టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి అరెస్టు, రిమాండ్, జైలుకు తరలింపు విషయాలు ఆంధ్రప్రదేశ్ తో పాటు జాతీయ రాజకీయాల్లోనూ సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు 14 రోజుల రిమాండ్ లో భాగంగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఈ ఘటనపై ఇప్పుడు న్యాయ పోరాటానికి టీడీపీ సిద్ధమైంది. సోమవారం రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చింది. అంతే కాకుండా యువ నాయకుడు, చంద్రబాబు తనయుడు నారా లోకేష్ సారథ్యంలో ముందుకు సాగుతామని టీడీపీ నాయకులు అంటున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న లోకేష్ తమ పోరాటానికి నేత్రుత్వం వహిస్తారని పార్టీ నాయకులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో ఇప్పుడు పార్టీలో లోకేష్ తో ఎవరున్నారు? ఆయనకు వ్యతిరేక వర్గం ఎవరో బయటపడే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పార్టీలో ఇప్పటికే లోకేష్ అనుకూల, వ్యతిరేక వర్గాలున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి బలాన్ని చేకూర్చేలా కొన్ని సంఘటనలు కూడా జరిగాయని చెప్పొచ్చు. పార్టీ అధినేత చంద్రబాబుకు అనుకూలంగా ఉండే కొంతమంది సీనియర్ నేతలు.. యువ నాయకుడు లోకేష్ విషయంలో మాత్రం అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారనే టాక్ ఉంది.
అంతే కాకుండా పార్టీలో లోకేష్ కు ప్రత్యేకంగా ఓ వర్గం ఉందని కూడా చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో పార్టీలోని సీనియర్ నాయకులే లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఉదంతాలున్నాయని అంటున్నారు. ఇక ఇటీవల లోకేష్ యువగళం పాదయాత్ర వైపు ఇద్దరు టీడీపీ ఎంపీలు కన్నెత్తి కూడా చూడలేదనే వ్యాఖ్యలు వినిపించిన సంగతి తెలిసిందే. కానీ లోకేష్ ను పట్టించుకోని ఆ ఇద్దరు ఎంపీలు మాత్రం.. బాబుతో సన్నిహితంగానే మెలుగుతున్నారు. మరి ఇలాంటి నాయకులు ఇప్పుడు న్యాయ పోరాటంలో లోకేష్ ఆధ్వర్యంలో పని చేస్తారా? అన్నది సందేహంగా మారిందని టాక్. దీంతో లోకేష్ తో ఎవరున్నారో ఇప్పుడు తేలిపోతుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
This post was last modified on September 11, 2023 4:04 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…