టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి అరెస్టు, రిమాండ్, జైలుకు తరలింపు విషయాలు ఆంధ్రప్రదేశ్ తో పాటు జాతీయ రాజకీయాల్లోనూ సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు 14 రోజుల రిమాండ్ లో భాగంగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఈ ఘటనపై ఇప్పుడు న్యాయ పోరాటానికి టీడీపీ సిద్ధమైంది. సోమవారం రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చింది. అంతే కాకుండా యువ నాయకుడు, చంద్రబాబు తనయుడు నారా లోకేష్ సారథ్యంలో ముందుకు సాగుతామని టీడీపీ నాయకులు అంటున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న లోకేష్ తమ పోరాటానికి నేత్రుత్వం వహిస్తారని పార్టీ నాయకులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో ఇప్పుడు పార్టీలో లోకేష్ తో ఎవరున్నారు? ఆయనకు వ్యతిరేక వర్గం ఎవరో బయటపడే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పార్టీలో ఇప్పటికే లోకేష్ అనుకూల, వ్యతిరేక వర్గాలున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి బలాన్ని చేకూర్చేలా కొన్ని సంఘటనలు కూడా జరిగాయని చెప్పొచ్చు. పార్టీ అధినేత చంద్రబాబుకు అనుకూలంగా ఉండే కొంతమంది సీనియర్ నేతలు.. యువ నాయకుడు లోకేష్ విషయంలో మాత్రం అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారనే టాక్ ఉంది.
అంతే కాకుండా పార్టీలో లోకేష్ కు ప్రత్యేకంగా ఓ వర్గం ఉందని కూడా చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో పార్టీలోని సీనియర్ నాయకులే లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఉదంతాలున్నాయని అంటున్నారు. ఇక ఇటీవల లోకేష్ యువగళం పాదయాత్ర వైపు ఇద్దరు టీడీపీ ఎంపీలు కన్నెత్తి కూడా చూడలేదనే వ్యాఖ్యలు వినిపించిన సంగతి తెలిసిందే. కానీ లోకేష్ ను పట్టించుకోని ఆ ఇద్దరు ఎంపీలు మాత్రం.. బాబుతో సన్నిహితంగానే మెలుగుతున్నారు. మరి ఇలాంటి నాయకులు ఇప్పుడు న్యాయ పోరాటంలో లోకేష్ ఆధ్వర్యంలో పని చేస్తారా? అన్నది సందేహంగా మారిందని టాక్. దీంతో లోకేష్ తో ఎవరున్నారో ఇప్పుడు తేలిపోతుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
This post was last modified on September 11, 2023 4:04 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…