టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు, రిమాండ్ ల నేపథ్యంలో ఇటు మీడియాలో, అటు సోషల్ మీడియాలో టీడీపీ, వైసీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానుల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. చంద్రబాబును అక్రమ కేసులో ఇరికించి అన్యాయంగా అరెస్టు చేశారని టీడీపీ అభిమానులు వాదిస్తుండగా…ఆ నిజాయితీని కోర్టులో నిరూపించుకొని బయటకు రావాలని వైసీపీ అభిమానులు అంటున్నారు. ఇక, ఈ మాటల యుద్ధం సోషల్ మీడియాను దాటి ఫ్లెక్సీ వరకు వెళ్లింది. ఈ క్రమంలోనే చంద్రబాబు అరెస్టును సెలబ్రేట్ చేసుకుంటూ…సీనియర్ ఎన్టీఆర్ ఆత్మశాంతించిందని వైసీపీ జూ.ఎన్టీఆర్ అభిమానులు వేసిన ఫ్లెక్సీలు వైరల్ గా మారాయి.
బొబ్బర్లంక జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పేరుతో వెలిసిన ఫ్లెక్సీలు నెట్టింట వైరల్ గా మారాయి. ‘‘థ్యాంక్యూ జగన్…నా ఆత్మకు శాంతి కలిగించావు..చివరి రోజుల్లో నన్ను ఎన్నో అవమానాలకు, మానసిక క్షోభకు గురి చేసి నా మరణానికి కారణమైన నీచుడు చంద్రబాబు. నా మరణాన్ని వాడుకొని, నేను చనిపోయిన తర్వాత నా కొడుకు హరికృష్ణ మరణాన్ని కుటిల రాజకీయాలకు వాడుకొని, చివరకు లోకేష్ రాజకీయాల కోసం నా మనవడు తారక రత్న మరణాన్ని కూడా వాడుకున్నారు. సెప్టెంబరు 10 చంద్రబాబును జైలుకు పంపడంతో నా ఆత్మకు శాంతి కలిగింది. అందుకే, సెప్టెంబరు 10న తెలుగు ప్రజలంతా ‘ఆత్మ శాంతి’ దినోత్సవంగా జరుపుకోవాలి…ఇట్లు..సీనియర్ ఎన్టీఆర్ ’’ అంటూ ఫ్లెక్సీలు వెలిశాయి.
అంతుకుముందు, వైసీపీ నేత లక్ష్మీ పార్వతి కూడా ఇదే తరహాలో చంద్రబాబు అరెస్టయిన రోజు ఆయన ఆత్మ శాంతించిందని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ఘాట్ దగ్గరకు వెళ్లి ఎన్టీఆర్ కు నివాళులు అర్పించిన ఆమె..ఈ వ్యాఖ్యలు చేశారు. ఆమెతోపాటు పలువురు వైసీపీ నేతలు కూడా ఇదే తరహా కామెంట్లు చేయడం, ఆ కామెంట్లు జూ.ఎన్టీఆర్ అభిమానులు ఫ్లెక్సీగా వేయడం సంచలనం రేపుతోంది.
This post was last modified on September 11, 2023 6:23 pm
లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి లాంటి చిన్న సినిమాలు పెద్ద విజయాలు సాధించడంలో నిర్మాతలు బన్నీ వాస్, వంశీ…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం తొలిసారి `విజయ్ దివస్` పేరుతో కీలక కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ నెల 9న(మంగళవారం) రాష్ట్ర వ్యాప్తంగా…
ఒకప్పుడు గోవా అంటే యూత్ కి అదో డ్రీమ్ డెస్టినేషన్. ఫ్రెండ్స్ తో ప్లాన్ వేస్తే ఫస్ట్ గుర్తొచ్చేది గోవానే.…
కేరళలో సంచలనం సృష్టించిన నటి కిడ్నాప్ కేసులో హీరో దిలీప్కు ఎనిమిదేళ్ల తర్వాత బిగ్ రిలీఫ్ దక్కింది. ఎర్నాకులం కోర్టు…
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ దురంధర్ అన్ని విషయాల్లో సోషల్ మీడియా టాపిక్ గా మారిపోయింది. రిలీజ్ ముందువరకు ఏమంత…
పలుమార్లు కరెంట్ బిల్లు చూసి సామాన్యుడికి షాక్ కొట్టడం కామనే. కానీ త్వరలో ఈ టెన్షన్ తగ్గబోతోంది. మన కరెంట్…