Political News

చంద్రబాబు లాయర్లపై జడ్జి అసహనం.. విచారణ వాయిదా

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును 14 రోజుల రిమాండ్ విధిస్తూ రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చంద్రబాబును హౌస్ రిమాండ్ కు తరలించాలని ఆయన తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా విజయవాడలో ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే ఈ పిటిషన్ పై ప్రభుత్వ తరపు న్యాయవాదులు శ్రీరామ్, పొన్నవోలు సుధాకర్ లు వాదనలు వినిపించారు. ఈ క్రమంలోనే తాజాగా ఆ పిటిషన్ పై విచారణను ఏసీబీ కోర్టు జడ్జి హిమబిందు రేపటికి వాయిదా వేశారు.

అంతకుముందు, చంద్రబాబు తరఫు లాయర్లపై న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. ఈ కేసుకు సంబంధించిన అన్ని డాక్యమెంట్లు సీఐడీ కార్యాలయంలో ఉన్నాయని, వాటి పరిశీలన కోసం అనుమతించాలని సెక్షన్ 207 CRPC కింద చంద్రబాబు తరఫు లాయర్లు పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ దాఖలు చేసిన వెంటనే వాదనలు వినిపించేందుకు లూథ్రా ప్రయత్నించారు. ఈ క్రమంలో లూథ్రాపై జడ్జి హిమబిందు అసహనం వ్యక్తం చేశారు. వరుసగా పిటిషన్లు దాఖలు చేయడం, ఆ వెంటనే వాదనలు వినిపించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వరుస పిటిషన్లు వేయడం వల్ల కోర్టు సమయం వృథా అవుతోందని అన్నారు. ఆర్డర్ ఇచ్చే సమయానికి మరో పిటిషన్ వేయడంపై అసహనం వ్యక్తం చేశారు.

This post was last modified on September 11, 2023 9:17 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జీతం తీసుకొని సభకు రారా కేసీఆర్ సారు

రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం.. బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు కేసీఆర్‌.. ప్ర‌జ‌లుక‌డుతున్న ప‌న్నుల‌తో…

25 minutes ago

‘మహేష్’ వివాదంపై స్పందించిన శ్రీలీల

ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…

2 hours ago

పవన్ పారితోషికం లక్షల్లోనే అయినా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్‌గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…

6 hours ago

‘అన్న’ అనే ప‌దానికి జ‌గ‌న్ క‌ళంకం: ష‌ర్మిల‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి నిప్పులు చెరిగారు. 'అన్న‌'…

8 hours ago

విమాన సంస్థ‌ల‌పై కొర‌డా.. 60 శాతం సీట్లు ‘ఫ్రీ’

దేశంలో విమానయాన సంస్థ‌ల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న…

8 hours ago

ఏపీలో ‘దివ్యాంగ శక్తి’.. క‌లిసి ప్ర‌యాణించిన బాబు-ప‌వ‌న్‌!

ఏపీలో మ‌రో కీల‌క ప‌థ‌కం ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి వ‌చ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక ప‌థ‌కాన్ని సీఎం చంద్ర‌బాబు, ఉప…

8 hours ago