నందమూరి కళ్యాణ్ రామ్ నుండి వస్తున్న పాన్ ఇండియా మూవీ ‘డెవిల్’. సుభాష్ చంద్ర బోస్ కథతో సీక్రెట్ ఏజెంట్ అనే క్యాప్షన్ తో పీరియాడిక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి తాజాగా దర్శకుడు అవుట్ అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు పుష్ప రైటర్ శ్రీకాంత్ విస్సా కథను అందించగా నవీన్ చేతిలో ప్రాజెక్ట్ పెట్టారు నిర్మాత అభిషేక్ నామ. దర్శకుడు నవీన్ కి విజువల్ ఎఫెక్ట్స్ లో మంచి అనుభవం ఉంది. ‘అవతార్’ వంటి హాలివుడ్ టాప్ సినిమాలకు వర్క్ చేశాడు. దీంతో ఈ ప్రాజెక్ట్ కి అతనే రైట్ ఛాయిస్ అని హీరో , నిర్మాత భావించారు. చకచకా షూటింగ్ జరుపుకుంది.
తన మీద పెట్టుకున్న నమ్మకంతో నవీన్ ఇప్పటి వరకూ బెస్ట్ వర్క్ ఇచ్చాడట. నవీన్ ఈ సినిమాతో పెద్ద దర్శకుడు అవుతాడని టీం బయట గట్టిగా చెప్పుకున్నారు. కానీ లోలోపల ఏమైందో తెలియదు కానీ ఉన్నపళంగా నిర్మాత అభిషేక్ నామా ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ నుండి దర్శకుడిని తప్పించారని తెలుస్తుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అంతా నిర్మాతే దగ్గరుండి చూసుకుంటున్నారట.
అందుకే రీసెంట్ గా విడుదల చేసిన హీరోయిన్ పోస్టర్ మీద కూడా దర్శకుడి పేరు తొలగించి ఆ ప్లేస్ లో అభిషేక్ పిక్చర్స్ ఫిల్మ్ అంటూ నిర్మాణ సంస్థ పేరు పెట్టారని తెలుస్తుంది. ఏదేమైనా ప్రతీ సినిమాకు నిర్మాత -దర్శకుడికి ఏవో క్రియేటివ్ డిఫరెన్స్ లు , బడ్జెట్ ఇష్యూలు ఉంటూనే ఉంటాయి. కానీ ప్రాజెక్ట్ పూర్తయ్యే క్రమంలో రిలీజ్ కి దగ్గర ఉండగా ఇలా దర్శకుడిని నిర్మాత ఎందుకు దూరం పెట్టినట్టు ? ఈ ఇద్దరి వివాదంలో హీరో కళ్యాణ్ రామ్ కలుగ జేసుకోలేకపోయారా ? అంటూ ఇండస్ట్రీలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.
This post was last modified on September 14, 2023 4:39 pm
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…