Political News

చంద్రబాబు సీఐడీ కస్టడీకి హైకోర్టు బ్రేక్

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును హౌస్ కస్టడీకి అప్పగించాలని ఆయన తరపు లాయర్లు విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే, ఆ పిటిషన్ ను డిస్మిస్ చేస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే చంద్రబాబుపై ఎఫ్ ఐ ఆర్ ను క్వాష్ చేయాలని కోరుతూ ఏపీ హైకోర్టులో మంగళవారం నాడు మరో పిటిషన్ దాఖలు అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆ క్వాష్ పిటిషన్ పై విచారణను ఈ నెల 19కి హైకోర్టు వాయిదా వేసింది.

ఈ క్రమంలోనే ఈ క్వాష్ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ సిఐడి అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా సిఐడి కస్టడీకి సోమవారం వరకు చంద్రబాబును అప్పగించవద్దని చంద్రబాబు లాయర్లు కోరారు. వారితో ఏకీభవించిన హైకోర్టు….సోమవారం వరకు చంద్రబాబు కస్టడీ కోరవద్దని సీఐడీని ఆదేశించింది. ఈ వ్యవహారంపై పూర్తి వాదనలు వినాల్సి ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. చంద్రబాబు రిమాండ్ ఉత్తర్వులు, ఎఫ్ఐఆర్ క్వాష్ చేయాలంటూ హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

ఏపీ సీఐడీ తరఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించగా, చంద్రబాబు తరఫున సిద్ధార్థ్ లూథ్రా, దమ్మాలపాటి శ్రీనివాస్ తదితరులు వాదనలు వినిపించారు. మరోవైపు, చంద్రబాబుకు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ కూడా హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు అయింది. ఆ పిటిషన్ పై కూడా ఈ రోజు విచారణ జరగనుంది. దాంతోపాటు, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబును రిమాండ్ రిపోర్టు రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై కూడా ఈ రోజే హైకోర్టులో విచారణ జరగనుంది. మంగళవారం వరకు సీఐడీ కస్టడీ లేకపోవడంతో చంద్రబాబుకు హైకోర్టులో భారీ ఊరట
లభించినట్లయింది.

This post was last modified on September 13, 2023 11:59 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మలయాళంలో రేవంత్ సినిమా ఎలా నడుస్తోంది?

అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…

2 hours ago

ఆ సీక్వెల్… నా వల్ల కాదు బాబోయ్

అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…

4 hours ago

నాడూ మూడే!… నేడూ మూడే!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…

7 hours ago

మోడీ ముందు జ‌గ‌న్ మ‌రింత‌ ప‌లుచ‌న‌!

ప్ర‌స్తుతం ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజ‌కీయాల‌కు కూడా ప్ర‌ధాని మోడీ పెద్ద‌దిక్కుగా మారారన్నది వాస్త‌వం. ఆయ‌న‌ను…

8 hours ago

రాముడి పాత్ర వద్దన్న రణబీర్

ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్‌లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…

9 hours ago

దళిత క్రైస్తవుల విషయంలో జగన్ కన్నా షర్మిలే బెటర్?

వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్‌పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…

9 hours ago