టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును దొరికిన దొంగగా ఆయన పేర్కొన్నారు. అయితే, దొంగగా దొరికినప్పటికీ.. ఆయనకు ఉన్న బలమైన ముఠా ఈ విషయాన్ని జీర్ణించుకోలేక పోతోందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ నిబంధనలను పక్కన పెట్టి నకిలీ ఒప్పందంతో ప్రజాధనాన్ని దోచుకున్నారని సీఎం జగన్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు ప్రాంతంలో నిర్వహించిన వైఎస్సార్ కాపు నేస్తం నిధుల విడుదల కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబు అరెస్టు, జైలు అంశాలను ప్రస్తావించారు. తొలుత చంద్రబాబు పీఏ అడ్డంగా దొరికి పోయారని అన్నారు. ఆయన నుంచి కూపీలాగగా చంద్రబాబు అక్రమం బయట పడిందని చెప్పారు. కోర్టుల్లో 10 గంటల పాటు వాదనలు జరిగాయని, అయినప్పటికీ.. చంద్రబాబు ముఠాకు చంద్రబాబులో తప్పు కనిపించడం లేదని పేర్కొన్నారు. సాక్ష్యాలు, ఆధారాలు చూసిన తర్వాత అవి నిజమేనని నమ్మిన తర్వాతే.. చంద్రబాబును జైలుకు పంపించినట్టు తెలిపారు.
ఎన్ని దోపిడీలు చేసినా ఎన్ని వెన్ను పోట్లు పొడిచినా.. చంద్రబాబును రక్షించే వారు రక్షిస్తూనే ఉన్నారని సీఎం జగన్ అన్నారు. “లంచాలు తీసుకుంటే తప్పేంటని ఒకరు ప్రశ్నిస్తారు. ఒత్తిడి తెచ్చి మరీ సంతకాలు చేయించినా తప్పు కాదని పేర్కొంటారు“ అని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. ములాఖత్ ద్వారా మిలాఖత్ అయి.. కొందరు పొత్తు రాజకీయాలకు తెరదీశారంటూ పరోక్షంగా జనసేన అధినేత పవన్పైనా విమర్శలు గుప్పించారు.
స్కిల్ డెవలప్మెంట్లో ముందుగా ప్రభుత్వ సొమ్ము ఇవ్వొద్దని అధికారులు చెప్పినా వినకుండా బలవంతంగా చంద్రబాబు ఒత్తిడితోనే ప్రజాధనం దోచుకున్నారని అన్నారు. ప్రజలంతా ఈ విషయంలో ఆలోచన చేయాలని సీఎం జగన్ సూచించారు. వందల కోట్ల ప్రజాధనం ఎటు పోయిందో.. ఎవరి జేబుల్లోకి వెళ్లిందో ఆలోచన చేయాలని అన్నారు.
This post was last modified on September 16, 2023 2:50 pm
అమెరికా-ఇరాన్ యుద్ధం ఇప్పుడు కేవలం భూమి, ఆకాశానికే పరిమితం కాకుండా సముద్ర గర్భంలో ఉన్న ఇంటర్నెట్ వ్యవస్థపై కూడా నీలినీడలు…
రోటీన్ కు తగ్గట్లు వ్యవహరిస్తే కిక్ ఏముంటుంది? వినూత్న ఆలోచనలకు వేదికగా హైదరాబాద్ మహానగరం సాగుతోంది. ఇందులో భాగంగా సరికొత్త…
వసూళ్ల లెక్కల్లోనే కాదు చాలా విషయాల్లో దురంధర్ ది రివెంజ్ ఎవరికీ అందని రికార్డులు సొంతం చేసుకుంటోంది. భారతీయ సినీ…
నిన్న జరిగిన బ్యాండ్ మేళం సక్సెస్ మీట్ లో ఎక్కువ శాతం నటీనటులు, దర్శకుడు ఒక పాయింట్ మీద ఫిర్యాదు…
అనుకున్నది ఒకటి.. అవుతున్నది మరొకటి అన్నట్లుగా మారింది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీరు. ఇరాన్ తో మొదలు పెట్టిన యుద్ధాన్ని…
ప్రభాస్ లాంటి పాన్ ఇండియా సూపర్ స్టార్.. చిన్న, మిడ్ రేంజ్ సినిమాల గురించి ఒక ట్వీట్ వేసినా చాలు..…