రాష్ట్ర, జాతీయ స్థాయిలోనే కాదు.. అంతర్జాతీయ స్థాయిలోనూ మంచి పేరు, విజన్ ఉన్న నాయకుడిగా మంచి హవా సొంతం చేసుకున్న ఏకైక నాయకుడు టీడీపీ అధినేత చంద్రబాబు. ఆయనంటే ఎంతో గౌరవం. ఎంతో మర్యాద ఇచ్చే దేశాలు కూడా ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. మరి అలాంటి నాయకుడు, పైగా 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసి, ఐటీకి కేంద్రంగా మారిన వ్యక్తిని అరెస్టు చేయడం, రాత్రికి రాత్రికి జైలుకు తరలించడం వంటి పరిణామాలను అంత తేలికగా తీసుకునే అవకాశం లేదని పరిశీలకులు చెబుతున్నారు.
అయితే, ఇంత జరగడం వెనుక.. కేవలం వైసీపీ ప్రభుత్వ పాత్ర ఒక్కటే లేదన్నది పొలిటికల్గా ఇప్పుడు రాష్ట్ర, జాతీయ స్థాయిలో జరుగుతున్న చర్చగా విశ్లేషకులు చెబుతున్నారు. ఏపీలో పాగా వేయాలని కలలు కంటున్న కేంద్రంలోని బీజేపీ పెద్దల దన్ను లేకుండా.. రాష్ట్రంలో వైసీపీ సర్కారు చంద్రబాబు వంటి బలమైన ప్రజాదరణ, అంతకు మించిన విజన్ ఉన్న నాయకుడిని అరెస్టు చేసే సాహసం చేయబోదన్నది రాజకీయ పండితుల మాట. పైగా.. వచ్చే ఎన్నికలకు సమయం కూడా చేరువ అయిన నేపథ్యంలో ఇలాంటి సాహసానికి వడిగట్టే ప్రయత్నం చేయదని చెబుతున్నారు.
ఇదంతా కూడా.. కేంద్రంలోని పెద్దల స్కెచ్గా కొందరు రాజకీయ పండితులు చెబుతున్నారు. ఏపీలో టీడీపీని విచ్ఛిన్నం చేయడం ద్వారా.. ఇక్కడ బీజేపీని బలోపేతం చేసుకునే కుట్ర ఏదో జరుగుతోందన్న ది రాజకీయంగా తలపండిన నాయకులు చెబుతున్న మాట. దీనిలో భాగంగానే రాష్ట్ర సర్కారు భుజంపై నుంచి తుపాకీని పేలుస్తున్నట్టు వారు సందేహిస్తున్నారు. పైగా.. చంద్రబాబు విజన్ను కొన్ని నెలల కిందట మెచ్చుకున్న పీఎం మోడీ… ఇప్పుడు కనీసం.. చంద్రబాబు అరెస్టు, రిమాండ్ విషయంలో ఎందుకు రియాక్ట్ కాలేదన్నది కూడా ఈ సందేహాలకు తావిస్తోందన్నది రాజకీయ పండితుల మాట.
మరోవైపు.. చంద్రబాబు అరెస్టును ఖండిస్తున్నామని చెప్పిన రాష్ట్ర బీజేపీ నాయకులు.. బంద్కు మాత్రం సహకరించేది లేదని చెప్పడం వెనుక కేంద్రంలోని పెద్దల నుంచి వచ్చిన సూచనలు ఉన్నాయనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయని రాజకీయ నాయకులు, విశ్లేషకులు అనుమానిస్తున్నారు. దీనికి ముందు కూడా.. 118 కోట్ల రూపాయల విషయంపై ఐటీ నోటీసులు ఇవ్వడం.. ఆ వెంటనే సీఐడీ.. స్కిల్ కుంభకోణం అంటూ.. కేసు పెట్టడం వంటి పరిణామాలను గమనిస్తే.. బాబు అరెస్టు, రిమాండ్ వెనుక.. ఏదో జరుగుతోందని స్పష్టంగా తెలుస్తోందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి ఏది నిజమో తేలాలంటే.. కొన్నాళ్లు వెయిట్ చేయకతప్పదేమో!!
ఇంట గెలిచి రచ్చ గెలవాలి అని ఒక సామెత. కొందరు మాత్రం రచ్చ గెలిచి, తర్వాత ఇంటికి వస్తుంటారు. శోభిత…
పెద్ది ఇప్పుడు రామ్ చరణ్ కెరీర్లో మరో చాలెంజ్ లాంటి ప్రాజెక్టు. RRR తర్వాత వచ్చిన గ్లోబల్ ఇమేజ్ని నిలబెట్టుకోవాలి.…
ఇది మార్కెటింగ్ యుగం. వస్తువైనా సినిమా అయినా దాన్ని జనంలోకి తీసుకెళ్లాలంటే ప్రచారం తప్పనిసరి. కంటెంట్ ఉంటే చాలు ఇంకేం…
టాలీవుడ్ టాప్ హీరోలు వేగంగా సినిమాలు చేయాలని, ఏడాదికి ఒకట్రెండు రిలీజ్లు ఉండేలా చూసుకోవాలని ఇటు ఇండస్ట్రీ జనాలు, అటు…
ఒకప్పుడు యాక్షన్ కింగ్ గా మాస్ ప్రేక్షకులకు బాగా దగ్గరైన హీరో అర్జున్. తెలుగులో మా పల్లెలో గోపాలుడు లాంటి…
రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఈ ఐపీఎల్ సీజన్ను పూర్తిగా తన సొంతం…