అధిష్ఠానం ఆదేశిస్తే గజ్వేల్ నుంచి పోటీ చేసేందుకు సిద్ధం.. ఇదీ చాలా కాలంగా బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చెబుతున్న మాటలు. గజ్వేల్ సీఎం కేసీఆర్ నియోజకవర్గం. దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ పై పోటీకి ఈటల సై అన్నారు. మరోవైపు ఈ సారి గజ్వేల్ తో పాటు కామారెడ్డి నుంచి కూడా పోటీ చేయాలని కేసీఆర్ నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గజ్వేల్ లో కేసీఆర్ కు ప్రధాన పార్టీల నుంచి పోటీని ఇచ్చేదెవరనే ఆసక్తి నెలకొంది. బీజేపీ నుంచి ఈటల రాజేందర్ పోటీ చేస్తారనిపించింది. కానీ ఇప్పుడు ఈటల భార్య జమున పోటీకి సిద్ధమవుతున్నట్లు ప్రచారం సాగుతోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్న బీజేపీ ఆశావహుల నుంచి పార్టీ దరఖాస్తులు స్వీకరించింది. అయితే గజ్వేల్ నియోజకవర్గం నుంచి పోటీకి ఈటల భార్య జమున పేరు మీద దరఖాస్తు రావడం చర్చనీయాంశంగా మారింది. జమున అభ్యర్థిత్వం కోసం కార్యకర్తలు దరఖాస్తు సమర్పించారు. దీంతో ప్రస్తుతం హుజూరాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న ఈటల మరోసారి అక్కడి నుంచే పోటీ చేసే ఆస్కారముంది.
గజ్వేల్ లో మాత్రం భార్యను నిలబెట్టాలని ఈటల చూస్తున్నట్లు చెబుతున్నారు. మరోవైపు గజ్వేల్ టికెట్ కోసం ఈటల పేరుతోనూ కార్యకర్తలు దరఖాస్తు సమర్పించారు. అయితే ఇవి కార్యకర్తలు చేసిన దరఖాస్తులని, వీటితో ఈటలకు సంబంధం లేదని ఆయన వర్గం చెబుతోంది. హుజూరాబాద్ టికెట్ కోసం ఈటల దరఖాస్తు చేసుకోలేదు. అయితే ఈ దరఖాస్తు ప్రక్రియ అంతా ఉత్తదేనని, కీలక నాయకులకు ఎలాగో టికెట్లు వస్తాయనే టాక్ ఉంది.
మరోవైపు సినీ నటుడు, మాజీ మంత్రి బాబూ మోహన్ కూడా బీజేపీ తరపున దరఖాస్తు చేసుకున్నారు. ఆందోలు టికెట్ కోసం ఆయన ఆర్జీ పెట్టుకున్నారు. ఇక సినీ నటి, నిర్మాత, దర్శకురాలు జీవిత ఏకంగా అయిదు నియోజకవర్గాల నుంచి టికెట్ కోసం దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. సనత్ నగర్, సికింద్రాబాద్, జూబ్లీహిల్స్, కూకట్ పల్లి, శేరిలింగంపల్లి కోసం జీవిత దరఖాస్తు సమర్పించారు. ఇందులో ఏదో ఒక దానికైనా టికెట్ రాకపోతుందా అన్నది ఆమె ఆలోచనగా తెలుస్తోంది.
This post was last modified on September 11, 2023 8:41 pm
వైసీపీ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ భాస్కర్ (అనంతబాబు) డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుపై శుక్రవారం సుప్రీంకోర్టు లో విచారణ…
తమిళ స్టార్ హీరో ధనుష్, బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మధ్య బంధం గురించి గత కొన్ని నెలలుగా ఎంత…
టాలీవుడ్లో భోజన ప్రియులుగా కొందరు హీరోలకు పేరుంది. అందులో జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ల పేర్లు ముందు వరుసలో ఉంటాయి. తనకు…
బాలీవుడ్ అతి పెద్ద బ్లాక్ బస్టర్ సాధించిన హీరో రణ్వీర్ సింగ్ విచిత్రమైన పరిస్థితిలో ఉన్నాడు. దురంధర్ 2 తర్వాత…
ఇరు తెలుగు రాష్ట్రాలకు 'సర్' వస్తున్నారు.. దేశవ్యాప్తంగా ఓటరు జాబితాలను సమగ్రంగా పరిశీలించేందుకు భారత ఎన్నికల సంఘం ‘స్పెషల్ ఇంటెన్సివ్…
టీ20 వరల్డ్ కప్ 2026 లీగ్ దశ ముగిసి అసలైన మజా మొదలవ్వబోతోంది. ఈసారి సూపర్ 8 గ్రూపులు ఫైనల్…