Political News

నీటి వాటా తేల్చ‌లేని వ్య‌క్తి విశ్వ‌గురువా?: కేసీఆర్

చాన్నాళ్ల త‌ర్వాత ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీపై తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ సంచ‌ల‌న విమ‌ర్శ‌లు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య కొన్ని ద‌శాబ్దాలుగా ఉన్న నీటి వివాదాన్ని ప‌రిష్క‌రించ‌లేని వ్య‌క్తి… త‌న‌ను తాను విశ్వ గురువుగా ప‌రిగ‌ణించుకుం టూ ప్ర‌చారం చేసుకుంటున్నార‌ని తీవ్ర‌స్థాయిలో వ్యాఖ్య‌లు గుప్పించారు. కృష్ణా జలాల్లో వాటా తేల్చ‌మ‌ని అనేక సంద‌ర్భాల్లో తాను స్వ‌యంగా కేంద్రానికి లేఖ‌లు రాశాన‌ని.. అయితే, ఇప్ప‌టికీ చేత‌కాని ద‌ద్ద‌మ్మ మాదిరిగా కేంద్రం వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని విరుచుకుప‌డ్డారు.

శనివారం పాలమూరు ఎత్తిపోతల పథకం మొదటి పంప్‌ను సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. స్థానిక సాగునీటికి నీటిని విడుదల చేశారు. అనంత‌రం కొల్లాపూర్ లో నిర్వ‌హించిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడారు. “దక్షిణ తెలంగాణ చరిత్రలో సువర్ణ అధ్యాయం ప్రారంభ‌మైంది. పాలమూరు ప్రజలంటే ఒకప్పడు అడ్డా కూలీలు. అయితే, వారి త‌ల‌రాత‌లు మారాయి. ఈ రోజు తెలంగాణ ప్రజలే.. ఇతర రాష్ట్రాల వారిని పనిలో పెట్టుకుంటున్నారు” అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

పాలమూరు ఎంపీగా ఉన్నప్పుడే తాను తెలంగాణ సాధించాన‌ని కేసీఆర్ చెప్పారు. అయితే, కొందరు నేతల కార‌ణంగానే.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌ నిర్మాణం ఆలస్యమైందని చెప్పారు. గత పాలకులు ప‌ద‌వుల కోసం ఆశ‌లు ప‌డి పాలమూరు జిల్లా నీటివాటా గురించి అడగలేదని విమ‌ర్శ‌లు గుప్పించారు. ఇంటి దొంగలే మనకు ప్రాణగండం తెచ్చారని వ్యాఖ్యానించారు.

“మన నీళ్లు ఏపీకి తరలిస్తుంటే.. ఈ జిల్లా నేతలు జెండాలు ఊపారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చమంటే మోడీకి చేతకావటం లేదు. విశ్వగురువుగా మాత్రం త‌న‌ను తాను ప్ర‌చారం చేసుకుంటున్నాడు. అలా చెప్పుకునే మోడీ.. 9ఏళ్లుగా మన నీళ్ల వాటా తేల్చలేదు. బీజేపీ నేతలను పాలమూరు జిల్లా ప్రజలు నిలదీయాలి. పదేళ్లుగా కృష్ణా ట్రైబ్యునల్‌కు ఎందుకు ప్రతిపాదనలు పంపటం లేదో ప్ర‌శ్నించాలి” అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

This post was last modified on September 16, 2023 10:03 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రీమియర్ రేట్లు నిర్ణయించుకున్న పెద్ది ?

జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…

35 minutes ago

త‌మిళ రాజ‌కీయాల్లో పుష్ప సోఫా రచ్చ

గ‌త ప‌ది రోజులుగా త‌మిళనాడు రాజ‌కీయాలు దేశ‌వ్యాప్తంగా ఎంత చ‌ర్చ‌నీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…

1 hour ago

చిరంజీవి దగ్గరికి వెళ్తే ఏమవుతుంది

ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…

2 hours ago

పెద్దిని వద్దనుకుంటే ఎవరికి నష్టం

నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…

3 hours ago

“రాహుల్-ప్రియాంక‌.. కేర‌ళ మిమ్మ‌ల్ని క్ష‌మించ‌దు!“

కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత‌లు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీల‌కు కేర‌ళలో తీవ్ర‌నిర‌స‌న సెగ త‌గులుతోంది. రాహుల్‌-ప్రియాంక‌.. కేర‌ళ మిమ్మ‌ల్ని క్ష‌మించ‌దు.…

4 hours ago

పవన్ చెప్తే చేస్తాడండోయ్

నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…

4 hours ago