ఈనెల 16వ తేదీన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీకి వెళుతున్నట్లు సమాచారం. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో అపాయిట్మెంట్ కోసం ట్రై చేస్తున్నారు. అపాయిట్మెంట్ ఇస్తే అమిత్ షా తో భేటీ అవుతారు. లేకపోతే పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో, ఏపీ బీజేపీ ఇన్చార్జి, కేంద్రమంత్రి మురళీధరన్ తో సమావేశమవ్వాలని పవన్ డిసైడ్ అయినట్లు సమాచారం. పవన్ ఢిల్లీ పర్యటన ఉద్దేశ్యం ఏమిటంటే చంద్రబాబునాయుడు అరెస్టు, టీడీపీతో పొత్తు విషయం ఫైనల్ చేసుకోవటమే అని జనసేన వర్గాలు చెబుతున్నాయి.
ఎప్పటినుండో బీజేపీ, టీడీపీ పొత్తు కోసం పవన్ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అయితే పవన్ ఎన్నిసార్లు ప్రయత్నించినా బీజేపీ అగ్రనేతల నుండి ఎలాంటి సానుకూలత కనబడటంలేదు. ఈ విషయమై పవన్ చాలాసార్లు తీవ్ర అసహనాన్ని వ్యక్తంచేశారు. అయితే గతంలో లాగ ఇపుడు పరిస్ధితులు లేవని ఏదో ఒకటి తేల్చుకోవాలని అనుకున్నారట.
అందుకనే రాబోయే ఎన్నికల్లో బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తు పెట్టుకోవాలని బలంగా తన మనసులోని మాటను చెప్పాలని ఫిక్సయ్యారట. పైగా అరెస్టు తర్వాత చంద్రబాబుకు జనాల్లో బాగా సింపతి వచ్చేసిందని ఈ నేపధ్యంలో టీడీపీతో పొత్తు పెట్టుకుంటే వచ్చే లాభాలను కమలంపార్టీ పెద్దలకు వివరించి చెప్పాలని పవన్ అనుకుంటున్నారట. ఏ కారణం వల్లయినా బీజేపీ పెద్దలు టీడీపీతో కలిసే విషయమై ఆసక్తి చూపకపోతే తన భవిష్యత్తు ఏమిటో తాను స్పష్టంచేయటానికి కూడా పవన్ రెడీ అయినట్లు సమాచారం.
అవసరమైతే బీజేపీని వదిలేసి టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని పవన్ డిసైడ్ అయ్యారు. బీజేపీని వదిలేస్తానని చెప్పలేదు కానీ టీడీపీతో పొత్తుంటుందని అనేక బహిరంగసభల్లో పవన్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ఒకవైపు జమిలి ఎన్నికలంటున్నారు, ముందస్తు ఎన్నికలంటున్న నేపధ్యంలో ఇప్పుడు కూడా ఏ విషయం నిర్ణయించుకోకపోతే తాను కూడా నష్టపోవటం ఖాయమని పవన్ డిసైడ్ అయ్యారట. అందుకనే తాడో పేడో తేల్చుకోవటానికే పవన్ ఢిల్లీకి వెళుతున్నట్లు సమాచారం. మరి ఢిల్లీ పర్యటన ఏమవుతుందో చూడాల్సిందే.
This post was last modified on September 14, 2023 12:09 pm
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…