Political News

నీటి వాటా తేల్చ‌లేని వ్య‌క్తి విశ్వ‌గురువా?: కేసీఆర్

చాన్నాళ్ల త‌ర్వాత ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీపై తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ సంచ‌ల‌న విమ‌ర్శ‌లు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య కొన్ని ద‌శాబ్దాలుగా ఉన్న నీటి వివాదాన్ని ప‌రిష్క‌రించ‌లేని వ్య‌క్తి… త‌న‌ను తాను విశ్వ గురువుగా ప‌రిగ‌ణించుకుం టూ ప్ర‌చారం చేసుకుంటున్నార‌ని తీవ్ర‌స్థాయిలో వ్యాఖ్య‌లు గుప్పించారు. కృష్ణా జలాల్లో వాటా తేల్చ‌మ‌ని అనేక సంద‌ర్భాల్లో తాను స్వ‌యంగా కేంద్రానికి లేఖ‌లు రాశాన‌ని.. అయితే, ఇప్ప‌టికీ చేత‌కాని ద‌ద్ద‌మ్మ మాదిరిగా కేంద్రం వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని విరుచుకుప‌డ్డారు.

శనివారం పాలమూరు ఎత్తిపోతల పథకం మొదటి పంప్‌ను సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. స్థానిక సాగునీటికి నీటిని విడుదల చేశారు. అనంత‌రం కొల్లాపూర్ లో నిర్వ‌హించిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడారు. “దక్షిణ తెలంగాణ చరిత్రలో సువర్ణ అధ్యాయం ప్రారంభ‌మైంది. పాలమూరు ప్రజలంటే ఒకప్పడు అడ్డా కూలీలు. అయితే, వారి త‌ల‌రాత‌లు మారాయి. ఈ రోజు తెలంగాణ ప్రజలే.. ఇతర రాష్ట్రాల వారిని పనిలో పెట్టుకుంటున్నారు” అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

పాలమూరు ఎంపీగా ఉన్నప్పుడే తాను తెలంగాణ సాధించాన‌ని కేసీఆర్ చెప్పారు. అయితే, కొందరు నేతల కార‌ణంగానే.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌ నిర్మాణం ఆలస్యమైందని చెప్పారు. గత పాలకులు ప‌ద‌వుల కోసం ఆశ‌లు ప‌డి పాలమూరు జిల్లా నీటివాటా గురించి అడగలేదని విమ‌ర్శ‌లు గుప్పించారు. ఇంటి దొంగలే మనకు ప్రాణగండం తెచ్చారని వ్యాఖ్యానించారు.

“మన నీళ్లు ఏపీకి తరలిస్తుంటే.. ఈ జిల్లా నేతలు జెండాలు ఊపారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చమంటే మోడీకి చేతకావటం లేదు. విశ్వగురువుగా మాత్రం త‌న‌ను తాను ప్ర‌చారం చేసుకుంటున్నాడు. అలా చెప్పుకునే మోడీ.. 9ఏళ్లుగా మన నీళ్ల వాటా తేల్చలేదు. బీజేపీ నేతలను పాలమూరు జిల్లా ప్రజలు నిలదీయాలి. పదేళ్లుగా కృష్ణా ట్రైబ్యునల్‌కు ఎందుకు ప్రతిపాదనలు పంపటం లేదో ప్ర‌శ్నించాలి” అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

This post was last modified on September 16, 2023 10:03 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వరప్రసాదుకి పోలికలు అవసరం లేదు

మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…

1 hour ago

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

6 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

6 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

6 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

7 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

9 hours ago