Political News

ముస్లింల ఓట్లు ఎటువైపు ?

ఇపుడిదే కాస్త సస్పెన్సుగా మారింది. ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో చాలా సామాజికవర్గాల ఓట్లు ఎంతో కీలకంగా మారబోతున్నాయి. ఇందులో భాగంగానే ముస్లిం మైనారిటీల ఓట్లు కూడా కీలకపాత్ర పోషించబోతోంది. ఒక అంచనా ప్రకారం తెలంగాణాలో ముస్లింల ఓట్లు 40 నియోజకవర్గాల్లో తీవ్ర ప్రభావం చూపబోతున్నాయి. రాష్ట్ర జనాభాలో ముస్లింలు 15 శాతం ఉన్నారు. వీళ్ళ ఓట్లకోసమే కేసీయార్ మైనారిటిలకు లక్ష రూపాయల సాయం అనే పథకాన్ని పట్టుకొచ్చారు.

అయితే పథకాన్ని అయితే ఆర్భాటంగా ప్రకటించారు కానీ అమలులోకి వచ్చేసరికి అంత సజావుగా సాగటంలేదు. దీంతో చాలామంది పేద ముస్లింల్లో మండుతోంది. హడావుడిగా రాబోయే ఎన్నికలకోసమే కేసీయార్ పథకాన్ని ప్రకటించారనే భావనలో ఉన్నారు. ఎందుకంటే ఆమధ్య జరిగిన హుజూరాబాద్ ఉపఎన్నికల సమయంలోనే దళితబంధు పథకాన్ని ప్రకటించారు. పథకాన్ని అయితే ప్రకటించారు కానీ సక్రమంగా అమలుకాలేదు. దాంతో మండిపోయిన దళితులు ఎలాంటి మొహమాటం లేకుండా ఈటల రాజేందర్ను గెలిపించారు.

దాంతో దళితబంధు పథకం రాష్ట్రంలో ఎక్కడ సక్రమంగా అమలవుతోందో ఎవరికీ తెలీదు. ఇపుడు మైనారిటి ఆర్ధికసాయం పథకం కూడా అంతేనా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే తెలంగాణా ఏర్పడకముందు ముస్లింలు ఎక్కువగా కాంగ్రెస్ తోనే ఉన్నారు. ఓల్డ్ సిటిలో మెజారిటి ముస్లింలు ఎంఐఎంకు అండగా నిలుస్తున్నారు. ప్రత్యేక తెలంగాణా తర్వాత ముస్లింల ఓటుబ్యాంకు బీఆర్ఎస్ కు ఫిష్టయ్యింది. అప్పటినుండి కాంగ్రెస్ ఇబ్బంది పడుతోంది.

అయితే రాబోయే ఎన్నికలకు సంబంధించి కేసీయార్ మూడు టికెట్లను మాత్రమే ముస్లింలకు కేటాయించారు. ముస్లిం సంఘాల అంచనాల ప్రకారం బీఆర్ఎస్ కనీసం ఎనిమిది మందికి టికెట్లు ఇస్తుందని భావించారు. కానీ కేసీయార్ అలా చేయలేదు. దాంతో కాంగ్రెస్ ఏమి చేస్తుందనే విషయమై చర్చలు పెరిగిపోతున్నాయి. మైనారిటీల కోసం కాంగ్రెస్ ప్రత్యేకంగా చేసిన డిక్లరేషన్ తో ముస్లింల ఓట్లు తిరిగి కాంగ్రెస్ వైపు మళ్ళుతాయని సీనియర్లు ఆశిస్తున్నారు. మరి ముస్లింల ఓట్లు కాంగ్రెస్ ఇవ్వబోయే టికెట్ల పైనే ఆధారపడుందని అందరికీ తెలిసిందే. చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.

This post was last modified on September 13, 2023 1:24 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

చంద్ర‌బాబు పేరిట త‌ప్పుడు ప్ర‌చారం.. స్ట్రాంగ్ వార్నింగ్‌

ఏపీలో పోలింగ్ ప్ర‌క్రియ‌కు మ‌రికొన్ని గంట‌ల ముందు.. సంచ‌ల‌నం చోటు చేసుకుంది. కూట‌మి పార్టీల ముఖ్య నేత‌, టీడీపీ అధినేత…

13 hours ago

జ‌గ‌న్ చేయాల్సిన ప‌ని.. బాబు చేస్తున్నారు..

ఏపీలో చిత్ర‌మైన ప‌రిస్థితి క‌నిపిస్తోంది. శ‌నివారం సాయంత్రంతో ఎన్నిక‌ల ప్ర‌చారం ముగిసిపోవ‌డంతో నాయ‌కులు, పార్టీల అధినే త‌లు ఎక్క‌డిక‌క్క‌డ సేద…

14 hours ago

బెట్టింగ్ లో రూ.2 కోట్లు .. కొట్టిచంపిన తండ్రి

బెట్టింగ్‌లో రూ.2 కోట్లు పోగొట్టిన కుమారుడిని తండ్రి హతమార్చిన ఘటన మెదక్‌ జిల్లాలోని చిన్నశంకరంపేట మండలం బగిరాత్‌పల్లిలో చోటు చేసుకుంది.…

14 hours ago

పవన్‌కు ప్రాణం, జగన్‌కు ఓటు.. మారుతుందా?

ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుల్లో యూత్‌లో పవన్‌కు ఉన్నది మామూలు క్రేజ్ కాదు. సినిమాల్లో సూపర్ స్టార్ ఇమేజ్ వల్ల…

15 hours ago

జగన్‌ సీట్లపై పీకే లేటెస్ట్ అంచనా

ఆంధ్రప్రదేశ్‌లో గత పర్యాయం వైఎస్సార్ కాంగ్రెస్ 151 సీట్లతో ఘనవిజయం సాధించడంలో ఆ పార్టీకి వ్యూహకర్తగా పని చేసిన ప్రశాంత్…

16 hours ago

ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్‌

దాదాపు 55 రోజుల పాటు అవిశ్రాంతంగా పార్ల‌మెంటు ఎన్నిక‌ల ప్ర‌చారం చేసిన తెలంగాణ ముఖ్య‌మంత్రి, కాంగ్రెస్ పీసీసీచీఫ్ ఎనుముల రేవంత్…

17 hours ago