బీఆర్ఎస్ అభ్యర్ధులపై పార్టీ జనాలతో పాటు మామూలు జనాల్లో కూడా వ్యతిరేకత పెరిగిపోతోంది. కేసీయార్ అభ్యర్థులను ప్రకటించి ఇప్పటికి నెల రోజులవుతోంది. దీనివల్ల ఒకవైపు అభ్యర్ధులు కూడా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మామూలుగా ఎన్నికల ప్రక్రియ మొదలైన దగ్గర నుండి మహాయితే పోలింగ్ వరకు 20 రోజులుంటే ఎక్కువ. కాబట్టి ఖర్చుల విషయంలో ఏదో మ్యానేజ్ చేసుకుంటారు. కానీ ఇపుడు నాలుగు నెలల ముందే అభ్యర్థులను ప్రకటించేశారు.
దీనివల్ల ఏమైందంటే అభ్యర్థుల ఖర్చులు తడిసిమోపడవుతోంది. ఇంట్లో నుండి అడుగుబయటపెడితే చాలు ఖర్చులకు డబ్బులు ఎగిరిపోతున్నాయి. ఇలా ఎంతకాలం ఖర్చులు పెట్టాలో అర్ధంకాక అభ్యర్ధులు దిక్కులు చూస్తున్నారు. ఖర్చులను తట్టుకోలేక అభ్యర్ధులు నేతలు, క్యాడర్ కు దొరక్కుండా తప్పించుకుని తిరుగుతున్నారు. దాంతో నేతలు, క్యాడర్లో అభ్యర్ధులంటే వ్యతిరేకత పెరిగిపోతోంది. అసలే మామూలు జనాల్లో తీవ్ర వ్యతిరేకతుంది.
ఇవన్నీ చూస్తుంటే రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ అసలు మ్యాజిక్ ఫిగర్ దగ్గరకు వస్తుందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. 119 నియోజకవర్గాల్లో అధికారంలోకి రావాలంటే ఏ పార్టీకైనా లేదా కూటమికైనా కనీసం 61 సీట్లు దాటాలి. సంక్షేమపథకాలు సంపూర్ణంగా అమలుకాక, మంత్రులు, ఎంఎల్ఏలపై జనాల్లో వ్యతిరేకత పెరిగిపోతున్న నేపధ్యంలో హ్యాట్రిక్ కొట్టడం అనుమానమే అనే ప్రచారం పెరిగిపోతోంది. తెలంగాణా ఎన్నికలు వచ్చే ఏప్రిల్, మే నెలల్లో జరిగే అవకాశం ఉందని కేటీయార్ చేసిన ప్రకటనతో అభ్యర్ధులకు దిమ్మతిరిగింది. నాలుగు నెలల ముందు ప్రకటిస్తేనే అభ్యర్ధులు ఖర్చులు తట్టుకోలేక చేతులెత్తేస్తున్నారు.
అలాంటిది మరో నాలుగు నెలలు అంటే మొత్తం ఏడెనిమిది నెలలు నేతలు, క్యాడర్ కు ఖర్చులు పెట్టుకోవాలంటే అయ్యేపనికాదని చాలామంది అభ్యర్ధులకు అర్ధమైపోయింది. దాంతో జనాల్లో కూడా నెటిగివ్ పెరిగిపోతోంది. జమిలి ఎన్నికలని ఒకసారి, ముందస్తు ఎన్నికలని మరోసారి ఇలాగే కేంద్రం నుండి వస్తున్న లీకులతో కేసీయార్ తో పాటు యావత్ బీఆర్ఎస్ యంత్రాంగం అయోమయంలో పడిపోతున్నారు. ఇదంతా చూస్తుంటే ఇంతముందుగా అసలు టికెట్లు ఎందుకు ప్రకటించానా ? అని తల పట్టుకునే స్ధితికి వచ్చేస్తున్నారు కేసీయార్. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.
This post was last modified on September 15, 2023 12:59 pm
బాక్సాఫీస్ యమా నీరసంగా ఉంది. సరైన కొత్త సినిమాలు లేక చాలా థియేటర్లలో సగం షోలు కూడా పడటం లేదు.…
ప్రస్తుతం వైసీపీకి ఉన్న 11 నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల నాటికి 4 నియోజకవర్గాలు చేజారి పోవడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు.…
బాలకృష్ణ - కొరటాల శివ కాంబినేషన్ సినిమా ఫిక్సయిపోయింది. వచ్చే వారమే పూజా కార్యక్రమాలతో ఓపెనింగ్ జరగనుందని సమాచారం. అయితే…
వైసీపీ అధినేత జగన్ శుక్రవారం నుంచి యూరప్ పర్యటనకు వెళ్తున్నారు. దాదాపు 20 రోజులకు పైగానే ఆయన రాష్ట్రానికి దూరంగా…
తెలంగాణలో రెండు రోజుల క్రితం మొదలైన ఆర్టీసీ కార్మికుల సమ్మె అప్పుడే రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన…
బాలకృష్ణ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు అత్యంత భారీ బడ్జెట్ తో తీసిన సినిమా నిప్పురవ్వ. దానికైన ఖర్చు గురించి…