బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఉరఫ్ చిన్నమ్మ కోపంతో రగిలిపోతున్నారట. ఆమె రక్తం 100 డిగ్రీల సెల్షియస్లో రగిలిపోతోందట. మాటల తూటాలు, విమర్శల శతఘ్నులతో వైసీపీ సర్కారుపై యుద్ధం చేయాలని ఉందట. కానీ, ఆమె అన్నింటినీ తమాయించుకుని.. పార్టీ అధిష్టానం గీసిన గీతలో తర్జన భర్జన పడుతున్నారట.- ఇదీ రాష్ట్ర బీజేపీ నేతల మధ్య జరుగుతున్న అంతర్గత చర్చ. ఏ ఇద్దరు కమలం పార్టీ నాయకులు కలిసినా.. ఇదే విషయం చర్చకు వస్తోంది.
సొంత బావ, టీడీపీ అధినేత చంద్రబాబును వైసీపీ సర్కారు జైల్లో పెట్టడం, సొంత సోదరి, చంద్రబాబు సతీమణి భువనేశ్వరి తన భర్త పరిస్థితిని కళ్లారా చూసి తల్లడిల్లడం, కన్నీటి పర్యంతం కావడం, సొంత సోదరుడు, ఎమ్మెల్యే, టీడీపీ నేత బాలయ్య స్వయంగా రోడ్డెక్కి నిరసనలు చేపట్టేందుకు రెడీ కావడం వంటి పరిణామాలు సహజంగానే రక్త సంబంధం ఉన్న పురందేశ్వరికి రాజకీయాలకు అతీతంగా ఆవేదన కలిగిస్తున్నాయని బీజేపీ నాయకులు చెబుతున్నారు.
అయితే, పార్టీ అధిష్టానం ఇప్పటి వరకు కూడా చంద్రబాబు అరెస్టు విషయంలో ఎలాంటి స్పందనా తెలియజేయలేదు. ఏ విధంగా ఈ విషయంపై స్పందించాలనేది కూడా రూట్ మ్యాప్ ఇవ్వలేదు. పైగా ఈ విషయంలో ఎవరూ తొందర పడొద్దు
అని మాత్రం పై నుంచి సమాచారం రావడంతో ఏపీకి చెందిన బీజేపీ నాయ కులు ఎవరూ కూడా ఈ విషయంపై స్పందించలేదు. అయితే, బీజేపీకి దూరంగా.. టీడీపీకి దగ్గరవ్వాలని అనుకుంటున్న ఒకరిద్దరు మాత్రమే స్పందించారు.
కానీ, మరో వైపు పార్టీకి అధ్యక్షురాలిగా ఉన్న పురందేశ్వరికి మాత్రం ఈ విషయంపై తక్షణం స్పందించాల ని ఉన్నప్పటికీ.. వైసీపీ అక్రమ అరెస్టుపై గళం విప్పాలని, విరుచుకుపడాలని ఆమె శతథా ప్రయత్నిస్తు న్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, పార్టీ అధిష్టానం నుంచి ఎలాంటి సంకేతాలు రాకపోవడం, పైగా నందమూరి కుటుంబం యావత్తు కూడా తీవ్రమైన షాక్లో ఉండడంతో పురందేశ్వరి పరిస్థితి కక్కలేక మింగలేక.. అన్న విధంగా ఉందని బీజేపీ నాయకులు చెబుతుండడం గమనార్హం.
This post was last modified on September 15, 2023 1:01 pm
ఎక్కువ సినిమాలు తీస్తున్న నిర్మాణ సంస్థలు ఏవంటే మనకు వెంటనే గుర్తొచ్చే బ్యానర్లు సితార, మైత్రి, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ…
ఎన్నికలు ముగిసిపోయి ఫలితాలు ఎలా ఉంటాయోననే ఆసక్తితో జనం ఎదురు చూస్తున్న వేళ కేవలం ఒక్క రోజు మద్దతు కోసం…
సినిమా చిన్నదైనా పెద్దదైనా ఫలితం ఎలా వచ్చినా థియేటర్ కు ఓటిటి మధ్య కనీస గ్యాప్ ఉండటం చాలా అవసరం.…
శాసనసభ ఎన్నికలలో అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికలు పరీక్షగా నిలుస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో…
ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత.. ఒకవైపు తీవ్రమైన హింస చెలరేగిన విషయం తెలిసిందే. ఇదెలా ఉన్నా అధికార, ప్రతిపక్ష నాయకులు…
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం.. పల్నాడు, తిరుపతి, తాడిపత్రి ప్రాంతాల్లో చెలరేగిన హింసపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం…