టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి అరెస్టు, రిమాండ్, జైలుకు తరలింపు విషయాలు ఆంధ్రప్రదేశ్ తో పాటు జాతీయ రాజకీయాల్లోనూ సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు 14 రోజుల రిమాండ్ లో భాగంగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఈ ఘటనపై ఇప్పుడు న్యాయ పోరాటానికి టీడీపీ సిద్ధమైంది. సోమవారం రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చింది. అంతే కాకుండా యువ నాయకుడు, చంద్రబాబు తనయుడు నారా లోకేష్ సారథ్యంలో ముందుకు సాగుతామని టీడీపీ నాయకులు అంటున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న లోకేష్ తమ పోరాటానికి నేత్రుత్వం వహిస్తారని పార్టీ నాయకులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో ఇప్పుడు పార్టీలో లోకేష్ తో ఎవరున్నారు? ఆయనకు వ్యతిరేక వర్గం ఎవరో బయటపడే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పార్టీలో ఇప్పటికే లోకేష్ అనుకూల, వ్యతిరేక వర్గాలున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి బలాన్ని చేకూర్చేలా కొన్ని సంఘటనలు కూడా జరిగాయని చెప్పొచ్చు. పార్టీ అధినేత చంద్రబాబుకు అనుకూలంగా ఉండే కొంతమంది సీనియర్ నేతలు.. యువ నాయకుడు లోకేష్ విషయంలో మాత్రం అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారనే టాక్ ఉంది.
అంతే కాకుండా పార్టీలో లోకేష్ కు ప్రత్యేకంగా ఓ వర్గం ఉందని కూడా చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో పార్టీలోని సీనియర్ నాయకులే లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఉదంతాలున్నాయని అంటున్నారు. ఇక ఇటీవల లోకేష్ యువగళం పాదయాత్ర వైపు ఇద్దరు టీడీపీ ఎంపీలు కన్నెత్తి కూడా చూడలేదనే వ్యాఖ్యలు వినిపించిన సంగతి తెలిసిందే. కానీ లోకేష్ ను పట్టించుకోని ఆ ఇద్దరు ఎంపీలు మాత్రం.. బాబుతో సన్నిహితంగానే మెలుగుతున్నారు. మరి ఇలాంటి నాయకులు ఇప్పుడు న్యాయ పోరాటంలో లోకేష్ ఆధ్వర్యంలో పని చేస్తారా? అన్నది సందేహంగా మారిందని టాక్. దీంతో లోకేష్ తో ఎవరున్నారో ఇప్పుడు తేలిపోతుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
This post was last modified on September 11, 2023 4:04 pm
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…
పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే వచ్చే ఘట్టం. దాన్ని ఘనంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ప్రతి కుటుంబంలోనూ పెళ్లిని…
టాలీవుడ్ కు సంబంధించి హైదరాబాద్ ఇవాళ రెండు కీలక ఘట్టాలకు సాక్ష్యంగా నిలబడుతోంది. నెట్ ఫ్లిక్స్ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి…
మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…
అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అటవీ శాఖ అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ…
రాజకీయాలంటే అంతే. అడుగుపెట్టాక చాలా బురదను కడుక్కోవాల్సి ఉంటుంది. కొందరు తట్టుకుంటారు. కొందరు వదిలేస్తారు. చిరంజీవి ప్రజారాజ్యం విషయంలో ఎక్కడైతే…