Political News

మ్యాజిక్ ఫిగరూ కష్టమేనా ?

బీఆర్ఎస్ అభ్యర్ధులపై పార్టీ జనాలతో పాటు మామూలు జనాల్లో కూడా వ్యతిరేకత పెరిగిపోతోంది. కేసీయార్ అభ్యర్థులను ప్రకటించి ఇప్పటికి నెల రోజులవుతోంది. దీనివల్ల ఒకవైపు అభ్యర్ధులు కూడా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మామూలుగా ఎన్నికల ప్రక్రియ మొదలైన దగ్గర నుండి మహాయితే పోలింగ్ వరకు 20 రోజులుంటే ఎక్కువ. కాబట్టి ఖర్చుల విషయంలో ఏదో మ్యానేజ్ చేసుకుంటారు. కానీ ఇపుడు నాలుగు నెలల ముందే అభ్యర్థులను ప్రకటించేశారు.

దీనివల్ల ఏమైందంటే అభ్యర్థుల ఖర్చులు తడిసిమోపడవుతోంది. ఇంట్లో నుండి అడుగుబయటపెడితే చాలు ఖర్చులకు డబ్బులు ఎగిరిపోతున్నాయి. ఇలా ఎంతకాలం ఖర్చులు పెట్టాలో అర్ధంకాక అభ్యర్ధులు దిక్కులు చూస్తున్నారు. ఖర్చులను తట్టుకోలేక అభ్యర్ధులు నేతలు, క్యాడర్ కు దొరక్కుండా తప్పించుకుని తిరుగుతున్నారు. దాంతో నేతలు, క్యాడర్లో అభ్యర్ధులంటే వ్యతిరేకత పెరిగిపోతోంది. అసలే మామూలు జనాల్లో తీవ్ర వ్యతిరేకతుంది.

ఇవన్నీ చూస్తుంటే రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ అసలు మ్యాజిక్ ఫిగర్ దగ్గరకు వస్తుందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. 119 నియోజకవర్గాల్లో అధికారంలోకి రావాలంటే ఏ పార్టీకైనా లేదా కూటమికైనా కనీసం 61 సీట్లు దాటాలి. సంక్షేమపథకాలు సంపూర్ణంగా అమలుకాక, మంత్రులు, ఎంఎల్ఏలపై జనాల్లో వ్యతిరేకత పెరిగిపోతున్న నేపధ్యంలో హ్యాట్రిక్ కొట్టడం అనుమానమే అనే ప్రచారం పెరిగిపోతోంది. తెలంగాణా ఎన్నికలు వచ్చే ఏప్రిల్, మే నెలల్లో జరిగే అవకాశం ఉందని కేటీయార్ చేసిన ప్రకటనతో అభ్యర్ధులకు దిమ్మతిరిగింది. నాలుగు నెలల ముందు ప్రకటిస్తేనే అభ్యర్ధులు ఖర్చులు తట్టుకోలేక చేతులెత్తేస్తున్నారు.

అలాంటిది మరో నాలుగు నెలలు అంటే మొత్తం ఏడెనిమిది నెలలు నేతలు, క్యాడర్ కు ఖర్చులు పెట్టుకోవాలంటే అయ్యేపనికాదని చాలామంది అభ్యర్ధులకు అర్ధమైపోయింది. దాంతో జనాల్లో కూడా నెటిగివ్ పెరిగిపోతోంది. జమిలి ఎన్నికలని ఒకసారి, ముందస్తు ఎన్నికలని మరోసారి ఇలాగే కేంద్రం నుండి వస్తున్న లీకులతో కేసీయార్ తో పాటు యావత్ బీఆర్ఎస్ యంత్రాంగం అయోమయంలో పడిపోతున్నారు. ఇదంతా చూస్తుంటే ఇంతముందుగా అసలు టికెట్లు ఎందుకు ప్రకటించానా ? అని తల పట్టుకునే స్ధితికి వచ్చేస్తున్నారు కేసీయార్. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.

This post was last modified on September 15, 2023 12:59 pm

Share

Recent Posts

హనుమాన్ అంశ్… అసలు ఈ బాబా కథేంటి?

హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్‌తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…

2 hours ago

యేషనాగుల డ్యాన్స్ ఓదెల నిర్ణయమే

నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…

3 hours ago

కాకాని ఆగమంటున్న విశ్వంభర ?

ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…

3 hours ago

ఎపిక్ మీద నెగిటివిటీ ఎందుకంటే

నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…

4 hours ago

5జీ రావడం లేదని టెక్నీషియన్‌ను కట్టేశారా?

ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…

5 hours ago

కాళీమాత గుడిలో చేపల కూర తిన్న బీజేపీ సీఎం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…

5 hours ago