కాంగ్రెస్ లో వైఎస్సార్ తెలంగాణ పార్టీ విలీనానికి రంగం సిద్ధమైందా? ఆదివారం (సెప్టెంబర్ 17న) జరిగే కాంగ్రెస్ విజయభేరి సభలోనే షర్మిల పార్టీ విలీనం ప్రకటన రానుందా? అంటే రాజకీయ విశ్లేషకుల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ఈ సభలోనే కాంగ్రెస్ లో షర్మిల స్థాపించిన వైఎస్సార్ తెలంగాణ పార్టీ విలీన ప్రకటన వెలువడుతుందనే అంచనాలు కలుగుతున్నాయి.
ఎన్నికలకు ముందు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ విజయభేరి సభ నిర్వహించబోతున్న సంగతి తెలిసిందే. దీనికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తదితర అగ్ర నాయకులు హాజరు కానున్నారు. దీంతో ఈ సభలోనే షర్మిల పార్టీ విలీన ప్రకటన చేయాలని చూస్తున్నారని సమాచారం. ఈ మేరకు చర్చలు కూడా కొలిక్కి వచ్చాయని చెబుతున్నారు.
కాంగ్రెస్ లో తన పార్టీని కలిపేసేందుకు కొన్ని రోజులుగా షర్మిల ప్రయత్నిస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో అధిష్ఠానంతో దౌత్యం కోసం బెంగళూరు వెళ్లి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ను షర్మిలు పలుమార్లు కలిశారనే టాక్ ఉంది. ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అధిష్ఠానంతోనూ ఆమె చర్చలు జరిపారు. కానీ కాంగ్రెస్, షర్మిల మధ్య వచ్చే ఎన్నికల్లో సీట్ల కేటాయింపు, ఏపీలో ఆమె సేవల గురించి జరిగిన చర్చలు కొలిక్కి రాలేదని తెలిసింది. అందుకే ఇప్పటివరకూ పార్టీ విలీనం జరగలేదని అంటున్నారు. హైదరాబాద్ సీడబ్ల్యూసీ సమావేశాలు, విజయ భేరి సభ సందర్భంగా షర్మిల మరోసారి డీకే శివకుమార్ ను కలిశారని తెలిసింది. సోనియా లేదా రాహుల్ తో భేటీతో పార్టీ విలీన ప్రక్రియను షర్మిల ముగింపు దశకు తెస్తారని టాక్.
This post was last modified on September 16, 2023 10:09 pm
వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…
ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…
దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…
బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…
తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…