స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు విజయవాడలోని ఏసీబీ కోర్టు 14 రోజుల జుడీషియల్ రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో, చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే, చంద్రబాబు రిమాండ్ ను హౌస్ అరెస్ట్ గా మార్చాలంటూ చంద్రబాబు తరఫు న్యాయవాదులు ఏసీబీ కోర్టును కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి, వయసు, హోదాను దృష్టిలో పెట్టుకొని హౌస్ అరెస్ట్ కు అనుమతినివ్వాలని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా…ఏసీబీ కోర్టుకు విజ్ఞప్తి చేశారు.
ఆ హౌస్ అరెస్ట్ పిటిషన్ ను సీఐడీ తరఫు న్యాయవాది వ్యతిరేకించారు. ఈ క్రమంలోనే ఆ అంశంపై వాదోపవాదాలు విన్న ఏసీబీ కోర్టు న్యాయమూర్తి హిమ బిందు ఆ పిటిషన్పై విచారణ రేపటికి వాయిదా వేశారు. అయితే, రాజమండ్రి జైలులో చంద్రబాబుకు ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్షనేత కావడం, జడ్ ప్లస్ కేటగిరీ ఉన్న నేత కావడంతో జైలులో ప్రత్యేక గది, వసతి కల్పించాలని ఆదేశించింది. ఇంటి నుంచి ప్రత్యేక ఆహారం తీసుకొచ్చేందుకు అనుమతివ్వాలని జైలు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దాంతోపాటు, చంద్రబాబుకు అవసరమైన మందులు, వైద్య చికిత్స అందించాలని ఆదేశించింది.
మరోవైపు, చంద్రబాబును వారం రోజుల కస్టడీకి కోరుతూ సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది.ఆ పిటిషన్ పై రేపు విచారణ జరిగే అవకాశముంది. చంద్రబాబుకు రిమాండ్ విధించిన నేపథ్యంలో రేపు రాష్ట్ర బంద్ కు టీడీపీ పిలుపునిచ్చింది. అయితే, రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ రోజు పోలీసులు 144 సెక్షన్ విధించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ, రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు, నిరసనలకు టీడీపీ శ్రేణులు ప్రయత్నిస్తున్నాయి.
This post was last modified on September 10, 2023 10:18 pm
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…