Political News

కవితకు ఊరటేనా ?

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కల్వకుంట్ల కవితకు కాస్త ఊరటదక్కినట్లేనా ? లిక్కర్ స్కామ్ లో విచారణకు ఈరోజు ఢిల్లీలోని తమ ఆఫీసులో హాజరవ్వాలని ఈడీ కవితకు నోటీసులిచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈడీ ఇచ్చిన నోటీసులను ఛాలెంజ్ చేస్తూ కవిత సుప్రింకోర్టులో పిటీషన్ దాఖలుచేశారు. ఆ కేసును విచారించిన సుప్రింకోర్టు ఈనెల 26వ తేదీవరకు నోటీసులు ఇవ్వద్దని ఈడీని ఆదేశించింది. ఈ ఆదేశాలను చాలెంజ్ చేస్తు ఈడీ మరో కేసు వేస్తుందా లేదా అన్నది చూడాలి.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే లిక్కర్ స్కామ్ లో సౌత్ గ్రూప్ తరపున కవిత పాత్ర చాలా కీలకమని ఈడీ ఎప్పుడో తేల్చేసింది. ఈ కేసులో ఇప్పటికే చాలామందిని అరెస్టుచేసింది. ఇద్దరు ముగ్గురు బెయిల్ పైన బయటున్నారు, మరికొందరు జైల్లోనే ఉన్నారు. ఈమధ్యనే అరుణ్ రామచంద్ర పిళ్ళైని ఈడీ అరెస్టు చేసి విచారించింది. పిళ్ళై అరెస్టయిన రెండు రోజులకే ఈడీ కవితకు నోటీసులు జారీచేసింది. ఎందుకంటే కవితకు పిళ్ళై బినామీ అనే ప్రచారం అందరికీ తెలిసిందే. పిళ్ళై అప్రూవర్ గా మారిపోయి కవిత పాత్రకు సంబంధించిన అన్నీ వివరాలను ఈడీకి చెప్పేశారని ఒక్కసారిగా ప్రచారం పెరిగిపోయింది.

అయితే తాను అప్రూవర్ గా మారలేదని పిళ్ళై మొత్తుకుంటున్నారు. విచారణలో ఏమిజరిగిందో ఎవరికీ తెలీదు కానీ వెంటనే ఈడీ కవితకు నోటీసులు ఇవ్వటం మాత్రం సంచలనమైంది. కారణం ఏమిటంటే తొందరలోనే తెలంగాణాలో ఎన్నికలు జరగబోతుండటమే. రాబోయే ఎన్నికల్లో కవిత అరెస్టు లేదా కవిత పాత్రే కీలక అంశంగా మారబోతోందనటంలో సందేహంలేదు. కవితను అరెస్టునుండి తప్పించేందుకే నరేంద్రమోడీకి కేసీయార్ సరెండర్ అయిపోయారని లోపాయికారీ ఒప్పందం చేసుకున్నారని కాంగ్రెస్ పదేపదే హోరెత్తించేస్తోంది.

కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను జనాలు నిజమే అని నమ్ముతున్నారు. ఎందుకంటే ఒకపుడు మోడీ అంటేనే అంతెత్తున ఎగిరిపడే కేసీయార్ ఇపుడు కనీసం మాట కూడా ఎత్తటంలేదు. ఒకపుడు కవితను ఈడీ అరెస్టుచేయబోతోందని విపరీతంగా ప్రచారమైంది. అప్పటినుండే మోడీపై కేసీయార్ మాట్లాడటం మానుకున్నారు. సో, జరుగుతన్న పరిణామాలను చూసిన తర్వాత జనాలు కూడా బీజేపీ, బీఆర్ఎస్ కలిసిపోయాయనే అనుకుంటున్నారు. లేకపోతే కవిత అరెస్టుకు ఈడీ ఎందుకు వెనకాడుతుంది ?

This post was last modified on September 16, 2023 9:45 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

5 minutes ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

49 minutes ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

1 hour ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

2 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

2 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

3 hours ago