Political News

కీలక సమయంలో ఢిల్లీకి పవన్

ఈనెల 16వ తేదీన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీకి వెళుతున్నట్లు సమాచారం. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో అపాయిట్మెంట్ కోసం ట్రై చేస్తున్నారు. అపాయిట్మెంట్ ఇస్తే అమిత్ షా తో భేటీ అవుతారు. లేకపోతే పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో, ఏపీ బీజేపీ ఇన్చార్జి, కేంద్రమంత్రి మురళీధరన్ తో సమావేశమవ్వాలని పవన్ డిసైడ్ అయినట్లు సమాచారం. పవన్ ఢిల్లీ పర్యటన ఉద్దేశ్యం ఏమిటంటే చంద్రబాబునాయుడు అరెస్టు, టీడీపీతో పొత్తు విషయం ఫైనల్ చేసుకోవటమే అని జనసేన వర్గాలు చెబుతున్నాయి.

ఎప్పటినుండో బీజేపీ, టీడీపీ పొత్తు కోసం పవన్ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అయితే పవన్ ఎన్నిసార్లు ప్రయత్నించినా బీజేపీ అగ్రనేతల నుండి ఎలాంటి సానుకూలత కనబడటంలేదు. ఈ విషయమై పవన్ చాలాసార్లు తీవ్ర అసహనాన్ని వ్యక్తంచేశారు. అయితే గతంలో లాగ ఇపుడు పరిస్ధితులు లేవని ఏదో ఒకటి తేల్చుకోవాలని అనుకున్నారట.

అందుకనే రాబోయే ఎన్నికల్లో బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తు పెట్టుకోవాలని బలంగా తన మనసులోని మాటను చెప్పాలని ఫిక్సయ్యారట. పైగా అరెస్టు తర్వాత చంద్రబాబుకు జనాల్లో బాగా సింపతి వచ్చేసిందని ఈ నేపధ్యంలో టీడీపీతో పొత్తు పెట్టుకుంటే వచ్చే లాభాలను కమలంపార్టీ పెద్దలకు వివరించి చెప్పాలని పవన్ అనుకుంటున్నారట. ఏ కారణం వల్లయినా బీజేపీ పెద్దలు టీడీపీతో కలిసే విషయమై ఆసక్తి చూపకపోతే తన భవిష్యత్తు ఏమిటో తాను స్పష్టంచేయటానికి కూడా పవన్ రెడీ అయినట్లు సమాచారం.

అవసరమైతే బీజేపీని వదిలేసి టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని పవన్ డిసైడ్ అయ్యారు. బీజేపీని వదిలేస్తానని చెప్పలేదు కానీ టీడీపీతో పొత్తుంటుందని అనేక బహిరంగసభల్లో పవన్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ఒకవైపు జమిలి ఎన్నికలంటున్నారు, ముందస్తు ఎన్నికలంటున్న నేపధ్యంలో ఇప్పుడు కూడా ఏ విషయం నిర్ణయించుకోకపోతే తాను కూడా నష్టపోవటం ఖాయమని పవన్ డిసైడ్ అయ్యారట. అందుకనే తాడో పేడో తేల్చుకోవటానికే పవన్ ఢిల్లీకి వెళుతున్నట్లు సమాచారం. మరి ఢిల్లీ పర్యటన ఏమవుతుందో చూడాల్సిందే.

Satya

Recent Posts

సలార్ ఇవ్వనిది లెనిన్ అందించింది

రిలీజైన రోజు నుంచి వీకెండ్ దాకా చెడుగుడు ఆడేసిన లెనిన్ ఎట్టకేలకు అఖిల్ కెరీర్ లో ఒక హిట్టుని చేర్చేసింది.…

2 hours ago

శేఖ‌ర్ మాస్ట‌ర్ వెర్స‌స్ జానీ మాస్ట‌ర్

టాలీవుడ్ అగ్ర‌శ్రేణి డ్యాన్స్ మాస్ట‌ర్లు ఇద్ద‌రి మ‌ధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్ట‌ర్, శేఖ‌ర్ మాస్ట‌ర్ మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చోటు…

4 hours ago

పృథ్విరాజ్ టార్గెట్ మిస్ అయ్యిందా

మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…

4 hours ago

‘మంగాపురం’లో ఏదో విషయం ఉంది

ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…

5 hours ago

వైసీపీ నేతలు రేవంత్ రెడ్డిని దూషించడమేంటి?

ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రశ్న రావణ్ సహా పలువురు…

6 hours ago

కత్తి కొనల మీద ‘ప్యారడైజ్’ పరుగులు

టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…

6 hours ago