Political News

ఈ అరెస్టుతో బాబుకు జగన్ మేలు: గోనె

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు వ్యవహారాన్ని ఏపీ, తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా పలువురు రాజకీయ నేతలు ఖండించిన సంగతి తెలిసిందే. చంద్రబాబును అరెస్టు చేసిన విధానాన్ని పలువురు నేతలు తప్పుబట్టారు. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై తెలంగాణ పొలిటిషియన్, మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు స్పందించారు. ప్రాథమిక ఆధారాలు ఉండటంతోనే చంద్రబాబును అరెస్ట్ చేశామని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పడం సిగ్గుచేటని దుయ్యబట్టారు.

అయితే, టీడీపీకి చంద్రబాబు అరెస్ట్ తప్పకుండా మేలు చేస్తుందని, రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు. ఇక, ఏపీలో గత ఎన్నికలలో వైసీపీ రికార్డు విజయం సాధించిందని, ఆ రికార్డును టీడీపీ బద్దలు కొట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు రాబోయే ఎన్నికల్లో టీడీపీకి 151 సీట్లు మెజార్టీ తెప్పించి మరోసారి ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు. వాస్తవానికి ఈ అరెస్టుతో చంద్రబాబు నెత్తిన జగన్ పాలు పోశాడని అన్నారు.

ఇక, తెలంగాణ రాజకీయాల్లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై కూడా గోనె ప్రకాష్ షాకింగ్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి నాశనం చేస్తున్నాడని మండిపడ్డారు. ఇక, తెలంగాణ కాంగ్రెస్ తరఫున పోటీ చేయాలని భావిస్తున్న వైఎస్ షర్మిలను కూడా రాకుండా రేవంత్ అడ్డుకుంటున్నారని ఆరోపించారు. 2014లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వైసీపీ నుంచి గెలిచారని, ఆయనను కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు. డబ్బులు ఇచ్చాడు కాబట్టే పొంగులేటిని కాంగ్రెస్ లోకి తీసుకున్నాడని సంచలన ఆరోపణలు చేశారు.

This post was last modified on September 13, 2023 10:08 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

59 minutes ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

2 hours ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

2 hours ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

3 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

3 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

4 hours ago