బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఉరఫ్ చిన్నమ్మ కోపంతో రగిలిపోతున్నారట. ఆమె రక్తం 100 డిగ్రీల సెల్షియస్లో రగిలిపోతోందట. మాటల తూటాలు, విమర్శల శతఘ్నులతో వైసీపీ సర్కారుపై యుద్ధం చేయాలని ఉందట. కానీ, ఆమె అన్నింటినీ తమాయించుకుని.. పార్టీ అధిష్టానం గీసిన గీతలో తర్జన భర్జన పడుతున్నారట.- ఇదీ రాష్ట్ర బీజేపీ నేతల మధ్య జరుగుతున్న అంతర్గత చర్చ. ఏ ఇద్దరు కమలం పార్టీ నాయకులు కలిసినా.. ఇదే విషయం చర్చకు వస్తోంది.
సొంత బావ, టీడీపీ అధినేత చంద్రబాబును వైసీపీ సర్కారు జైల్లో పెట్టడం, సొంత సోదరి, చంద్రబాబు సతీమణి భువనేశ్వరి తన భర్త పరిస్థితిని కళ్లారా చూసి తల్లడిల్లడం, కన్నీటి పర్యంతం కావడం, సొంత సోదరుడు, ఎమ్మెల్యే, టీడీపీ నేత బాలయ్య స్వయంగా రోడ్డెక్కి నిరసనలు చేపట్టేందుకు రెడీ కావడం వంటి పరిణామాలు సహజంగానే రక్త సంబంధం ఉన్న పురందేశ్వరికి రాజకీయాలకు అతీతంగా ఆవేదన కలిగిస్తున్నాయని బీజేపీ నాయకులు చెబుతున్నారు.
అయితే, పార్టీ అధిష్టానం ఇప్పటి వరకు కూడా చంద్రబాబు అరెస్టు విషయంలో ఎలాంటి స్పందనా తెలియజేయలేదు. ఏ విధంగా ఈ విషయంపై స్పందించాలనేది కూడా రూట్ మ్యాప్ ఇవ్వలేదు. పైగా ఈ విషయంలో ఎవరూ తొందర పడొద్దు అని మాత్రం పై నుంచి సమాచారం రావడంతో ఏపీకి చెందిన బీజేపీ నాయ కులు ఎవరూ కూడా ఈ విషయంపై స్పందించలేదు. అయితే, బీజేపీకి దూరంగా.. టీడీపీకి దగ్గరవ్వాలని అనుకుంటున్న ఒకరిద్దరు మాత్రమే స్పందించారు.
కానీ, మరో వైపు పార్టీకి అధ్యక్షురాలిగా ఉన్న పురందేశ్వరికి మాత్రం ఈ విషయంపై తక్షణం స్పందించాల ని ఉన్నప్పటికీ.. వైసీపీ అక్రమ అరెస్టుపై గళం విప్పాలని, విరుచుకుపడాలని ఆమె శతథా ప్రయత్నిస్తు న్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, పార్టీ అధిష్టానం నుంచి ఎలాంటి సంకేతాలు రాకపోవడం, పైగా నందమూరి కుటుంబం యావత్తు కూడా తీవ్రమైన షాక్లో ఉండడంతో పురందేశ్వరి పరిస్థితి కక్కలేక మింగలేక.. అన్న విధంగా ఉందని బీజేపీ నాయకులు చెబుతుండడం గమనార్హం.
This post was last modified on September 15, 2023 1:01 pm
తను స్వతహాగా రష్యన్ అయినా.. పుట్టి పెరిగింది రష్యాలోనే అయినా.. పవన్ కళ్యాణ్ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది కథలు, సన్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…