Political News

రేపు హైకోర్టులో చంద్రబాబు రిమాండ్ పై వాదనలు

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో సిఐడి పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విజయవాడ ఏసీబీ కోర్టులో వాదోపవాదాల అనంతరం చంద్రబాబుకు జ్యుడీషియల్ రిమాండ్ విధించి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. చంద్రబాబు వయసు, హోదా, భద్రతా కారణాలను దృష్టిలో పెట్టుకొని ఆయనకు హౌస్ రిమాండ్ విధించాలంటూ వాదనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఆ వ్యవహారం పై ఈ రోజు తీర్పు వెలువడే అవకాశముంది.

ఇదిలా ఉండగానే తాజాగా చంద్రబాబుకు ఏసీబీ కోర్టు విధించిన రిమాండ్ ను సవాలు చేస్తూ ఏపీ హైకోర్టులో చంద్రబాబు తరఫున లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు తరఫున మాజీ అడ్వకేట్ జనరల్, సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు అరెస్ట్ అక్రమమని, గవర్నర్ అనుమతి లేకుండానే ఆయనను ఎలా అరెస్ట్ చేస్తారని దమ్మాలపాటి తన పిటిషన్ లో ప్రశ్నించారు. అంతేకాకుండా, మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబును అరెస్ట్ చేసిన విధానంపై కూడా దమ్మాలపాటి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు

ఈ క్రమంలోనే ఆ లంచ్ మోషన్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు కూడా జారీ చేసింది. ఆ పిటిషన్ పై బుధవారం నాడు విచారణ చేపడతామని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో, దాదాపుగా రేపు చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ ఇచ్చే అవకాశం ఉందని ఊహగానాలు వస్తున్నాయి.‌ ఏది ఏమైనా హైకోర్టులో చంద్రబాబుకు ఊరట లబిస్తుందని ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు భావిస్తున్నారు.

This post was last modified on September 12, 2023 2:25 pm

Share

Recent Posts

హనుమాన్ అంశ్… అసలు ఈ బాబా కథేంటి?

హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్‌తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…

39 minutes ago

యేషనాగుల డ్యాన్స్ ఓదెల నిర్ణయమే

నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…

56 minutes ago

కాకాని ఆగమంటున్న విశ్వంభర ?

ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…

2 hours ago

ఎపిక్ మీద నెగిటివిటీ ఎందుకంటే

నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…

3 hours ago

5జీ రావడం లేదని టెక్నీషియన్‌ను కట్టేశారా?

ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…

3 hours ago

కాళీమాత గుడిలో చేపల కూర తిన్న బీజేపీ సీఎం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…

3 hours ago