టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే, వయసు, హోదా రీత్యా ఆయనకు సరైన భద్రత కల్పించడం లేదని ఆయన కుటుంబం, ముఖ్యంగా బాబు సతీమణి భువనేశ్వరి తీవ్ర ఆందోళన, ఆవేదన చెందుతున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పారుకూడా. ఈ క్రమంలో తన భర్తను మరోసారి పరామర్శించేందుకు, ఆయనకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించేందుకు భువనేశ్వరి ప్రయత్నించారు.
ఈ క్రమంలో శుక్రవారం చంద్రబాబుతో ములాఖత్ కోరుతూ.. రాజమండ్రి జైలు అధికారులకు ఆమె అప్పీల్ చేసుకున్నారు. అయితే.. ఈ ములాఖత్ అప్పీల్ను రాజమండ్రి జైలు అధికారులు తిరస్కరించారు. మీకు ఛాన్స్ లేదు. అంటూ.. ఆమెకు తేల్చి చెప్పారు. దీంతో భువనేశ్వరి మరింత ఆవేదనలో మునిగిపోయారు. వాస్తవానికి చంద్రబాబును అరెస్టు చేసి., జైలుకు తరలించిన రోజు నుంచి నారా బ్రాహ్మణి, భువనేశ్వరి కూడా రాజమండ్రిలోనే ఒక హోటల్లోనే ఉంటున్నారు.
నిత్యం అక్కడి నుంచే చంద్రబాబు ఆహారం పంపిస్తున్నారు. అదేవిధంగా ఆయనకు మందులు కూడా అందిస్తున్నారు. నిబంధనల ప్రకారం ములాఖత్ కు అవకాశం ఉన్నా కాదనడంపై భువనేశ్వరి విచారం వ్యక్తం చేశారు. అయితే.. జైలు అధికారుల వివరణ మరో విధంగా ఉంది. ఇప్పటికి వారంలో మూడు సార్లు ములాఖత్లు అయిపోయాయని అంటున్నారు.
వాస్తవానికి రిమాండ్ ఖైదీలను వారంలో మూడు సార్లు ఎవరైనా(ఖైదీకి నచ్చినవారు) కలుసుకునే అవకాశం ఉంది. అయితే, ఇప్పటికే ఈ వారంలో ఒకసారి భువనేశ్వరి, నారా లోకేష్, బ్రాహ్మణి ములాఖత్ అయ్యారు. రెండోసారి చంద్రబాబు తరఫునవాదనలు వినిపిస్తున్న సిద్దార్థ లూథ్రా తదితర న్యాయవాదులు ములాఖత్ అయ్యారు. మూడోసారి జనసేన అధినేత పవన్, టీడీపీ నాయకుడు బాలకృష్ణ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్లు భేటీ అయ్యారు. ఈ క్రమంలో వారంలో మూడు సార్లు నిబంధన ప్రకారం మూడు ములాఖత్లు అయిపోయాయని, మళ్లీ సోమవారం వరకు ఎవరినీ అనుమతించేది లేదని జైలు అధికారులు వివరించారు.
This post was last modified on September 15, 2023 1:40 pm
ఇటీవలే విడుదలైన రవితేజ మాస్ జాతర పాటలో స్వర్గీయ చక్రి గొంతు విని సంగీత ప్రియులు ఆశ్చర్యపోయారు. అభిమానులు భావోద్వేగానికి…
తెలంగాణ ప్రభుత్వ తీరుపై సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరును…
ఏపీ సీఎం చంద్రబాబు విషయం గురించి చెబుతూ… మంత్రి నారాయణ ఒక మాట చెప్పారు. "మనం వచ్చే రెండు మూడేళ్ల…
అభిమానులు భయపడినట్టే జరిగేలా ఉంది. మే 9 హరిహర వీరమల్లు వస్తుందని గంపెడాశలతో ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి షాక్…
థియేటర్లలో జనాలు లేక అలో లక్ష్మణా అంటూ అల్లాడిపోతున్న బయ్యర్లకు ఊరట కలిగించేందుకు ఈ వారం రెండు చెప్పుకోదగ్గ సినిమాలు…
మెగాస్టార్ ఫాంటసీ మూవీ విశ్వంభర నుంచి ప్రమోషన్ పరంగా ఇప్పటిదాకా రెండు కంటెంట్స్ వచ్చాయి. మొదటిది టీజర్. దీనికొచ్సిన నెగటివిటీ…