రాష్ట్ర, జాతీయ స్థాయిలోనే కాదు.. అంతర్జాతీయ స్థాయిలోనూ మంచి పేరు, విజన్ ఉన్న నాయకుడిగా మంచి హవా సొంతం చేసుకున్న ఏకైక నాయకుడు టీడీపీ అధినేత చంద్రబాబు. ఆయనంటే ఎంతో గౌరవం. ఎంతో మర్యాద ఇచ్చే దేశాలు కూడా ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. మరి అలాంటి నాయకుడు, పైగా 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసి, ఐటీకి కేంద్రంగా మారిన వ్యక్తిని అరెస్టు చేయడం, రాత్రికి రాత్రికి జైలుకు తరలించడం వంటి పరిణామాలను అంత తేలికగా తీసుకునే అవకాశం లేదని పరిశీలకులు చెబుతున్నారు.
అయితే, ఇంత జరగడం వెనుక.. కేవలం వైసీపీ ప్రభుత్వ పాత్ర ఒక్కటే లేదన్నది పొలిటికల్గా ఇప్పుడు రాష్ట్ర, జాతీయ స్థాయిలో జరుగుతున్న చర్చగా విశ్లేషకులు చెబుతున్నారు. ఏపీలో పాగా వేయాలని కలలు కంటున్న కేంద్రంలోని బీజేపీ పెద్దల దన్ను లేకుండా.. రాష్ట్రంలో వైసీపీ సర్కారు చంద్రబాబు వంటి బలమైన ప్రజాదరణ, అంతకు మించిన విజన్ ఉన్న నాయకుడిని అరెస్టు చేసే సాహసం చేయబోదన్నది రాజకీయ పండితుల మాట. పైగా.. వచ్చే ఎన్నికలకు సమయం కూడా చేరువ అయిన నేపథ్యంలో ఇలాంటి సాహసానికి వడిగట్టే ప్రయత్నం చేయదని చెబుతున్నారు.
ఇదంతా కూడా.. కేంద్రంలోని పెద్దల స్కెచ్గా కొందరు రాజకీయ పండితులు చెబుతున్నారు. ఏపీలో టీడీపీని విచ్ఛిన్నం చేయడం ద్వారా.. ఇక్కడ బీజేపీని బలోపేతం చేసుకునే కుట్ర ఏదో జరుగుతోందన్న ది రాజకీయంగా తలపండిన నాయకులు చెబుతున్న మాట. దీనిలో భాగంగానే రాష్ట్ర సర్కారు భుజంపై నుంచి తుపాకీని పేలుస్తున్నట్టు వారు సందేహిస్తున్నారు. పైగా.. చంద్రబాబు విజన్ను కొన్ని నెలల కిందట మెచ్చుకున్న పీఎం మోడీ… ఇప్పుడు కనీసం.. చంద్రబాబు అరెస్టు, రిమాండ్ విషయంలో ఎందుకు రియాక్ట్ కాలేదన్నది కూడా ఈ సందేహాలకు తావిస్తోందన్నది రాజకీయ పండితుల మాట.
మరోవైపు.. చంద్రబాబు అరెస్టును ఖండిస్తున్నామని చెప్పిన రాష్ట్ర బీజేపీ నాయకులు.. బంద్కు మాత్రం సహకరించేది లేదని చెప్పడం వెనుక కేంద్రంలోని పెద్దల నుంచి వచ్చిన సూచనలు ఉన్నాయనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయని రాజకీయ నాయకులు, విశ్లేషకులు అనుమానిస్తున్నారు. దీనికి ముందు కూడా.. 118 కోట్ల రూపాయల విషయంపై ఐటీ నోటీసులు ఇవ్వడం.. ఆ వెంటనే సీఐడీ.. స్కిల్ కుంభకోణం అంటూ.. కేసు పెట్టడం వంటి పరిణామాలను గమనిస్తే.. బాబు అరెస్టు, రిమాండ్ వెనుక.. ఏదో జరుగుతోందని స్పష్టంగా తెలుస్తోందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి ఏది నిజమో తేలాలంటే.. కొన్నాళ్లు వెయిట్ చేయకతప్పదేమో!!
This post was last modified on September 11, 2023 2:33 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…