Political News

భువ‌నేశ్వ‌రికి..చంద్ర‌బాబును క‌లిసే ఛాన్స్ ఇవ్వ‌ని అధికారులు

టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప్ర‌స్తుతం రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న విష‌యం తెలిసిందే. అయితే, వ‌య‌సు, హోదా రీత్యా ఆయ‌న‌కు స‌రైన భ‌ద్ర‌త క‌ల్పించ‌డం లేద‌ని ఆయ‌న కుటుంబం, ముఖ్యంగా బాబు స‌తీమ‌ణి భువ‌నేశ్వ‌రి తీవ్ర ఆందోళ‌న‌, ఆవేద‌న చెందుతున్నారు. ఈ విష‌యాన్ని ఆమె స్వ‌యంగా చెప్పారుకూడా. ఈ క్ర‌మంలో త‌న భ‌ర్త‌ను మ‌రోసారి ప‌రామ‌ర్శించేందుకు, ఆయ‌న‌కు అందుతున్న సౌక‌ర్యాల‌ను ప‌రిశీలించేందుకు భువ‌నేశ్వ‌రి ప్ర‌య‌త్నించారు.

ఈ క్ర‌మంలో శుక్ర‌వారం చంద్ర‌బాబుతో ములాఖ‌త్ కోరుతూ.. రాజ‌మండ్రి జైలు అధికారుల‌కు ఆమె అప్పీల్ చేసుకున్నారు. అయితే.. ఈ ములాఖ‌త్ అప్పీల్‌ను రాజ‌మండ్రి జైలు అధికారులు తిర‌స్క‌రించారు. మీకు ఛాన్స్ లేదు. అంటూ.. ఆమెకు తేల్చి చెప్పారు. దీంతో భువ‌నేశ్వ‌రి మ‌రింత ఆవేద‌న‌లో మునిగిపోయారు. వాస్త‌వానికి చంద్ర‌బాబును అరెస్టు చేసి., జైలుకు త‌ర‌లించిన రోజు నుంచి నారా బ్రాహ్మ‌ణి, భువ‌నేశ్వ‌రి కూడా రాజ‌మండ్రిలోనే ఒక హోట‌ల్‌లోనే ఉంటున్నారు.

నిత్యం అక్క‌డి నుంచే చంద్ర‌బాబు ఆహారం పంపిస్తున్నారు. అదేవిధంగా ఆయ‌న‌కు మందులు కూడా అందిస్తున్నారు. నిబంధనల ప్రకారం ములాఖత్ కు అవకాశం ఉన్నా కాదనడంపై భువనేశ్వరి విచారం వ్యక్తం చేశారు. అయితే.. జైలు అధికారుల వివ‌ర‌ణ మ‌రో విధంగా ఉంది. ఇప్ప‌టికి వారంలో మూడు సార్లు ములాఖ‌త్‌లు అయిపోయాయ‌ని అంటున్నారు.

వాస్త‌వానికి రిమాండ్ ఖైదీల‌ను వారంలో మూడు సార్లు ఎవ‌రైనా(ఖైదీకి న‌చ్చిన‌వారు) క‌లుసుకునే అవ‌కాశం ఉంది. అయితే, ఇప్ప‌టికే ఈ వారంలో ఒక‌సారి భువ‌నేశ్వ‌రి, నారా లోకేష్‌, బ్రాహ్మ‌ణి ములాఖ‌త్ అయ్యారు. రెండోసారి చంద్ర‌బాబు త‌ర‌ఫున‌వాద‌న‌లు వినిపిస్తున్న సిద్దార్థ లూథ్రా త‌దిత‌ర న్యాయ‌వాదులు ములాఖ‌త్ అయ్యారు. మూడోసారి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌, టీడీపీ నాయ‌కుడు బాల‌కృష్ణ‌, పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్‌లు భేటీ అయ్యారు. ఈ క్ర‌మంలో వారంలో మూడు సార్లు నిబంధ‌న ప్ర‌కారం మూడు ములాఖ‌త్‌లు అయిపోయాయ‌ని, మ‌ళ్లీ సోమ‌వారం వ‌ర‌కు ఎవ‌రినీ అనుమ‌తించేది లేద‌ని జైలు అధికారులు వివ‌రించారు.

This post was last modified on September 15, 2023 1:40 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ష‌ర్మిలమ్మా.. మీ పార్టీ దీన‌స్థితి చూడ‌మ్మా.. !

ఏపీ కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి నానాటికీ తీసిక‌ట్టుగా మారుతోందా? .. పార్టీ నాయ‌కులు దీన‌స్థితిలో ఉన్నారా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే…

19 minutes ago

ఇరాన్‌లో భారతీయ విద్యార్థులు.. ఇటు ప్రాణాలు, అటు పరీక్షలు

ఇరాన్‌లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…

35 minutes ago

బాలీవుడ్‌కు పొలిశెట్టి పంచ్

ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు న‌వీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన త‌న చివ‌రి చిత్రం అన‌గ‌న‌గా ఒక…

1 hour ago

శర్వానంద్ భోగికి అసలైన ఛాలెంజ్

2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…

2 hours ago

అయ్యన్నను ఓడించిన రఘురామ

రాజ‌కీయాల్లోనే కాదు.. ఆట‌ల్లోనూ త‌న సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు. అసెంబ్లీ బడ్జెట్ స‌మావేశాల…

2 hours ago

నంది అవార్డులంటే అంత చులకనా

ఇప్పుడు ఏపీలో ఇంకా వాటి పునరుద్ధరణ జరగలేదు, తెలంగాణలో గద్దర్ గా పేరు మారింది కానీ ఒకప్పుడు నంది అవార్డులంటే…

3 hours ago