గెట్ చేస్తూ మూవీస్…
ఏపీ రాజధాని అమరావతిపై సీఎం చంద్రబాబుకు ఉన్న ముందుచూపు, తాజాగా రాజధాని బిల్లును ఆమోదించిన విధానం.. వంటివి చర్చకు వస్తున్నాయి.…