కాంగ్రెస్ లో వైఎస్సార్ తెలంగాణ పార్టీ విలీనానికి రంగం సిద్ధమైందా? ఆదివారం (సెప్టెంబర్ 17న) జరిగే కాంగ్రెస్ విజయభేరి సభలోనే షర్మిల పార్టీ విలీనం ప్రకటన రానుందా? అంటే రాజకీయ విశ్లేషకుల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ఈ సభలోనే కాంగ్రెస్ లో షర్మిల స్థాపించిన వైఎస్సార్ తెలంగాణ పార్టీ విలీన ప్రకటన వెలువడుతుందనే అంచనాలు కలుగుతున్నాయి.
ఎన్నికలకు ముందు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ విజయభేరి సభ నిర్వహించబోతున్న సంగతి తెలిసిందే. దీనికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తదితర అగ్ర నాయకులు హాజరు కానున్నారు. దీంతో ఈ సభలోనే షర్మిల పార్టీ విలీన ప్రకటన చేయాలని చూస్తున్నారని సమాచారం. ఈ మేరకు చర్చలు కూడా కొలిక్కి వచ్చాయని చెబుతున్నారు.
కాంగ్రెస్ లో తన పార్టీని కలిపేసేందుకు కొన్ని రోజులుగా షర్మిల ప్రయత్నిస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో అధిష్ఠానంతో దౌత్యం కోసం బెంగళూరు వెళ్లి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ను షర్మిలు పలుమార్లు కలిశారనే టాక్ ఉంది. ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అధిష్ఠానంతోనూ ఆమె చర్చలు జరిపారు. కానీ కాంగ్రెస్, షర్మిల మధ్య వచ్చే ఎన్నికల్లో సీట్ల కేటాయింపు, ఏపీలో ఆమె సేవల గురించి జరిగిన చర్చలు కొలిక్కి రాలేదని తెలిసింది. అందుకే ఇప్పటివరకూ పార్టీ విలీనం జరగలేదని అంటున్నారు. హైదరాబాద్ సీడబ్ల్యూసీ సమావేశాలు, విజయ భేరి సభ సందర్భంగా షర్మిల మరోసారి డీకే శివకుమార్ ను కలిశారని తెలిసింది. సోనియా లేదా రాహుల్ తో భేటీతో పార్టీ విలీన ప్రక్రియను షర్మిల ముగింపు దశకు తెస్తారని టాక్.
This post was last modified on September 16, 2023 10:09 pm
రాష్ట్రంలో కూటమి సర్కారు ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తయింది. అయితే.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మళ్లీ అధికారం ఎవరికి దక్కుతుంది? అనే…
ఏపీ విపక్షం(ప్రధాన కాదు) వైసీపీలో అంతర్గత పోరు ఎక్కువగా సాగుతోంది. దీనికి తోడు.. వైసీపీ అధినేత జగన్కు అత్యంత సన్నిహితంగా…
ఒకటి కాదు.. రెండు కాదు... ఏకంగా వేలు.. లక్షల్లోనే ఉద్యోగాలకు ప్రతిష్టాత్మక సంస్థలు మంగళం పాడుతున్నాయి. ప్రపంచ ప్రఖ్యాత ఫోక్స్…
ఇండియాలో ఓటీటీల హవా మొదలయ్యాక పాన్ ఇండియా స్థాయిలో అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకున్న వెబ్ సిరీస్ల్లో ‘మీర్జాపూర్’ ఒకటి. ఇండియాలో…
తెలుగు వారికి అత్యంత ప్రీతిపాత్రమైన టీవీ ఛానెళ్లలో ఈటీవీ ఒకటి. 90వ దశకంలో ప్రైవేటు టీవీ ఛానెళ్ల జోరు పెరుగుతున్న…
టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జంధ్యాల దర్శకత్వంలో సీనియర్ నటుడు నరేష్, దివంగత నటుడు కోటా శ్రీనివాసరావులు నటించిన ‘హై హై…