Political News

కీలక సమయంలో ఢిల్లీకి పవన్

ఈనెల 16వ తేదీన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీకి వెళుతున్నట్లు సమాచారం. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో అపాయిట్మెంట్ కోసం ట్రై చేస్తున్నారు. అపాయిట్మెంట్ ఇస్తే అమిత్ షా తో భేటీ అవుతారు. లేకపోతే పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో, ఏపీ బీజేపీ ఇన్చార్జి, కేంద్రమంత్రి మురళీధరన్ తో సమావేశమవ్వాలని పవన్ డిసైడ్ అయినట్లు సమాచారం. పవన్ ఢిల్లీ పర్యటన ఉద్దేశ్యం ఏమిటంటే చంద్రబాబునాయుడు అరెస్టు, టీడీపీతో పొత్తు విషయం ఫైనల్ చేసుకోవటమే అని జనసేన వర్గాలు చెబుతున్నాయి.

ఎప్పటినుండో బీజేపీ, టీడీపీ పొత్తు కోసం పవన్ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అయితే పవన్ ఎన్నిసార్లు ప్రయత్నించినా బీజేపీ అగ్రనేతల నుండి ఎలాంటి సానుకూలత కనబడటంలేదు. ఈ విషయమై పవన్ చాలాసార్లు తీవ్ర అసహనాన్ని వ్యక్తంచేశారు. అయితే గతంలో లాగ ఇపుడు పరిస్ధితులు లేవని ఏదో ఒకటి తేల్చుకోవాలని అనుకున్నారట.

అందుకనే రాబోయే ఎన్నికల్లో బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తు పెట్టుకోవాలని బలంగా తన మనసులోని మాటను చెప్పాలని ఫిక్సయ్యారట. పైగా అరెస్టు తర్వాత చంద్రబాబుకు జనాల్లో బాగా సింపతి వచ్చేసిందని ఈ నేపధ్యంలో టీడీపీతో పొత్తు పెట్టుకుంటే వచ్చే లాభాలను కమలంపార్టీ పెద్దలకు వివరించి చెప్పాలని పవన్ అనుకుంటున్నారట. ఏ కారణం వల్లయినా బీజేపీ పెద్దలు టీడీపీతో కలిసే విషయమై ఆసక్తి చూపకపోతే తన భవిష్యత్తు ఏమిటో తాను స్పష్టంచేయటానికి కూడా పవన్ రెడీ అయినట్లు సమాచారం.

అవసరమైతే బీజేపీని వదిలేసి టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని పవన్ డిసైడ్ అయ్యారు. బీజేపీని వదిలేస్తానని చెప్పలేదు కానీ టీడీపీతో పొత్తుంటుందని అనేక బహిరంగసభల్లో పవన్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ఒకవైపు జమిలి ఎన్నికలంటున్నారు, ముందస్తు ఎన్నికలంటున్న నేపధ్యంలో ఇప్పుడు కూడా ఏ విషయం నిర్ణయించుకోకపోతే తాను కూడా నష్టపోవటం ఖాయమని పవన్ డిసైడ్ అయ్యారట. అందుకనే తాడో పేడో తేల్చుకోవటానికే పవన్ ఢిల్లీకి వెళుతున్నట్లు సమాచారం. మరి ఢిల్లీ పర్యటన ఏమవుతుందో చూడాల్సిందే.

Satya

Recent Posts

ఇక కొడాలి నాని వంతు

వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, ఫైర్‌బ్రాండ్ కొడాలి నానిపై 2021లో న‌మోదైన కేసు విచార‌ణ‌కు తాజాగా ప్రభుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.…

2 minutes ago

అత్తెసరు వసూళ్లతో ముంచేసేలా ఉంది

హీరోయిన్ కంగనా రౌనత్ టైం ఏ మాత్రం బాలేదు. పట్టిందల్లా ప్లాస్టిక్ అన్న తరహాలో ఏ జానర్ సినిమా చేసినా…

31 minutes ago

‘చంద్రబాబు భరోసానిచ్చారు… మాకు అది చాలు’

ఏపీ సీఎం చంద్రబాబును విజయవాడలోని కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ కుటుంబ సభ్యులు కలిసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మీడియాతో…

2 hours ago

త్రినేత్రుడి కన్నెర్రకు ప్రతిరూపం ‘నాగబంధం’

విజువల్ ఎఫెక్ట్స్ మీద ఆధారపడి సినిమాలు తీయడం చాలా రిస్క్. కొన్నిసార్లు ఇవి తీసుకునే సమయం హీరోల కెరీర్ల మీద…

4 hours ago

బాలయ్యతో కాజల్… గ్లామర్ కు దూరంగా పవర్ఫుల్ రోల్

బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న NBK111 ప్రాజెక్టులో స్టార్ క్యాస్ట్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉంది.…

5 hours ago

ఈ సమయంలో మౌనమేల షర్మిల గారు?

విజయవాడలో యువకుడి అదృశ్యం కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తిస్తోంది. రాజకీయ, కులం రంగు పులుముకున్న ఈ వ్యవహారం…

5 hours ago