టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి అరెస్టు, రిమాండ్, జైలుకు తరలింపు విషయాలు ఆంధ్రప్రదేశ్ తో పాటు జాతీయ రాజకీయాల్లోనూ సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు 14 రోజుల రిమాండ్ లో భాగంగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఈ ఘటనపై ఇప్పుడు న్యాయ పోరాటానికి టీడీపీ సిద్ధమైంది. సోమవారం రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చింది. అంతే కాకుండా యువ నాయకుడు, చంద్రబాబు తనయుడు నారా లోకేష్ సారథ్యంలో ముందుకు సాగుతామని టీడీపీ నాయకులు అంటున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న లోకేష్ తమ పోరాటానికి నేత్రుత్వం వహిస్తారని పార్టీ నాయకులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో ఇప్పుడు పార్టీలో లోకేష్ తో ఎవరున్నారు? ఆయనకు వ్యతిరేక వర్గం ఎవరో బయటపడే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పార్టీలో ఇప్పటికే లోకేష్ అనుకూల, వ్యతిరేక వర్గాలున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి బలాన్ని చేకూర్చేలా కొన్ని సంఘటనలు కూడా జరిగాయని చెప్పొచ్చు. పార్టీ అధినేత చంద్రబాబుకు అనుకూలంగా ఉండే కొంతమంది సీనియర్ నేతలు.. యువ నాయకుడు లోకేష్ విషయంలో మాత్రం అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారనే టాక్ ఉంది.
అంతే కాకుండా పార్టీలో లోకేష్ కు ప్రత్యేకంగా ఓ వర్గం ఉందని కూడా చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో పార్టీలోని సీనియర్ నాయకులే లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఉదంతాలున్నాయని అంటున్నారు. ఇక ఇటీవల లోకేష్ యువగళం పాదయాత్ర వైపు ఇద్దరు టీడీపీ ఎంపీలు కన్నెత్తి కూడా చూడలేదనే వ్యాఖ్యలు వినిపించిన సంగతి తెలిసిందే. కానీ లోకేష్ ను పట్టించుకోని ఆ ఇద్దరు ఎంపీలు మాత్రం.. బాబుతో సన్నిహితంగానే మెలుగుతున్నారు. మరి ఇలాంటి నాయకులు ఇప్పుడు న్యాయ పోరాటంలో లోకేష్ ఆధ్వర్యంలో పని చేస్తారా? అన్నది సందేహంగా మారిందని టాక్. దీంతో లోకేష్ తో ఎవరున్నారో ఇప్పుడు తేలిపోతుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
This post was last modified on September 11, 2023 4:04 pm
స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అని సినిమాల్లో చూడటమే కానీ నిజ జీవితంలో దాన్ని ఆచరించే వాళ్ళను వేళ్ళ మీద…
ఒక జడ్జి ప్రజల్ని చీమలతో పోల్చితో మరొకరు నిరుద్యోగులను బొద్దింకలతో పోల్చడం దేశ ప్రజలను విస్మయానికి గురి చేసింది. దాని…
ది ప్యారడైజ్.. దసరా లాంటి రా అండ్ రస్టిక్ బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న కాంబినేషన్ కావడంతో దీనిపై అంచనాలు…
అదేంటో గానీ... ఉన్న రోగానికి మందేస్తే... ఆ రోగం సంగతేమో గానీ... కొత్త రోగం వచ్చి పడుతోంది. ఈ తరహా…
మన నిర్మాతలు ఈ మధ్య బౌండరీలు దాటేసి, వేరే ఇండస్ట్రీల సూపర్ స్టార్లతో సినిమాలు చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్…
జంతర్ మంతర్లో కాక్రోచ్ జనతా పార్టీ చేసిన ఆందోళన విరమించినప్పటికీ అది సృష్టించిన తుఫాన్ కొనసాగుతుంది. సద్దుమణిగిందనుకున్న విషయాన్ని శుక్రవారం…