టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును దొరికిన దొంగగా ఆయన పేర్కొన్నారు. అయితే, దొంగగా దొరికినప్పటికీ.. ఆయనకు ఉన్న బలమైన ముఠా ఈ విషయాన్ని జీర్ణించుకోలేక పోతోందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ నిబంధనలను పక్కన పెట్టి నకిలీ ఒప్పందంతో ప్రజాధనాన్ని దోచుకున్నారని సీఎం జగన్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు ప్రాంతంలో నిర్వహించిన వైఎస్సార్ కాపు నేస్తం నిధుల విడుదల కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబు అరెస్టు, జైలు అంశాలను ప్రస్తావించారు. తొలుత చంద్రబాబు పీఏ అడ్డంగా దొరికి పోయారని అన్నారు. ఆయన నుంచి కూపీలాగగా చంద్రబాబు అక్రమం బయట పడిందని చెప్పారు. కోర్టుల్లో 10 గంటల పాటు వాదనలు జరిగాయని, అయినప్పటికీ.. చంద్రబాబు ముఠాకు చంద్రబాబులో తప్పు కనిపించడం లేదని పేర్కొన్నారు. సాక్ష్యాలు, ఆధారాలు చూసిన తర్వాత అవి నిజమేనని నమ్మిన తర్వాతే.. చంద్రబాబును జైలుకు పంపించినట్టు తెలిపారు.
ఎన్ని దోపిడీలు చేసినా ఎన్ని వెన్ను పోట్లు పొడిచినా.. చంద్రబాబును రక్షించే వారు రక్షిస్తూనే ఉన్నారని సీఎం జగన్ అన్నారు. “లంచాలు తీసుకుంటే తప్పేంటని ఒకరు ప్రశ్నిస్తారు. ఒత్తిడి తెచ్చి మరీ సంతకాలు చేయించినా తప్పు కాదని పేర్కొంటారు“ అని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. ములాఖత్ ద్వారా మిలాఖత్ అయి.. కొందరు పొత్తు రాజకీయాలకు తెరదీశారంటూ పరోక్షంగా జనసేన అధినేత పవన్పైనా విమర్శలు గుప్పించారు.
స్కిల్ డెవలప్మెంట్లో ముందుగా ప్రభుత్వ సొమ్ము ఇవ్వొద్దని అధికారులు చెప్పినా వినకుండా బలవంతంగా చంద్రబాబు ఒత్తిడితోనే ప్రజాధనం దోచుకున్నారని అన్నారు. ప్రజలంతా ఈ విషయంలో ఆలోచన చేయాలని సీఎం జగన్ సూచించారు. వందల కోట్ల ప్రజాధనం ఎటు పోయిందో.. ఎవరి జేబుల్లోకి వెళ్లిందో ఆలోచన చేయాలని అన్నారు.
This post was last modified on September 16, 2023 2:50 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…